పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకర్గం వైసీపీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు పిన్నెల్లి రామకృ ష్ణారెడ్డికి హైకోర్టు మరో షాక్ ఇచ్చింది. తాజాగా ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చింది. అంతేకాదు.. కేసు విషయంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల పోలింగ్ సమయంలో పాల్వాయి గేటు పోలింగ్ బూత్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో బెయిల్ పొందిన పిన్నెల్లిపై తర్వాత.. సీఐ నారాయణ స్వామి, టీడీపీ పోలింగ్ బూత్ ఏజెంట్.. శేషగిరిపై హత్యాయత్నం చేశారన్న కేసులు నమోదయ్యాయి.
ఈ కేసుల్లో గతంలో బెయిల్ లభించకపోవడంతోనే.. ఆయనను పోలీసులు జైలుకు పంపించారు. ప్రస్తు తం నెల్లూరు జైల్లో ఉన్న పిన్నెల్లి మరోసారి తనకు బెయిల్ మంజూ చేయాలంటూ.. కోర్టును ఆశ్రయించా రు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా జరిగిన వాదనల్లో పిన్నెల్లి తరఫున ఆయన న్యాయవాది.. వాదనలు వినిపిస్తూ.. పిన్నెల్లిపై రాజకీయ కక్షతోనే కేసులు నమోదు చేశారని తెలిపారు. వీటిని కొట్టి వేయాలని కోరుతూ.. మరో పిటిషన్ వేయనున్నట్టు తెలిపారు.
అయితే.. కోర్టు ఈ సందర్భంగా జోక్యం చేసుకుని.. కేసులు ఏమీ సాధారణమైనవి కావని వ్యాఖ్యానించింది. అంతేకాదు.. పిటిషనర్ చరిత్ర అంతా వివాదాలతోనే ఉందని.. ఆయనపై అనేక కేసులు నమోదయ్యాయ ని, హత్యాయత్నం కేసులను కొట్టివేయాలని ఎలా కోరతారని ప్రశ్నించింది. ప్రతి ఒక్కరూ తమపై నమోదైన కేసుల్లో రాజకీయ జోక్యం ఉందనే చెబుతున్నారని.. కానీ, నిరూపణ చేసుకోలేక పోతున్నారని వ్యాఖ్యానించింది. పిటిషనర్ చరిత్ర.. స్పాట్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన వివరాలను గమనిస్తే.. పిటిషనర్ బెయిల్ కు అర్హుడు కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.
కాగా.. ఈ నెల తొలి వారంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనను జిల్లా జైలులో ఉంచితే.. రాజకీయంగా ఉద్రిక్తతలు ఏర్పడతాయని పేర్కొంటూ.. పిన్నెల్లిని నెల్లూరు జైలుకు తరలించారు. కొన్నాళ్లకు వైసీపీ అధినేత జగన్ పిన్నెల్లిని పరామర్శించి.. ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని సమర్థించారు. ఇప్పుడు ఈ విషయంపై కూడా కోర్టు సీరియస్ కావడం, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడం గమనార్హం.
This post was last modified on July 18, 2024 10:54 pm
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…