Political News

త‌మ్ముడు త‌న వాడైనా.. చంద్ర‌బాబు ‘ధ‌ర్మ’ ఇదీ!!

త‌మ్ముడు త‌న‌వాడే అయినా.. ధ‌ర్మం చెప్పాలన్న‌ట్టుగా స్పందించారు సీఎం చంద్ర‌బాబు. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో రెండు రోజుల కింద‌ట‌.. టీడీపీకి చెందిన కొందరు నాయ‌కులు.. వైసీపీ మ‌ద్ద‌తు దారుగా ఉన్న మంజుల అనే ఓ మ‌హిళ పొలంపై దాడి చేశారు. ఆమెకు చెందిన 8 ఎక‌రాల్లోని చీనీ(బ‌త్తాయి) తోట‌ల‌ను అడ్డంగా న‌రికేశారు. దీనిపై మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే.. రెండు రోజులైనా.. త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. స‌ద‌రు మ‌హిళ‌.. సీఎంవో కార్యాల‌యానికి ఈ మెయిల్ రూపంలో ఫిర్యాదు చేశారు.

ఈ ఘ‌ట‌న .. సీఎం చంద్ర‌బాబు దృష్టికి వ‌చ్చింది. అంతే.. చేసింది త‌న‌వారే.. అని తెలిసినా.. చంద్ర‌బాబు ఎక్క‌డా వారిని వెనుకేసుకురాలేదు. వెంట‌నే స్పందించారు. అంతేకాదు.. ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాలు ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కేన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. బ‌త్తాయి తోట‌ల‌ నరికివేత‌ను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు.

మంజుల బ‌త్తాయి తోట‌ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలకు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రు ఉన్నా విడిచి పెట్ట‌ద్ద‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. జీవితాల‌ను నాశ‌నం చేసే ఇలాంటి ఘ‌ట‌నల విష‌యంలో ఇక‌పై ఫిర్యాదులు కూడా రాకుండా చ‌ర్య‌లు ఉండాల‌న్నారు.

అప్ప‌ట్లో అంతా రివ‌ర్స్‌!

గ‌త వైసీపీ పాల‌న‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక ల త‌ర్వాత‌.. త‌మ వారికి ఓటేయ‌లేదంటూ.. గ్రామాల‌కు గ్రామాల‌నే వైసీపీ నాయ‌కులు వేధించారు. నీళ్లు ఇవ్వ‌కుండా.. చెత్త ఎత్త‌కుండా.. వ‌ర్షం వ‌చ్చినా.. కూడాప ట్టించుకోకుండా.. విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసి వేదించిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. వీటిపై గ్రామ‌స్థులు ఫిర్యాదు చేసినా.. అప్ప‌టి వైసీపీ నాయ‌కులు కానీ.. సీఎం కానీ.. ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. కానీ.. ఇప్పుడు త‌న వారే ఈ కేసులో ఉన్నార‌ని తెలిసి కూడా.. చంద్ర‌బాబు చ‌ర్య‌లకు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

తెలంగాణ మా జాగీరే పవన్ కల్యాణ్: కేటీఆర్

తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…

49 minutes ago

మాలలో మాస్ మహారాజ… కొత్తగా ఉందే

గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…

2 hours ago

రెహమాన్ సత్తాకు ‘జెన్ జీ’ పరీక్ష

ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…

2 hours ago

ఆజ్ కీ షామ్… పెద్దికే నామ్

మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…

2 hours ago

విజయ్ vs అన్నామలై… అసలు సాధ్యమేనా?

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…

3 hours ago

ఆంధ్రా కాంట్రాక్టర్లకు ప్రాజెక్టులు ఇవ్వబోం: కోమటిరెడ్డి

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం నాడు హైదరాబాద్ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ వాదులను…

4 hours ago