వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్.. హైకోర్టు మెట్లు ఎక్కారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇప్పించాలని కోరుతూ ఆయన వైసీపీ తరఫున పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశామని.. అయినా .. ఆయన నుంచి ఎలాంటి సమాచారం రాలేదని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు జోక్యం చేసుకుని.. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదాను ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, రాజస్థాన్ లలో గతంలో జరిగిన ఘటనలు.. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఆయన ఉటంకించారు.
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి 11 సీట్లు మాత్రమే లభించాయని పేర్కొన్న మాజీ సీఎం జగన్.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. సభలో ఉన్నదంతా అధికార పక్షమేనని..మరో పార్టీ తరఫున ఎమ్మెల్యేలు లేరని తెలిపారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఈ క్రమంలో ఉన్న 11 మంది ప్రతిపక్షంగా వైసీపీ తరఫున ఉన్నారని తెలిపారు. మరో పార్టీ లేనందున.. ప్రధాన ప్రతిపక్ష హోదాను తమకు ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవని వివరించారు.
10 శాతం మంది ఎమ్మెల్యేలు ఉంటేనే ప్రదాన ప్రతిపక్ష హోదా దక్కుతుందన్న వాదనలో ఎలాంటి నిబంనలు లేవని తెలిపారు. అధికార పక్షం మినహా.. మరో పెద్ద పార్టీ ఉంటే.. ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో మహారాష్ట్ర కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ఉటంకించారు. అదేవిదంగా రాజస్థాన్ అసెంబ్లీకి సంబంధించి ఇచ్చిన మరో తీర్పును కూడా జగన్ తన పిటిషన్లో సోదాహరణంగా వివరించారు. ఇక, ప్రస్తుతం ఏపీ అసెంబ్లీలో అధికార పక్షం మినహా.. మరో పార్టీ లేదని.. ఉన్నది తామేనని.. కాబట్టి తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇప్పించాలని కోరారు.
ఇదేసమయంలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ఏం జరుగుతుందో కూడా తెలిపారు. ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కితే.. సభలో ప్రజల తరఫున మాట్లాడే అవకాశం హక్కుగా మారుతుందని.. మైకు ఇచ్చే పొందే అవకాశం కూడా హక్కుగా మారుతుందని పేర్కొన్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే.. ప్రజల తరఫున సమస్యలను ప్రస్తావించే అవకాశం కోల్పోతామని.. ప్రజలు తమ ను ఎన్నుకున్నందుకు ప్రజాస్వామ్యంలో తమ బాధ్యతలను తాము నిర్వర్తించలేకపోతామని.. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం హోదాను తమకు ఇప్పించాలని జగన్ తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు.
This post was last modified on July 23, 2024 5:26 pm
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…