Political News

క‌ర్ణాట‌క‌లో ఉద్యోగాల చిచ్చు.. వెళ్లిపోతామంటూ కంపెనీల నోటీసులు!

క‌ర్ణాట‌క‌లోని సిద్ధ‌రామ‌య్య నేతృత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యం.. రాష్ట్రంలో చిచ్చు పెట్టిం ది. రాత్రికి రాత్రి ఎలాంటి ముంద‌స్తు చ‌ర్చా లేకుండానే.. సిద్ద‌రామ‌య్య‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ సంస్థ‌లు.. ఇత‌ర ప్రైవేటు సంస్థ‌లు కూడా.. 75 శాతం ఉద్యోగాల‌ను క‌న్న‌డిగుల‌కే కేటాయించాల‌ని ఆయ‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనిపై ఒక‌రిద్ద‌రు మంత్రుల‌తో మాత్ర‌మే ఆయ‌న చ‌ర్చించిన‌ట్టు స‌మాచారం. నిజానికి ఇలాంటి విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యా లు తీసుకునేందుకు మంత్రివ‌ర్గంతో చ‌ర్చించాల్సి ఉంది.

పైగా జాతీయ పార్టీ అయిన‌. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉండ‌డంతో ఆ పార్టీ అధిష్టానంతోనూ సీఎం సిద్ద‌రామ‌య్య చ‌ర్చించి ఉండాలి. కానీ, అలాంటిదేమీ లేకుండా.. సిద్ద‌రామ‌య్య ఒక నోట్ ఇచ్చేసి.. దీనినే జీవోగా మార్చాలంటూ.. అదికారుల‌ను పుర‌మాయిం చారు. దీంతో మంగ‌ళ‌వారం రాత్రి దీనికి సంబంధించిన జీవో వ‌చ్చింది.

అయితే.. ఈ జీవోపై ప్రైవేటు సంస్థ‌లు పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నాయి. తాజాగా ప్ర‌ముఖ కార్పొరేట్ దిగ్గ‌జం “నాస్‌కామ్‌” సంస్థ ప్ర‌బుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తూ.. ఒక లేఖ‌ను సంధించింది. రాష్ట్ర జీడీపీలో 25 శాతం వాటాగా ఉన్న కార్పొరేట్ సంస్థ‌ను ప్ర‌భుత్వం ఇరుకున పెడుతోంద‌ని పేర్కొంది.

అంతేకాదు.. టాలెంట్ ఉన్న వారిని తామే నియ‌మించుకుంటామని.. ఇలా 75 శాతం ఉద్యోగాల‌ను స్థానికుల‌కే ఇవ్వాల‌న్న నిబంధ‌న అసంబ‌ద్ధ‌మ‌ని స్ప‌ష్టం చేసింది. దీనిని వెన‌క్కి తీసుకునే విష‌యంలో ప్ర‌భుత్వం ఆలోచించుకోవాల‌ని సూచించింది. అంతేకాదు.. ఇదే కొన‌సాగిస్తామ‌ని తేల్చి చెబితే.. త‌మ మున్ముందు ప్రాజెక్టుల‌ను వేరే రాష్ట్రాల‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం కూడా చేస్తామ‌ని పేర్కొంది. మ‌రో సంస్థ‌.. ఇన్‌ఫోసిస్ సైతం.. ఇదే ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం. స్థానికంగా 75 శాతం ఉద్యోగుల‌ను నియ‌మించుకోవ‌డం.. సాఫ్ట్ వేర్ రంగంలో కుదిరే పనికాద‌ని కార్పొరేట్ సంస్థ‌లు కుండ‌బ‌ద్ద‌లు కొట్టాయి.

ఇదిలావుంటే.. ఈ విష‌యంపై ప్ర‌తిప‌క్షాలు నోరు మెదిపేందుకు జంకుతున్నాయి. స్థానికంగా యువ‌త‌కు ఉపాధి క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో తాము సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నామ‌ని సీఎం సిద్ద‌రామ‌య్య ప్ర‌క‌టించినా.. ఆ వెంట‌నే ఎదురైన సంస్థ‌ల ఒత్తిడి.. విమ‌ర్శ‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకున్నారు. మ‌రోవైపు.. స్థానికుల‌కు ఉపాధి క‌ల్పించే సున్నిత వ్య‌వ‌హారం కావ‌డంతో.. బీజేపీ నాయ‌కులు మౌనంగా ఉన్నారు. ఈ జీవోను వెన‌క్కి తీసుకున్నాక స్పందిద్దాద‌మ‌నే ధోర‌ణిలో ఉన్నారు. ఎలా చూసుకున్నా.. స్థానికం 75 శాతం ఉద్యోగాలు క‌ల్పించాల‌నే నిబంధ‌న గ‌తంలోనూ ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. ఫ‌లితంగా పెట్టుబ‌డి దారులు వెన‌క్కి వెళ్లిపోయారు. ఇప్పుడు ఇదే ప‌రిస్థితి కర్ణాట‌క‌కు ఎదురు కానుంది.

This post was last modified on July 17, 2024 10:38 pm

Share

Recent Posts

రాకా సెట్లో మంచు లక్ష్మి… వావ్ వావ్ వావ్

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…

36 minutes ago

విశాఖలో విద్యార్థుల లవ్ వార్… హద్దు మీరిపోయారు!

విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…

56 minutes ago

చివరి సినిమా టోటల్ కలెక్షన్లు… ఒక్క రోజులోనే ఔట్

మాస్ రాజా రవితేజ నుంచి సరైన సినిమా వస్తే.. పరిస్థితులు కూడా అనుకూలిస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో…

60 minutes ago

సందీప్ వెర్సస్ దీపిక… మళ్లీ రాజుకుంది

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి దీపికా పదుకొనేను తప్పించడం మీద ఎప్పుడో…

1 hour ago

చిరు భలే బోల్తా కొట్టించాడుగా

ఏదో ఈవెంట్‌కు వెళ్లి ఏదో మాట్లాడుతూ.. తన కొత్త సినిమాల విశేషాలను లీక్ చేసేయడం మెగాస్టార్ చిరంజీవికి అలవాటు. కొన్నిసార్లు…

3 hours ago

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

3 hours ago