తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్లో మరో కలకలం రేగింది. ఇప్పటికే పది మంది వరకు ఎమ్మెల్యే లు జంప్ అయిపోయారు.. జెండా మార్చేశారు. అయితే.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ వేయాలని నిర్ణయించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఈ క్రమంలో స్పీకర్ ప్రసాదరావుకు.. సదరు పిటిషన్ అందించేందుకు తన వారిని పంపించారు. అనారోగ్య కారణంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే.. ఇక్కడే మరో చిత్రం చోటు చేసుకుంది.
ప్రస్తుతం పోయిన వారు పోగా.. బీఆర్ ఎస్కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరికీ ముందుగానే సమాచారం ఇచ్చారు. తప్పకుండా రావాలని.. స్పీకర్ను కలుస్తున్నామని.. ఫోన్లు చేసి మరీ చెప్పారు. అయితే.. అందరూ అధినేత మాటకు ఓకేచెప్పారు. తీరా సమయం వచ్చే సరికి 12 మంది డుమ్మా కొట్టారు. దీంతో 15 మంది మాత్రమే వెళ్లి స్పీకర్ను కలుసుకుని.. పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయలని విన్నవించారు. వీరంతా గైర్హాజరు కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. డుమ్మా కొట్టిన నాయకులు పార్టీలో ఉంటారా? పార్టీని వదులుకుంటారా? అనేది చూడాలి.
డుమ్మా కొట్టింది.. ఎవరెవరు?
This post was last modified on July 17, 2024 4:52 pm
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…
రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే హల్ద్వానిలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని శ్రీరామ్…
ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్తో…
ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాధమిక ప్రాజెక్టులుగా భావిస్తున్న సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు తాజాగా…