Political News

గ‌తాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయినా.. జ‌నాలు మ‌రిచిపోలేదు

రాష్ట్రంలో చంద్ర‌బాబు నేతృత్వంలో ఏర్ప‌డిన కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల‌కు ముందు.. ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు గుప్పించిన విష‌యం తెలిసిందే. అమ్మ‌కు వంద‌నం, ఆర్టీసీ బ‌స్సులో మ‌హిళ‌ల‌కు ఉచిత ప్ర‌యాణం, నిరుద్యోగ భృతి.. రైతుల‌కు ఇన్ పుట్ స‌బ్సిడీ రూ.20 వేలు, మ‌హిళ‌ల‌కు రూ.1500 చొప్పున నెల‌నెలా ఇచ్చే ప‌థ‌కాల‌ను సూప‌ర్‌-6 పేరుతో చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. అయితే.. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డి.. నెల రోజులు దాటిపోయినా.. వాటిని ఏం చేశార‌ని.. ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని.. జ‌గ‌న్ తాజాగా ప్ర‌శ్నించారు.

జ‌గ‌న్ సంధించిన ఈ ప్ర‌శ్న‌కు టీడీపీ నేత‌లు అంతే వేగంగా రియాక్ట్ అయ్యారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డి మూడు శుక్ర‌వారాలు(కామ‌న్ గా అనే మాట‌) కూడా గ‌డ‌వ‌క‌ముందే.. పులివెందుల ఎమ్మెల్యే రోడ్డెక్కార‌ని టీడీపీ విమ‌ర్శ‌లు గుప్పించింది. ఇదేస‌మ‌యంలో జ‌గ‌న్ హ‌యాంలో ప్ర‌క‌టించిన సంక్షేమ‌ ప‌థ‌కాల జాబితాను.. ఎప్ప‌టి నుంచి వాటిని జ‌గ‌న్ అమ‌లు చేశారో వివ‌రాల‌తో స‌హా వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా లో టీడీపీ ఇచ్చిన ఈ వివరాలు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి.

జగన్ అధికారంలోకి వచ్చినది 2019 మే 30న అని టీడీపీ పేర్కొంది. అయితే.. ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పేర్కొన్న రైతు భరోసా ప‌థ‌కాన్ని అమ‌లు చేసింది మాత్రం 2019, అక్టోబర్ నుంచి అని తెలిపింది. అదేవి ధంగా మత్స్యకార భరోసా ఇచ్చింది 2019 నవంబర్ నుంచి అని, అమ్మ ఒడి ప‌థ‌కాన్ని 2020, జనవరి నుం చి అమ‌లు చేశార‌ని తెలిపింది. ఇక‌, విద్యార్థుల‌కు మేలు క‌లిగిస్తున్నామ‌ని పేర్కొంటూ.. అమ‌లు చేసిన వసతి దీవెన ఇచ్చింది 2020 ఫిబ్రవరి నుంచి అని టీడీపీ వివ‌రించింది. అంటే.. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత తీరిగ్గా 10 మాసాల‌కు ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేశార‌ని తెలిపింది.

అదేవిధంగా విద్యార్థుల‌కు.. విద్య దీవెన ప‌థ‌కాన్ని 2020, ఏప్రిల్ నుంచి, మ‌హిళ‌ల‌కు(డ్వాక్రా) సున్నా వడ్డీ ఇచ్చింది 2020 ఏప్రిల్ నుంచి అని టీడీపీ పేర్కొంది. జ‌గ‌న్ ప్ర‌క‌టించిన ప‌థ‌కాల‌ను.. ఎన్నిక‌లు పూర్తయి.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అమ‌లు చేశారా? ఇప్పుడు ప్ర‌శ్నించ‌డానికి అని టీడీపీ ఎదురు ప్ర‌శ్నించింది. గ‌తాన్ని జ‌గ‌న్ మ‌రిచిపోయినా.. జ‌నాలు మ‌రిచిపోలేద‌ని తెలిపింది. అంతేకాదు.. అమ్మ ఒడిని ఐదు సంవ‌త్స‌రాలు అమ‌లు చేయాల్సి ఉన్నా.. కేవ‌లం నాలుగేళ్లే ఇచ్చార‌ని ఈ విష‌యాన్ని కూడా జ‌గ‌న్ గుర్తు చేసుకోవాల‌ని పేర్కొంది.

Satya

Recent Posts

ఎడిటింగ్ VS రన్ టైమ్… ఒక రిస్కీ కథ

యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…

11 minutes ago

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

10 hours ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

12 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

14 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

15 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

15 hours ago