Political News

గ‌తాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయినా.. జ‌నాలు మ‌రిచిపోలేదు

రాష్ట్రంలో చంద్ర‌బాబు నేతృత్వంలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు గుప్పించిన విష‌యం తెలిసిందే. అమ్మ‌కు వంద‌నం, ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, నిరుద్యోగ భృతి.. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ రూ.20 వేలు, మ‌హిళ‌ల‌కు రూ.1500 చొప్పున నెల‌నెలా ఇచ్చే ప‌థ‌కాల‌ను సూప‌ర్‌-6 పేరుతో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే.. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి.. నెల రోజులు దాటిపోయినా.. వాటిని ఏం చేశార‌ని.. ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని.. జ‌గ‌న్ తాజాగా ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ సంధించిన ఈ ప్ర‌శ్న‌కు టీడీపీ నేత‌లు అంతే వేగంగా రియాక్ట్ అయ్యారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడు శుక్ర‌వారాలు(కామ‌న్ గా అనే మాట‌) కూడా గ‌డ‌వ‌క‌ముందే.. పులివెందుల ఎమ్మెల్యే రోడ్డెక్కార‌ని టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ హ‌యాంలో ప్ర‌క‌టించిన సంక్షేమ‌ ప‌థ‌కాల జాబితాను.. ఎప్ప‌టి నుంచి వాటిని జ‌గ‌న్ అమ‌లు చేశారో వివ‌రాల‌తో స‌హా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో టీడీపీ ఇచ్చిన ఈ వివరాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

జగన్ అధికారంలోకి వచ్చినది 2019 మే 30న అని టీడీపీ పేర్కొంది. అయితే.. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న రైతు భరోసా ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది మాత్రం 2019, అక్టోబర్ నుంచి అని తెలిపింది. అదేవి ధంగా మత్స్యకార భరోసా ఇచ్చింది 2019 నవంబర్ నుంచి అని, అమ్మ ఒడి ప‌థ‌కాన్ని 2020, జనవరి నుం చి అమ‌లు చేశార‌ని తెలిపింది. ఇక‌, విద్యార్థుల‌కు మేలు క‌లిగిస్తున్నామ‌ని పేర్కొంటూ.. అమ‌లు చేసిన వసతి దీవెన ఇచ్చింది 2020 ఫిబ్రవరి నుంచి అని టీడీపీ వివ‌రించింది. అంటే.. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత తీరిగ్గా 10 మాసాల‌కు ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశార‌ని తెలిపింది.

అదేవిధంగా విద్యార్థుల‌కు.. విద్య దీవెన ప‌థ‌కాన్ని 2020, ఏప్రిల్ నుంచి, మ‌హిళ‌ల‌కు(డ్వాక్రా) సున్నా వడ్డీ ఇచ్చింది 2020 ఏప్రిల్ నుంచి అని టీడీపీ పేర్కొంది. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌ను.. ఎన్నిక‌లు పూర్తయి.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లు చేశారా? ఇప్పుడు ప్ర‌శ్నించ‌డానికి అని టీడీపీ ఎదురు ప్ర‌శ్నించింది. గ‌తాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయినా.. జ‌నాలు మ‌రిచిపోలేద‌ని తెలిపింది. అంతేకాదు.. అమ్మ ఒడిని ఐదు సంవ‌త్స‌రాలు అమ‌లు చేయాల్సి ఉన్నా.. కేవ‌లం నాలుగేళ్లే ఇచ్చార‌ని ఈ విష‌యాన్ని కూడా జ‌గ‌న్ గుర్తు చేసుకోవాల‌ని పేర్కొంది.

This post was last modified on July 20, 2024 5:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

1 hour ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago