కనీస సమాచారం ఇవ్వకుండా తనకున్న టు ప్లస్ టు గన్ మెన్లను ఒన్ ప్లస్ వన్ కు కుదించారు. తన భర్తకు ఉన్న వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. దీంతో తనకు అసలు సెక్యూరిటీనే అవసరం లేదు అంటూ ఆ ఎమ్మెల్యే తిప్పిపంపిది. సెక్యూరిటీ కుదిస్తూ పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం కడప రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కడప శాసనసభ స్థానం నుండి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి సతీమణి, ఫైర్ బ్రాండ్ రెడ్డప్పగారి మాధవిరెడ్డి ఇటీవల ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి, వైసీపీ అభ్యర్థి అంజాద్ భాషాపై 18 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికలకు ముందు ప్రత్యర్ధి పార్టీ అభ్యర్థి తమ్ముడి నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసులను కోరడంతో మాధవిరెడ్డి, ఆమె శ్రీనివాసులు రెడ్డికి సెక్యూరిటీని కేటాయించారు.
తాజాగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గన్ మెన్లను తొలగించడంతో ఆమె మనస్తాపానికి గురై మొత్తానికే సెక్యూరిటీ అవసరం లేదంటూ తిప్పి పంపి శాసనసభ సమావేశాలకు హాజరవుతుండడం కలకలం రేపుతుంది. జగన్ సొంత ఇలాకా అయిన కడపలో మాధవిరెడ్డి విజయం సంచలనంగా మారింది. ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారు అన్నది వేచిచూడాలి.
This post was last modified on July 24, 2024 1:08 pm
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…