ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం సాధించింది. వైసీపీ ఘోర ఓటమి నేపథ్యంలో ఇన్నాళ్లు ఆ పార్టీలో ఉన్న వారు ప్రస్తుతం టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మంత్రాలయం మినహా అన్ని స్థానాల్లో కూటమి విజయం సాధించింది.
నంద్యాల లోక్ సభ స్థానం నుండి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు బైరెడ్డి శబరి టీడీపీ నుండి విజయం సాధించింది. నందికొట్కూరు స్థానం నుండి ఎమ్మెల్యేగా టీడీపీ నుండి జయసూర్య విజయం సాధించాడు.
నందికొట్కూరు నియోజకవర్గం అంటే బైరెడ్డి కుటుంబ అడ్డా. మొన్నటి వరకు పెదనాన్నతో విభేదించిన వైసీపీ నుండి బైరెడ్డి సిద్దార్థరెడ్డి రాష్ట్ర శాట్స్ చైర్మన్ గా అక్కడ చక్రం తిప్పాడు. 2019 ఎన్నికల్లో వెంట ఉండి తానే గెలిపించిన ఎమ్మెల్యే అర్దర్ తో విభేదాలు ఏర్పడ్డాయి.
అంతకుముందు నందికొట్కూరు జనరల్ స్థానంగా ఉన్నప్పుడు 1978, 1983, 1989లో బైరెడ్డి శేషశయనా రెడ్డి, 1994, 1999లో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వ్ కావడంతో వారు పెట్టిన వారే ఎమ్మెల్యేలు అవుతున్నారు. లేదా పరోక్షంగా వారు ప్రభావం చూపుతున్నారు.
ఇటీవల రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ప్రభావం తగ్గింది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డితో పాటు మరో 12 మంది కౌన్సిలర్లు, 2 కో ఆప్షన్ నెంబర్లు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయసూర్యకు సంబంధం లేకుండా అక్కడ చేరికలు సాగుతున్నాయి.
సిద్దార్థరెడ్డి అనుమాయులంతా వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నా ఆయన ఏమీ అనడం లేదు. వ్యూహాత్మకంగా పెదనాన్న సమక్షంలో తన వర్గం మనుషులను టీడీపీలో చేర్పిస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యే జయసూర్య వర్గానికి చెక్ పెట్టేందుకే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ప్రభుత్వం మారినా నందికొట్కూరులో బైరెడ్డి కుటుంబ రాజకీయం మారలేదని చెబుతున్నారు.
This post was last modified on July 17, 2024 3:58 pm
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…