తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్లో మరో కలకలం రేగింది. ఇప్పటికే పది మంది వరకు ఎమ్మెల్యే లు జంప్ అయిపోయారు.. జెండా మార్చేశారు. అయితే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ క్రమంలో స్పీకర్ ప్రసాదరావుకు.. సదరు పిటిషన్ అందించేందుకు తన వారిని పంపించారు. అనారోగ్య కారణంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. ఇక్కడే మరో చిత్రం చోటు చేసుకుంది.
ప్రస్తుతం పోయిన వారు పోగా.. బీఆర్ ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరికీ ముందుగానే సమాచారం ఇచ్చారు. తప్పకుండా రావాలని.. స్పీకర్ను కలుస్తున్నామని.. ఫోన్లు చేసి మరీ చెప్పారు. అయితే.. అందరూ అధినేత మాటకు ఓకేచెప్పారు. తీరా సమయం వచ్చే సరికి 12 మంది డుమ్మా కొట్టారు. దీంతో 15 మంది మాత్రమే వెళ్లి స్పీకర్ను కలుసుకుని.. పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలని విన్నవించారు. వీరంతా గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. డుమ్మా కొట్టిన నాయకులు పార్టీలో ఉంటారా? పార్టీని వదులుకుంటారా? అనేది చూడాలి.
డుమ్మా కొట్టింది.. ఎవరెవరు?
This post was last modified on July 17, 2024 4:52 pm
ఈ రోజుల్లో పెద్ద, చిన్న అని తేడా లేకుండా ప్రతి సినిమాకూ రిలీజ్ డేట్ మారడం అన్నది మామూలైపోయింది. ఐతే…
ఆలు లేదు చూలు లేదు.. అనే సామెతను గుర్తుకు తెస్తోంది తెలుగు సోషల్ మీడియా గొడవలు చూస్తే. సినిమాలు, రాజకీయాల…
టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్లాసిక్ మాయాబజార్ కు పని చేసిన వ్యక్తి ఇప్పుడో సినిమాకు దర్శకత్వం వహించారంటే నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు…
ఐపీఎల్ 2026 సీజన్ లీగ్ ఫస్ట్ హాఫ్ పూర్తయ్యింది. దీంతో ప్లేఆఫ్స్ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. ఇక పాయింట్ల పట్టిక…
ఎట్టకేలకు ఊహించినట్టే, ముందే లీకైనట్టే పెద్ది విడుదల తేదీ జూన్ 4 అనౌన్స్ చేస్తూ అధికారిక ప్రకటన నిర్మాణ సంస్థ…
సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల ఎంపికలో అప్పుడప్పుడూ చిత్రవిచిత్రాలు బయటపడుతూ ఉంటాయి. అలా బయటపడిన విచిత్రాలను సరిదిద్దడం అప్పటికప్పుడు సాధ్యం…