Political News

జగన్ – కేసీఆర్ దోస్తానా చెడ్డట్లేనా ?!

ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, 36 మందిని హత్య చేశారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగాడు. ఏపీలోని అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు.

ఈ నేపథ్యంలో ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని పలు పార్టీలు ధర్నా స్థలికి విచ్చేసి మద్దతు పలికాయి. అయితే ఈ ధర్నాను బీఆర్ఎస్ ఏ మాత్రం పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు ఉందన్న ప్రచారం ఉంది. 2024 ఎన్నికల్లోనూ జగన్ గెలుస్తున్నాడని, వైసీపీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ బహిరంగంగానే అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడంతో జగన్, కేసీఆర్ ల మధ్య దూరం పెరిగిందా ? ఇండియా కూటమికి జగన్ దగ్గరవ్వుతున్నాడన్న అసంతృప్తితోనే బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదా ? అన్న చర్చ మొదలయింది.

జగన్ ధర్నాకు పశ్చిమబెంగాల్ లోని టీఎంసీ, యూపీలోని సమాజ్ వాదీ పార్టీ, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, వీసీకే, మహారాష్ట్రలోని శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ, ఢిల్లీ, పంజాబ్ లలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు పలికినా ధర్నా వైపు బీఆర్ఎస్ ఎంపీలు కన్నెత్తి చూడలేదు.

కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు జగన్ ధర్నాకు మద్దతు పలకడంతో జగన్ పార్టీ కూటమిలో చేరుతుందన్న ఊహాగానాలు జాతీయ స్థాయిలో మొదలయ్యాయి. అయితే మొదటి నుండి ఎన్డీఎ కూటమి, ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ రెండు కూటములకు దూరంగా ఉంటున్నారు.

జగన్ ధర్నాకు వచ్చే పార్టీల సమాచారం ముందే తెలిసి ఉండడంతో జగన్ ధర్నాకు వెళ్లొద్దని, ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బీఆర్ఎస్ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క లోక్ సభ స్థానంలోనూ విజయం సాధించలేదు. అయితే ఆ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యుల బలం ఉంది.

This post was last modified on July 27, 2024 5:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

3 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

5 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

6 hours ago