Political News

గ‌తాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయినా.. జ‌నాలు మ‌రిచిపోలేదు

రాష్ట్రంలో చంద్ర‌బాబు నేతృత్వంలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు గుప్పించిన విష‌యం తెలిసిందే. అమ్మ‌కు వంద‌నం, ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, నిరుద్యోగ భృతి.. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ రూ.20 వేలు, మ‌హిళ‌ల‌కు రూ.1500 చొప్పున నెల‌నెలా ఇచ్చే ప‌థ‌కాల‌ను సూప‌ర్‌-6 పేరుతో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే.. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి.. నెల రోజులు దాటిపోయినా.. వాటిని ఏం చేశార‌ని.. ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని.. జ‌గ‌న్ తాజాగా ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ సంధించిన ఈ ప్ర‌శ్న‌కు టీడీపీ నేత‌లు అంతే వేగంగా రియాక్ట్ అయ్యారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడు శుక్ర‌వారాలు(కామ‌న్ గా అనే మాట‌) కూడా గ‌డ‌వ‌క‌ముందే.. పులివెందుల ఎమ్మెల్యే రోడ్డెక్కార‌ని టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ హ‌యాంలో ప్ర‌క‌టించిన సంక్షేమ‌ ప‌థ‌కాల జాబితాను.. ఎప్ప‌టి నుంచి వాటిని జ‌గ‌న్ అమ‌లు చేశారో వివ‌రాల‌తో స‌హా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో టీడీపీ ఇచ్చిన ఈ వివరాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

జగన్ అధికారంలోకి వచ్చినది 2019 మే 30న అని టీడీపీ పేర్కొంది. అయితే.. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న రైతు భరోసా ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది మాత్రం 2019, అక్టోబర్ నుంచి అని తెలిపింది. అదేవి ధంగా మత్స్యకార భరోసా ఇచ్చింది 2019 నవంబర్ నుంచి అని, అమ్మ ఒడి ప‌థ‌కాన్ని 2020, జనవరి నుం చి అమ‌లు చేశార‌ని తెలిపింది. ఇక‌, విద్యార్థుల‌కు మేలు క‌లిగిస్తున్నామ‌ని పేర్కొంటూ.. అమ‌లు చేసిన వసతి దీవెన ఇచ్చింది 2020 ఫిబ్రవరి నుంచి అని టీడీపీ వివ‌రించింది. అంటే.. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత తీరిగ్గా 10 మాసాల‌కు ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశార‌ని తెలిపింది.

అదేవిధంగా విద్యార్థుల‌కు.. విద్య దీవెన ప‌థ‌కాన్ని 2020, ఏప్రిల్ నుంచి, మ‌హిళ‌ల‌కు(డ్వాక్రా) సున్నా వడ్డీ ఇచ్చింది 2020 ఏప్రిల్ నుంచి అని టీడీపీ పేర్కొంది. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌ను.. ఎన్నిక‌లు పూర్తయి.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లు చేశారా? ఇప్పుడు ప్ర‌శ్నించ‌డానికి అని టీడీపీ ఎదురు ప్ర‌శ్నించింది. గ‌తాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయినా.. జ‌నాలు మ‌రిచిపోలేద‌ని తెలిపింది. అంతేకాదు.. అమ్మ ఒడిని ఐదు సంవ‌త్స‌రాలు అమ‌లు చేయాల్సి ఉన్నా.. కేవ‌లం నాలుగేళ్లే ఇచ్చార‌ని ఈ విష‌యాన్ని కూడా జ‌గ‌న్ గుర్తు చేసుకోవాల‌ని పేర్కొంది.

This post was last modified on July 20, 2024 5:12 pm

Share

Recent Posts

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

44 minutes ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

1 hour ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

2 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

2 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

3 hours ago

వైసీపీకి `విశాఖ` ఆశ‌లు గ‌ల్లంతే.. !

విశాఖ‌ప‌ట్నంలో జ‌ర‌గ‌నున్న కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌వుతున్నాయి. గ‌తంలో ఉన్న ప‌ట్టు.. ఇప్పుడు లేక‌పోవ‌డం.. గ‌తంలో సాయిరెడ్డి వంటి…

3 hours ago