ఏపీ రాజధాని అమరావతిని అడ్డంగా నిలిపివేశారని.. అసలు రాజధానిని లేకుండా చేయాలని కూడా కుట్రలు చేశారని సీఎం చంద్రబాబు చెప్పారు. కానీ, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు. రాజధాని నిర్మాణం కొనసాగి ఉంటే.. ఇప్పటికే అది 3 లక్షల కోట్ల ఆదాయాన్ని ఇచ్చి ఉండేదని చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ ఆర్థిక శ్వేతపత్రంపై మాట్లాడుతూ.. రాజధాని గురించి ప్రస్తావించారు. దీనిని నిలిపివేసి పెద్ద తప్పు చేశారని అన్నారు.
వచ్చే మూడేళ్లలోనే అమరావతిని న్యూ ఎపిక్ సెంటర్ ద్వారా అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు(ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతోందని… అమరావతి కూడా.. ఏఐకి కేంద్రంగా మారుతుందని.. ఆ దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గత ఐదేళ్ల కాలంలో అమరావతి నిర్మాణం ముందుకు సాగి ఉంటే.. ప్రభుత్వానికి 3 లక్షల కోట్ల ఆస్తి వచ్చి ఉండేదన్నారు. అదేసమయంలో 7 లక్షల మందికి ఉద్యోగాలు, అంతకు మూడింతల మందికి ఉపాధి లభించేదని వివరించారు.
రాజధాని అమరావతికి మళ్లీ వైభవం తీసుకురానున్నట్టు చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే పక్కా వ్యూహం రెడీ చేసుకున్నామని.. మంత్రి నారాయణ ఆ పనిపైనే ఉన్నారని వివరించారు. వచ్చే మూడేళ్లలోనే ఒక రూపు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. తమ హయాంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని.. సేవల రంగంలోనూ దూసుకుపోయామని చెప్పారు.
కానీ, వైసీపీ హయాంలో ఈ రెండు రంగాలను నాశనం చేశారని వివరించారు. దీంతో జీఎస్డీపీ కంట్రిబ్యూషన్ రూ.6.94 లక్షల కోట్లు తగ్గిందని తెలిపారు. అదేవిధంగా ఆదాయం కూడా రూ.76,195 కోట్లు తగ్గిపోయిందని వివరించారు. దీనిని సెట్ రైట్ చేసేందుకు తాము రేయింబవళ్లు పనిచేయాల్సి ఉందని తెలిపారు. దీనిలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుందని.. అందరూ సమష్టిగా కృషి చేయాల్సి ఉందన్నారు.
This post was last modified on July 26, 2024 10:10 pm
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…