Political News

వైసీపీ టు ఎన్డీఎ వయా జనసేన !

ఏపీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు పార్టీని వీడి అధికార పక్షంలో చేరడానికి ఆపసోపాలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలను పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు నిరాకరిస్తున్నాయి. అంతేకాకుండా ఎవరిని పార్టీలో చేర్చుకున్నా మూడు పార్టీల నేతల మధ్య చర్చ జరగాలని, గత ప్రభుత్వంలో ఎలాంటి ఆరోపణలు లేకుండా మంచి వ్యక్తులుగా ఉన్న వారినే చేర్చుకోవాలని నిబంధన పెట్టుకున్నాయి.

ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు టీడీపీ, జనసేన, బీజేపీలలో ఉన్న తమ సన్నిహితులతో ఏ పార్టీలో వీలయితే ఆ పార్టీలో చేరేందుకు పావులు సిద్దం చేసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీని వీడేందుకు తగిన కారణాలను కూడా వెతుక్కుంటున్నారు. గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ దక్కని మద్దాలి గిరి పార్టీ అధికారం కోల్పోవడంతో జిల్లా పార్టీ అధ్యక్ష్య పదవికి, పార్టీకి రాజీనామా చేశారు.

ఆ వెంటనే గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా పోటీ చేసిన రోశయ్య టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో 344695 ఓట్ల భారీ తేడాతో ఓటమి చవిచూశాడు.

అప్పటి నుండి పార్టీ మీద అలకతోనే ఉన్న రోశయ్య తన మామ, వైసీపీ సీనియర్ నేత అయిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు శాసనమండలిలో విపక్ష నేత హోదా ఇస్తారని భావించారట. విపక్ష నేతకు కేబినెట్ హోదా లభిస్తుందన్న ఆశతో ఉన్నా గుంటూరు జిల్లాకే చెందిన ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి వైసీపీ ఆ పదవిని కట్టబెట్టింది.

దీంతో వ్యూహాత్మకంగా రోశయ్య వైసీపీ రాజీనామా చేసినట్లు చెబుతున్నారు. అదే సమయంలో తిరుపతి జనసేన ఎమ్మెల్యే, తన వియ్యంకుడు అయిన అరణి శ్రీనివాసులు సహకారంతో జనసేన జెండా ఎత్తుకోవడానికి రోశయ్య ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. తనతో పాటు తన బావమరిది, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వెంకటరమణను కూడా జనసేనలోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి ఏదో ఒక విధంగా అధికార పక్షం వైపు చేరాలన్నదే వీరి ఉద్దేశంగా చెబుతున్నారు.

This post was last modified on July 27, 2024 12:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

17 minutes ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

24 minutes ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

54 minutes ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

2 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

3 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

5 hours ago