తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్లో మరో కలకలం రేగింది. ఇప్పటికే పది మంది వరకు ఎమ్మెల్యే లు జంప్ అయిపోయారు.. జెండా మార్చేశారు. అయితే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ క్రమంలో స్పీకర్ ప్రసాదరావుకు.. సదరు పిటిషన్ అందించేందుకు తన వారిని పంపించారు. అనారోగ్య కారణంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. ఇక్కడే మరో చిత్రం చోటు చేసుకుంది.
ప్రస్తుతం పోయిన వారు పోగా.. బీఆర్ ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరికీ ముందుగానే సమాచారం ఇచ్చారు. తప్పకుండా రావాలని.. స్పీకర్ను కలుస్తున్నామని.. ఫోన్లు చేసి మరీ చెప్పారు. అయితే.. అందరూ అధినేత మాటకు ఓకేచెప్పారు. తీరా సమయం వచ్చే సరికి 12 మంది డుమ్మా కొట్టారు. దీంతో 15 మంది మాత్రమే వెళ్లి స్పీకర్ను కలుసుకుని.. పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలని విన్నవించారు. వీరంతా గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. డుమ్మా కొట్టిన నాయకులు పార్టీలో ఉంటారా? పార్టీని వదులుకుంటారా? అనేది చూడాలి.
డుమ్మా కొట్టింది.. ఎవరెవరు?
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…