రాజకీయ నాయకులు అన్నాక ప్రెస్ మీట్లు పెట్టడం సహజం. ఒక్కక్కరు ఒక్కొక్క విధంగా మీడియా ప్రతి నిధులతో మాట్లాడతారు. టీడీపీ అధినేత చంద్రబాబు తరచుగా మీడియాతో కలసే ఉంటారు. జనసేన అధినే తపవన్ కూడా మీడియాకు దూరంగా అయితే ఏమీ ఉండరు. ఏపీ మాజీ సీఎం జగన్ మాత్రం మీడియాకు కడు దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. 2014-19 మధ్య విపక్షంగా ఉన్నా.. 2019-24 మధ్య అధికార పక్షంగా ఉన్నా.. కూడా జగన్ మీడియా ముందుకు వచ్చింది.. రెండు, మూడు సందర్భాలు మాత్రమే.
విపక్షంలో ఉన్నప్పుడు కూడా.. జగన్ మీడియాను పెద్దగా పట్టించుకోలేదు. ప్రజల్లోనే ఉన్నారు. వారితోనే సంభాషించారు. ఇక, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. ఒకే ఒక్కసారి ఢిల్లీలో మీడియాతో మాట్లాడా రు. తర్వాత.. 2021లో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలిని తప్పుపడు తూ.. ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారు జగన్. ఆ తర్వాత.. తరచుగా బహిరంగ సభలకు వెళ్తుండడం అక్కడే మాట్లాడుతుండడంతో సరిపుచ్చారు.
ఇక, ఇప్పుడు విపక్షంలోకి వచ్చారు. 11 మందితో కలిసి ఆయన ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కించు కోలేక పోయారు. ఈ క్రమంలో తొలిసారి రాష్ట్ర మీడియాతో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. విపక్షంలోకి వచ్చి న తర్వాత, సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కని తర్వాత.. ఢిల్లీలో ధర్నా చేసిన తర్వాత… జగన్ నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ ఇదే కావడం గమనార్హం. అయితే.. దీనిలోకొన్ని విశేషాలు.. ఆశ్చర్యాలు కూడా ఉన్నాయి. ఇవి మీడియాలో తెగ చర్చను పెంచేశాయి.
— ప్రెస్ మీట్కు వచ్చేవారు.. కెమెరాలు తీసుకురావద్దు (సాధారణంగా మీడియా కెమెరాలతోనే కదా కవర్ చేస్తుంది. కానీ.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రెస్ మీట్ కావడంతో ఆ ఇంటి పరిసరాలను వీడియో తీస్తారేమనని జగన్ భావించి ఉంటారు. అందుకే కెమెరాలకు నో ఎంట్రీ)
— తొలిసారి తాడేపల్లిలోకి మీడియా ఎంట్రీ: ఇప్పటి వరకు మీడియాకు కొన్ని ఆంక్షలు ఉన్నాయి. తాడేప ల్లి క్యాంపు కార్యాలయంలోకి మీడియా వెళ్లేందుకు ముందస్తు అనుమతులు ఉండాలి. అసలు రానివ్వరు కూడా. కానీ.. ఫస్ట్ టైమ్.. జగన్ ప్రెస్ మీట్ పెడుతున్న నేపథ్యంలో మీడియాను అనుమతించారు. ఓన్లీ విలేకరులు మాత్రమే రావాలని (పార్టీ బీట్ చూసేవారు మాత్రమే) వైసీపీ కేంద్ర కార్యాలయం స్పష్టం చేసింది. సో.. ఇదీ జగన్ ప్రెస్ మీట్ విశేషాలు.
— సాధారణంగా ప్రెస్ మీట్ అయ్యాక విశేషాలు ఉంటాయి. కానీ, జగన్ వైఖరే చిత్రం కదా.. ఆయన ప్రెస్ మీట్ కూడా విశేషంగా మారి.. వార్తగా తయారైంది!!
This post was last modified on July 26, 2024 3:08 pm
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…
తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…