టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు మారినట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు పాలన అంటే.. సుదీర్ఘ సమీక్షలు, అర్థరాత్రి వరకు మీడియా మీటింగులు.. మైకు కనిపిస్తే వదలకుండా గంటల తరబడి ఉప న్యాసాలు ఇచ్చే విధానం వంటివి గుర్తుకు వస్తాయి. ఇక, అప్పుడప్పుడు తనిఖీల పేరుతో ఆయన అధికారులను పరుగులు పెట్టించడం కూడా.. తెలిసిందే. దీని వల్ల పాలన తీరు ఎలా ఉన్నా.. అధికారులు, సిబ్బంది విషయంలో మాత్రం ఆయన వ్యతిరేకత పెంచుకున్నారు.
ఈ పనితీరు కారణంగానే ఒకసారి అధికారం కూడా కోల్పోయారు. అయితే.. ఇప్పుడు తాజాగా ఆయన చేసిన ప్రకటన ఏంటంటే.. సుదీర్ఘ సమీక్షలకు ఇక స్వస్తి చెబుతున్నట్టు తెలిపారు. గంటల తరబడి తాను సమీక్షలు చేయబోనని.. అయితే.. అధికారులు తమ ఆలోచనలకు పదును పెట్టి తామే యంత్రాంగాలను నడిపించుకోవాలన్నారు. తాను కేవలం సూచనలు మాత్రమే చేస్తానని చెప్పారు. అదేసమయంలో అవినీతి, అక్రమాలను సహించేది లేదన్నారు.
ఇది మంచి పరిణామమే. అయితే.. ప్రస్తుతం మార్పు దిశగా అడుగులు వేస్తున్నా.. తన మార్కు కోసం చంద్రబాబు తపిస్తారనేది తెలిసిందే. అయితే.. అంతా అధికారులకే అప్పగిస్తే.. చంద్రబాబు మార్కు కనిపిస్తుందా? అనేది చూడాలి. ప్రస్తుతం ఉన్న సామాజిక మాధ్య మాల వేగం పాలనపై ప్రభావం చూపిస్తోంది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లోనే తెలిసిపోతోంది. ఒక్కొక్కసారి .. అధికారులు ఈ మాధ్యమాల వేగాన్ని సైతం అందుకోలేక పోతున్నారు.
ఏదేమైనా.. చంద్రబాబు దూకుడు తగ్గిస్తానని చెప్పడం ద్వారా అధికార యంత్రాగానికి ఫ్రీహ్యాండ్ ఇస్తానని ప్రకటించడం ద్వారా కొంత మేరకు.. ఆయన ఒత్తిడి నుంచి దూరమవుతున్నారు. అయితే.. ఆయన మార్కను తగ్గించుకోకుండా కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనేక సంక్లిష్టతలు ఉన్న ఏపీలో ఇప్పుడు చంద్రబాబు మార్క కోసం.. ప్రజలు ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. మరి ఎలా ముందుకు సాగుతారో చూడాలి.
This post was last modified on July 25, 2024 7:09 am
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…
రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్తో టీ20 సిరీస్కు ముందు ఢిల్లీలో జరిగిన…
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…