Political News

కేసులున్న ఎమ్మెల్యేలను నిల్చోబెట్టిన బాబు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చిత్రమైన దృశ్యాలు చూస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలు, అక్రమాలు అన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం బయటికి తీస్తోంది. అప్పుడు జరిగిన అరాచకాలు, కుంభకోణాలు, దౌర్జన్యాల గురించి ప్రస్తావిస్తోంది. కానీ విమర్శలు, ఆరోపణలను ఎదుర్కోవడానికి ప్రతిపక్షం లేదు. అనుకున్నట్లే జగన్ అండ్ కో అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోయారు.

ఇందుకోసం చెబుతున్న కారణాలు ఏవైనా.. అధికార పక్షాన్ని ఎదుర్కోలేక, ఓటమి తాలూకు అవమాన భారాన్ని తట్టుకోలేక జగన్ అసెంబ్లీ నుంచి పలాయనం చిత్తగించారనే అభిప్రాయం జనంలోనూ వ్యక్తమవుతోంది. ప్రతిపక్షం గురించి పట్టించుకోకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు అధికార పార్టీ నేతలు.. గత ప్రభుత్వంలో జరిగిన దారుణాలను ప్రస్తావిస్తూనే ఉన్నారు.

తాజాగా అసెంబ్లీలో ఒక అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. జగన్ సర్కారు హయాంలో కేసులు ఎదుర్కొన్న నేతలందరూ లేచి నిలబడమని చంద్రబాబు గురువారం కోరగా.. ఒక్కసారిగా సభలో మెజారిటీ ఎమ్మెల్యేలు లేచి నిలుచున్నారు.

బాబు ఇలా అడగ్గానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు వెంటనే లేచి నిలుచున్నారు. ఈ నంబర్ వంద దాటినా ఆశ్చర్యం లేదు. కేసులు లేకుండా కింద కూర్చున్న వాళ్లు చాలా తక్కువమంది.

గత ప్రభుత్వం మీద విమర్శలు చేసిన, పోరాడిన ప్రతి ఒక్కరి మీదా కేసులు పెట్టి వేధించారనడానికి ఇది రుజువు అని.. ఐతే జనం మాత్రం దీన్ని వేరే దృష్టితో చూశారని.. ఎవరు ఎక్కువ పోరాడి ఉంటే, ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వారిని అంత భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించారని చంద్రబాబు అన్నారు. దీంతో అసెంబ్లీలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

This post was last modified on July 25, 2024 5:07 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

మొదటి రిలీజ్ 3 కోట్లు – రీ రిలీజ్ 7 కోట్లు

ఎప్పుడో ఆరేళ్ళ క్రితం రిలీజైన సినిమా. ఓటిటిలో వచ్చేసి అక్కడా మిలియన్ల వ్యూస్ సాధించుకుంది. ఇప్పుడు కొత్తగా రీ రిలీజ్…

6 hours ago

శంకర్ ఆడుతున్న ఒత్తిడి గేమ్

సెప్టెంబర్ నెల సగానికి పైనే అయిపోయింది. ఇకపై ఆకాశమే హద్దుగా గేమ్ ఛేంజర్ నాన్ స్టాప్ అప్డేట్స్ ఉంటాయని దిల్…

6 hours ago

ముందు లక్కు వెనుక చిక్కు

యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది.…

6 hours ago

జానీ మాస్ట‌ర్‌పై జ‌న‌సేన వేటు.. ఏం జ‌రిగింది?

జ‌న‌సేన పార్టీ నాయ‌కుడు, ప్ర‌ముఖ సినీ కొరియోగ్రాఫ‌ర్ జానీ మాస్ట‌ర్‌పై పార్టీ వేటు వేసింది. ఆయ‌న‌ను పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా…

6 hours ago

డిజాస్టర్ సినిమాకు రిపేర్లు చేస్తున్నారు

కొన్ని నెలల క్రితం లాల్ సలామ్ అనే సినిమా ఒకటొచ్చిందనే సంగతే చాలా మంది సగటు ప్రేక్షకులు మర్చిపోయి ఉంటారు.…

11 hours ago

చిన్న బడ్జెట్‌లతో పెద్ద అద్భుతాలు

స్టార్ హీరోలు నటించిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చి భారీ వసూళ్లు సాధించడంలో ఆశ్చర్యం లేదు. కానీ చిన్న బడ్జెట్…

11 hours ago