ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిత్రమైన దృశ్యాలు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు, అక్రమాలు అన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం బయటికి తీస్తోంది. అప్పుడు జరిగిన అరాచకాలు, కుంభకోణాలు, దౌర్జన్యాల గురించి ప్రస్తావిస్తోంది. కానీ విమర్శలు, ఆరోపణలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షం లేదు. అనుకున్నట్లే జగన్ అండ్ కో అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు.
ఇందుకోసం చెబుతున్న కారణాలు ఏవైనా.. అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, ఓటమి తాలూకు అవమాన భారాన్ని తట్టుకోలేక జగన్ అసెంబ్లీ నుంచి పలాయనం చిత్తగించారనే అభిప్రాయం జనంలోనూ వ్యక్తమవుతోంది. ప్రతిపక్షం గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు అధికార పార్టీ నేతలు.. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.
తాజాగా అసెంబ్లీలో ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. జగన్ సర్కారు హయాంలో కేసులు ఎదుర్కొన్న నేతలందరూ లేచి నిలబడమని చంద్రబాబు గురువారం కోరగా.. ఒక్కసారిగా సభలో మెజారిటీ ఎమ్మెల్యేలు లేచి నిలుచున్నారు.
బాబు ఇలా అడగ్గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు వెంటనే లేచి నిలుచున్నారు. ఈ నంబర్ వంద దాటినా ఆశ్చర్యం లేదు. కేసులు లేకుండా కింద కూర్చున్న వాళ్లు చాలా తక్కువమంది.
గత ప్రభుత్వం మీద విమర్శలు చేసిన, పోరాడిన ప్రతి ఒక్కరి మీదా కేసులు పెట్టి వేధించారనడానికి ఇది రుజువు అని.. ఐతే జనం మాత్రం దీన్ని వేరే దృష్టితో చూశారని.. ఎవరు ఎక్కువ పోరాడి ఉంటే, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వారిని అంత భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించారని చంద్రబాబు అన్నారు. దీంతో అసెంబ్లీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
This post was last modified on July 25, 2024 5:07 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…