Political News

ముద్ర‌గ‌డ‌… అంబ‌టి… అక్క‌డితో స‌రి!

వైసీపీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి.. పార్టీ గెలుపు కోసం.. పంతాల‌కు కూడా పోయిన నాయ‌కుడు ఒక‌వైపు. సంక్రాంతి పేరుతో రోడ్లపై డ్యాన్సులు వేస్తూ.. నోటికి వ‌చ్చింది మాట్లాడే మాజీ మంత్రి మ‌రోవైపు. వీరిద్ద‌రూ క‌లుసుకున్నారు. పైనుంచి వ‌చ్చిన ఆదేశాల‌తో క‌లుసుకున్న‌ట్టు స‌మాచారం.

వారే.. ఒక‌రు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. మ‌రొక‌రు అంబ‌టి రాంబాబు. ఏంటి స్పెష‌ల్ అనే ప్ర‌శ్న ఉద‌యిస్తుంది. ఇటీవ‌ల ముద్ర‌గ‌డ రాజ‌కీయ శ‌ప‌థం చేసి.. జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ గెలిస్తే.. పేరు మార్చుకుంటాన‌ని చెప్పారు. అన్న‌ట్టుగానే పేరులో రెడ్డి చేర్చుకుని నేమ్‌ మార్చుకున్నారు.

ఆ త‌ర్వాత‌.. ఆయ‌న రాజ‌కీయంగా యాక్టివ్ కాలేక పోతున్నారు.ముఖ్యంగా కాపు స‌మాజంలోనూ ఆయ‌న ఒంట‌రియ్యారు. ఇంకో వైపు.. కుమార్తె కూడా మ‌రింత దూరంగా ఉండ‌డంతోపాటు.. రాజ‌కీయంగా ప‌దునైన వ్యాఖ్య‌ల‌తో ముద్ర‌గ‌డ‌ను ఇరుకున పెడుతున్నారు. ఈ ప‌రిణామాలతో ప‌ద్మ‌నాభం ఒకింత త‌లెత్తుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డింది.

ఇలాంటి స‌మ‌యంలో పార్టీ నుంచి సాంత్వ‌న ల‌భిస్తుంద‌ని ఆయ‌న వేచి చూసినా.. వైసీపీ అధినేత జ‌గ‌నే.. త‌న‌ను ఓదార్చేవారు లేక పులివెందుల-బెంగ‌ళూరు అంటూ.. ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకుని చ‌క్క‌ర్లు కొడుతున్నారు. ఇలాంటి స‌మ‌యంలో సంబ‌రాల రాంబాబు ఆయ‌న‌ను క‌లుసుకున్నారు.

ఇద్ద‌రూ ఒక‌రి గోడు మ‌రొక‌రితో వెళ్లబోసు కోవ‌డం మిన‌హా ల‌భించింది ఏమీ లేదు. అయితే.. మ‌రోవైపు వైసీపీకీ వీరిద్ద‌రి క‌ల‌యిక తో మ‌రింత డ్యామేజీ ఏర్ప‌డింద‌ని అంటున్నారు. ముద్ర‌గ‌డ‌కు ఇంకా కాపుల్లో అంతో ఇంతో ఇమేజ్ ఉంది.

ఆయ‌న బాధ‌లో ఉన్నార‌ని తెలిసి.. తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన కాపు నాయ‌కులు క‌లుస్తూనే ఉన్నారు . ఓ దారుస్తూనే ఉన్నా రు. స‌హ‌జంగా ఇలాంటి స‌మ‌యంలో పార్టీ అధినేత స్పందిస్తార‌ని అంద‌రూ ఆశించారు. ముద్ర‌గ‌డ‌ను పిలిపించుకునో.. లేక త‌నే వ‌చ్చో.. ఒకింత ఓదారుస్తార‌ని.. పార్టీలో అయినా.. ప్రాధాన్యం ఇస్తార‌ని కాపులు ఎదురు చూశారు.

కానీ జ‌గ‌న్ మాత్రం తాడేప‌ల్లి గ‌డ‌ప దాటితే.. పులివెందుల‌.. లేక‌పోతే, బెంగ‌ళూరుకు మాత్ర‌మే ప‌రిమితం అవుతున్నారు. ఈ క్ర‌మంలో రాంబాబును పంపించ‌నట్టు తెలవ‌డంతో ముద్ర‌గ‌డ‌కు వైసీపీ ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా? అనే చ‌ర్చ రాజ‌కీయంగా కాపుల్లో ప్రారంభ‌మైంది. నిజానికి వైసీపీ లో ఉన్న నాయ‌కుల్లో ముద్రగ‌డను తీసిపారేసే నాయ‌కుడు అన‌లేం.

ఆయ‌న ఓడినా గెలిచినా.. కొన్ని విలువ‌లు పాటిస్తున్నారు. అలాంటి నాయ‌కుడికి అధికారంలో ఉన్న‌ప్పుడూ… విలువ ఇవ్వ‌లేద‌ని.. ఇప్పుడు ఓడిన‌ తర్వాత బాధ‌లో ఉన్నా కూడా.. ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కాపుల్లో చ‌ర్చ ప్రారంభ‌మైంది. ఇది మున్ముందు వైసీపీకి మ‌రింత డ్యామేజీ జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

This post was last modified on July 18, 2024 11:00 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

5 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

3 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

4 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

6 hours ago