Political News

త‌మ్ముడు త‌న వాడైనా.. చంద్ర‌బాబు ‘ధ‌ర్మ’ ఇదీ!!

త‌మ్ముడు త‌న‌వాడే అయినా.. ధ‌ర్మం చెప్పాలన్న‌ట్టుగా స్పందించారు సీఎం చంద్ర‌బాబు. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో రెండు రోజుల కింద‌ట‌.. టీడీపీకి చెందిన కొందరు నాయ‌కులు.. వైసీపీ మ‌ద్ద‌తు దారుగా ఉన్న మంజుల అనే ఓ మ‌హిళ పొలంపై దాడి చేశారు. ఆమెకు చెందిన 8 ఎక‌రాల్లోని చీనీ(బ‌త్తాయి) తోట‌ల‌ను అడ్డంగా న‌రికేశారు. దీనిపై మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే.. రెండు రోజులైనా.. త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. స‌ద‌రు మ‌హిళ‌.. సీఎంవో కార్యాల‌యానికి ఈ మెయిల్ రూపంలో ఫిర్యాదు చేశారు.

ఈ ఘ‌ట‌న .. సీఎం చంద్ర‌బాబు దృష్టికి వ‌చ్చింది. అంతే.. చేసింది త‌న‌వారే.. అని తెలిసినా.. చంద్ర‌బాబు ఎక్క‌డా వారిని వెనుకేసుకురాలేదు. వెంట‌నే స్పందించారు. అంతేకాదు.. ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాలు ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కేన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. బ‌త్తాయి తోట‌ల‌ నరికివేత‌ను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు.

మంజుల బ‌త్తాయి తోట‌ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలకు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రు ఉన్నా విడిచి పెట్ట‌ద్ద‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. జీవితాల‌ను నాశ‌నం చేసే ఇలాంటి ఘ‌ట‌నల విష‌యంలో ఇక‌పై ఫిర్యాదులు కూడా రాకుండా చ‌ర్య‌లు ఉండాల‌న్నారు.

అప్ప‌ట్లో అంతా రివ‌ర్స్‌!

గ‌త వైసీపీ పాల‌న‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక ల త‌ర్వాత‌.. త‌మ వారికి ఓటేయ‌లేదంటూ.. గ్రామాల‌కు గ్రామాల‌నే వైసీపీ నాయ‌కులు వేధించారు. నీళ్లు ఇవ్వ‌కుండా.. చెత్త ఎత్త‌కుండా.. వ‌ర్షం వ‌చ్చినా.. కూడాప ట్టించుకోకుండా.. విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసి వేదించిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. వీటిపై గ్రామ‌స్థులు ఫిర్యాదు చేసినా.. అప్ప‌టి వైసీపీ నాయ‌కులు కానీ.. సీఎం కానీ.. ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. కానీ.. ఇప్పుడు త‌న వారే ఈ కేసులో ఉన్నార‌ని తెలిసి కూడా.. చంద్ర‌బాబు చ‌ర్య‌లకు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 17, 2024 10:16 am

Share

Recent Posts

కాంగ్రెస్ లో క్రమశిక్షణ తప్పదా?

మొత్తం మీద కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. కొండా సురేఖ కూతురు సుస్మిత మొదలుపెట్టిన వివాదానికి ఫుల్ స్థాప్ పెట్టడానికి రంగం…

5 hours ago

మీరు టికెట్ ఇవ్వడానికి ఎవరు ఉండరు జగన్

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరిస్తున్నట్లుంది వైసీపీ అధినేత జగన్ తీరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి…

7 hours ago

రోమాంచకం… సరిపోతుందా సమయం

టాలీవుడ్ లోనే కాదు బయట రాష్ట్రాల్లో కూడా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అంటే ఒక బ్రాండ్. తీసింది కేవలం…

8 hours ago

హనుమాన్ దర్శకుడి హవా మొదలైంది

‘హనుమాన్’ సినిమాతో రెండున్నరేళ్ల ముందు దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎంతటి సంచలనం రేపాడో తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ…

9 hours ago

అజ్ఞాతవాసి… పుచ్చుకున్నదంతా ఇచ్చేసిన త్రివిక్రమ్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో రాజమౌళి, అనిల్ రావిపూడిలను పక్కన పెడితే డిజాస్టర్లు లేని దర్శకులు లేరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్…

9 hours ago

పంజాని మరో ఆరెంజ్ చేసేలా ఉన్నారు

ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద వర్కౌట్ కాక డిజాస్టర్లుగా నిలిచిపోయిన సినిమాలు ఇప్పుడు రీ రిలీజ్ టైంలో అద్భుతాలు చేయడం చూస్తూనే…

10 hours ago