అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్య దేవాలయం. అయితే.. గత వైసీపీ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని కూడా భ్రష్టు పట్టించే పని చేసింది. ఎవరూ ఊహించడానికి కూడా తావు లేకుండా వ్యవహరించింది. ప్రస్తుతం ఈ విషయం వెలుగు చూసిన తర్వాత.. అందరూ నివ్వెర పోతున్నారు. ప్రస్తుతం ఈ భ్రష్టత్వాన్ని తాజాగా బాధ్యతలు చేపట్టి నూతన స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తొలగించారు. దీంతో వైసీపీ మినహా అన్నిరాజకీయ పార్టీల నాయకులు.. ప్రజాస్వామ్య వాదులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.
ఏం జరిగింది?
ఏపీ రాజధాని అమరావతిని కాదని.. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విషయాన్నితెరమీదికి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమించారు. తమ సంగతే కాదు.. రాష్ట్ర భవిష్యత్తును కూడా కాపాడాలంటూ..వారు నిరసన వ్యక్తం చేయడం.. పాదయాత్రలు చేయడం.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు విన్నపాలు సమర్పించారు. అయినా… వీరి మొర ఎవరూ ఆలకించలేదు. దీంతో అసెంబ్లీ ముట్టడికి పలు దఫాలు ప్రయత్నించారు. దీనిని వైసీపీ సర్కారు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఏకంగా అప్పటి గుంటూరు ఎస్పీ లాఠీ పట్టుకుని రైతులపై విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ గేటుకు గోడ
రైతులు అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించడంతో అప్పటి వైసీపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి అసెంబ్లీకి ఉన్న రెండో గేట్ ను మూసేసింది. మూసేయడమే కాదు..ఏకంగా 12 అడుగుల మేరకు.. పటిష్టమైన గోడను కూడా కట్టేసింది. నిజానికి కొత్తగా అసెంబ్లీని చూసేవారు.. అసలు ఇక్కడ గేటు ఉందా? అంటే నమ్మలేని పరిస్థితి ఏర్పడేలా గోడను నిర్మించేశారు. ఫలితంగా అసెంబ్లీ రెండో గేటు మూతపడింది. ఇక్కడ చిత్రం ఏంటంటే.. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా.. నిన్న మొన్నటి వరకు కూడా గుర్తించలేకపోయారట. అంతగా అసలు గోడతో కలిసిపోయేలా ఈ గేటును మూసేసి మరీ గోడను నిర్మించేశారు.
అయ్యన్న అప్పటికప్పుడే!
కాగా, అసెంబ్లీ గేట్ 2కు వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్మించిన గోడ వ్యవహారం రెండు రోజుల కిందట స్పీకర్ అయ్యన్నకు తెలిసింది. రైతులు కొందరు వచ్చి.. ఆయన ముందు మొర పెట్టుకున్నారు. దీంతో అప్పటికప్పుడే ప్రభుత్వానికి ప్రతిపాదన పంపిన స్పీకర్.. తాజాగా బుధవారం వైసీపీ ప్రభుత్వం నిర్మించిన గోడను కూల్చేసి.. గేట్లు తెరిపించారు. ప్రజాస్వామ్య దేవాలయానికి అడ్డంకులు ఉండరాదని స్పీకర్ పేర్కొనడం గమనార్హం. నిరసనలు, ధర్నాలు అడవుల్లో ఎవరూ చేయరని.. మనుషుల మధ్యే చేస్తారని.. శాంతి యుత ధర్నాలు, నిరసనలకు తమ ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, అసెంబ్లీ గేటు 2కు కట్టిన గోడను కూల్చి వేయడంతో అమరావతి రైతులు.. అసెంబ్లీకి ఊపిరివచ్చిందని సంబరాలుచేసుకోవడం గమనార్హం. వైసీపీ హయాంలో జరిగిన ఇలాంటి లీలలు ఎన్ని ఉన్నాయో.. మున్ముందు ఎన్ని చూడాలో అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 18, 2024 9:43 am
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…