తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్లో మరో కలకలం రేగింది. ఇప్పటికే పది మంది వరకు ఎమ్మెల్యే లు జంప్ అయిపోయారు.. జెండా మార్చేశారు. అయితే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ క్రమంలో స్పీకర్ ప్రసాదరావుకు.. సదరు పిటిషన్ అందించేందుకు తన వారిని పంపించారు. అనారోగ్య కారణంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. ఇక్కడే మరో చిత్రం చోటు చేసుకుంది.
ప్రస్తుతం పోయిన వారు పోగా.. బీఆర్ ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరికీ ముందుగానే సమాచారం ఇచ్చారు. తప్పకుండా రావాలని.. స్పీకర్ను కలుస్తున్నామని.. ఫోన్లు చేసి మరీ చెప్పారు. అయితే.. అందరూ అధినేత మాటకు ఓకేచెప్పారు. తీరా సమయం వచ్చే సరికి 12 మంది డుమ్మా కొట్టారు. దీంతో 15 మంది మాత్రమే వెళ్లి స్పీకర్ను కలుసుకుని.. పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలని విన్నవించారు. వీరంతా గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. డుమ్మా కొట్టిన నాయకులు పార్టీలో ఉంటారా? పార్టీని వదులుకుంటారా? అనేది చూడాలి.
డుమ్మా కొట్టింది.. ఎవరెవరు?
This post was last modified on July 17, 2024 4:52 pm
ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…
ఒకప్పుడు తెలుగు, తమిళంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా దశాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన కథానాయిక సమంత. కానీ కొన్నేళ్లుగా…
సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత తన…
బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…
బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…