ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ కార్యకర్తలు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, 36 మందిని హత్య చేశారని, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా ధర్నాకు దిగాడు. ఏపీలోని అన్ని జిల్లాలలో తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు వైసీపీ నేతలు, కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ఈ ధర్నాకు ఇండియా కూటమిలోని పలు పార్టీలు ధర్నా స్థలికి విచ్చేసి మద్దతు పలికాయి. అయితే ఈ ధర్నాను బీఆర్ఎస్ ఏ మాత్రం పట్టించుకోలేదు. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపు వెనక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మద్దతు ఉందన్న ప్రచారం ఉంది. 2024 ఎన్నికల్లోనూ జగన్ గెలుస్తున్నాడని, వైసీపీ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ బహిరంగంగానే అన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ధర్నాకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వకపోవడంతో జగన్, కేసీఆర్ ల మధ్య దూరం పెరిగిందా ? ఇండియా కూటమికి జగన్ దగ్గరవ్వుతున్నాడన్న అసంతృప్తితోనే బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదా ? అన్న చర్చ మొదలయింది.
జగన్ ధర్నాకు పశ్చిమబెంగాల్ లోని టీఎంసీ, యూపీలోని సమాజ్ వాదీ పార్టీ, తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే, వీసీకే, మహారాష్ట్రలోని శివసేన ఉద్దవ్ థాకరే పార్టీ, ఢిల్లీ, పంజాబ్ లలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీలు మద్దతు పలికినా ధర్నా వైపు బీఆర్ఎస్ ఎంపీలు కన్నెత్తి చూడలేదు.
కాంగ్రెస్ మినహా ఇండియా కూటమిలోని ప్రధాన పార్టీలు జగన్ ధర్నాకు మద్దతు పలకడంతో జగన్ పార్టీ కూటమిలో చేరుతుందన్న ఊహాగానాలు జాతీయ స్థాయిలో మొదలయ్యాయి. అయితే మొదటి నుండి ఎన్డీఎ కూటమి, ఇండియా కూటమికి ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ రెండు కూటములకు దూరంగా ఉంటున్నారు.
జగన్ ధర్నాకు వచ్చే పార్టీల సమాచారం ముందే తెలిసి ఉండడంతో జగన్ ధర్నాకు వెళ్లొద్దని, ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని బీఆర్ఎస్ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తుంది. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఒక్క లోక్ సభ స్థానంలోనూ విజయం సాధించలేదు. అయితే ఆ పార్టీకి రాజ్యసభలో నలుగురు సభ్యుల బలం ఉంది.
This post was last modified on July 27, 2024 5:29 pm
సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచారణకు వస్తాయి. న్యాయశాస్త్రంలో లబ్ధప్రతిష్టులైన అనేక మంది న్యాయవాదులు వాదనలు వినిపిస్తారు. ఇది…
రేపు కొత్త శుక్రవారం వచ్చేస్తోంది. సంక్రాంతి సినిమాల హడావిడి పూర్తిగా అయిపోవడంతో ఇప్పుడు మూవీ లవర్స్ దృష్టి వీటివైపు వెళ్లాల్సి…
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…