Political News

కేసులున్న ఎమ్మెల్యేలను నిల్చోబెట్టిన బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిత్రమైన దృశ్యాలు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు, అక్రమాలు అన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం బయటికి తీస్తోంది. అప్పుడు జరిగిన అరాచకాలు, కుంభకోణాలు, దౌర్జన్యాల గురించి ప్రస్తావిస్తోంది. కానీ విమర్శలు, ఆరోపణలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షం లేదు. అనుకున్నట్లే జగన్ అండ్ కో అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు.

ఇందుకోసం చెబుతున్న కారణాలు ఏవైనా.. అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, ఓటమి తాలూకు అవమాన భారాన్ని తట్టుకోలేక జగన్ అసెంబ్లీ నుంచి పలాయనం చిత్తగించారనే అభిప్రాయం జనంలోనూ వ్యక్తమవుతోంది. ప్రతిపక్షం గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు అధికార పార్టీ నేతలు.. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.

తాజాగా అసెంబ్లీలో ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. జగన్ సర్కారు హయాంలో కేసులు ఎదుర్కొన్న నేతలందరూ లేచి నిలబడమని చంద్రబాబు గురువారం కోరగా.. ఒక్కసారిగా సభలో మెజారిటీ ఎమ్మెల్యేలు లేచి నిలుచున్నారు.

బాబు ఇలా అడగ్గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు వెంటనే లేచి నిలుచున్నారు. ఈ నంబర్ వంద దాటినా ఆశ్చర్యం లేదు. కేసులు లేకుండా కింద కూర్చున్న వాళ్లు చాలా తక్కువమంది.

గత ప్రభుత్వం మీద విమర్శలు చేసిన, పోరాడిన ప్రతి ఒక్కరి మీదా కేసులు పెట్టి వేధించారనడానికి ఇది రుజువు అని.. ఐతే జనం మాత్రం దీన్ని వేరే దృష్టితో చూశారని.. ఎవరు ఎక్కువ పోరాడి ఉంటే, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వారిని అంత భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించారని చంద్రబాబు అన్నారు. దీంతో అసెంబ్లీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

This post was last modified on July 25, 2024 5:07 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

26 minutes ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

2 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

3 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

5 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago