Political News

చంద్ర‌బాబు మారిన‌ట్టున్నారే.. !

టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్ర‌బాబు మారిన‌ట్టుగా క‌నిపిస్తోంది. చంద్ర‌బాబు పాల‌న అంటే.. సుదీర్ఘ స‌మీక్ష‌లు, అర్థ‌రాత్రి వ‌ర‌కు మీడియా మీటింగులు.. మైకు క‌నిపిస్తే వదల‌కుండా గంట‌ల త‌ర‌బ‌డి ఉప న్యాసాలు ఇచ్చే విధానం వంటివి గుర్తుకు వ‌స్తాయి. ఇక‌, అప్పుడప్పుడు త‌నిఖీల పేరుతో ఆయ‌న అధికారుల‌ను ప‌రుగులు పెట్టించ‌డం కూడా.. తెలిసిందే. దీని వ‌ల్ల పాల‌న తీరు ఎలా ఉన్నా.. అధికారులు, సిబ్బంది విష‌యంలో మాత్రం ఆయ‌న వ్య‌తిరేక‌త పెంచుకున్నారు.

ఈ ప‌నితీరు కార‌ణంగానే ఒక‌సారి అధికారం కూడా కోల్పోయారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఆయ‌న చేసిన ప్ర‌క‌ట‌న ఏంటంటే.. సుదీర్ఘ స‌మీక్ష‌ల‌కు ఇక స్వ‌స్తి చెబుతున్న‌ట్టు తెలిపారు. గంట‌ల త‌ర‌బ‌డి తాను స‌మీక్ష‌లు చేయ‌బోన‌ని.. అయితే.. అధికారులు తమ ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెట్టి తామే యంత్రాంగాల‌ను న‌డిపించుకోవాల‌న్నారు. తాను కేవ‌లం సూచ‌న‌లు మాత్ర‌మే చేస్తాన‌ని చెప్పారు. అదేస‌మయంలో అవినీతి, అక్ర‌మాల‌ను స‌హించేది లేద‌న్నారు.

ఇది మంచి ప‌రిణామ‌మే. అయితే.. ప్ర‌స్తుతం మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నా.. త‌న మార్కు కోసం చంద్ర‌బాబు త‌పిస్తార‌నేది తెలిసిందే. అయితే.. అంతా అధికారుల‌కే అప్ప‌గిస్తే.. చంద్ర‌బాబు మార్కు క‌నిపిస్తుందా? అనేది చూడాలి. ప్ర‌స్తుతం ఉన్న సామాజిక మాధ్య మాల వేగం పాల‌న‌పై ప్ర‌భావం చూపిస్తోంది. ఎక్క‌డ ఏం జ‌రిగినా క్ష‌ణాల్లోనే తెలిసిపోతోంది. ఒక్కొక్క‌సారి .. అధికారులు ఈ మాధ్య‌మాల వేగాన్ని సైతం అందుకోలేక పోతున్నారు.

ఏదేమైనా.. చంద్ర‌బాబు దూకుడు త‌గ్గిస్తాన‌ని చెప్ప‌డం ద్వారా అధికార యంత్రాగానికి ఫ్రీహ్యాండ్ ఇస్తాన‌ని ప్ర‌క‌టించ‌డం ద్వారా కొంత మేర‌కు.. ఆయ‌న ఒత్తిడి నుంచి దూర‌మ‌వుతున్నారు. అయితే.. ఆయన మార్కను త‌గ్గించుకోకుండా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్ర‌స్తుతం అనేక సంక్లిష్ట‌త‌లు ఉన్న ఏపీలో ఇప్పుడు చంద్ర‌బాబు మార్క కోసం.. ప్ర‌జ‌లు ఎదురు చూస్తున్నార‌న్న‌ది వాస్త‌వం. మ‌రి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.

This post was last modified on July 25, 2024 7:09 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రావిపుడి రామాయణం తీస్తే?

వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…

1 hour ago

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ…

2 hours ago

మాస్ మసాలా వదలని నాగశౌర్య

రంగబలి తర్వాత నాగశౌర్య తెరమీద కనిపించి రెండేళ్లు దాటిపోయింది. వరస డిజాస్టర్లతో మార్కెట్ డ్యామేజ్ అయిన టైంలో సరైన కంబ్యాక్…

2 hours ago

కేంద్రంలో పవన్ పట్టు పిఠాపురానికి వరం

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను గెలిపించుకున్న పిఠాపురం ప్రజలు... ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. నియోజకవర్గంలోని దాదాపుగా అన్ని…

2 hours ago

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్…

2 hours ago

9 మందికి పోలీసులకు ఉరిశిక్ష… సంచలన తీర్పు

తమిళనాడులోని:సాతాంకుళం లాకప్ డెత్ కేసులో మదురైలోని ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2020లో…

3 hours ago