Political News

త‌మ్ముడు త‌న వాడైనా.. చంద్ర‌బాబు ‘ధ‌ర్మ’ ఇదీ!!

త‌మ్ముడు త‌న‌వాడే అయినా.. ధ‌ర్మం చెప్పాలన్న‌ట్టుగా స్పందించారు సీఎం చంద్ర‌బాబు. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో రెండు రోజుల కింద‌ట‌.. టీడీపీకి చెందిన కొందరు నాయ‌కులు.. వైసీపీ మ‌ద్ద‌తు దారుగా ఉన్న మంజుల అనే ఓ మ‌హిళ పొలంపై దాడి చేశారు. ఆమెకు చెందిన 8 ఎక‌రాల్లోని చీనీ(బ‌త్తాయి) తోట‌ల‌ను అడ్డంగా న‌రికేశారు. దీనిపై మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే.. రెండు రోజులైనా.. త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. స‌ద‌రు మ‌హిళ‌.. సీఎంవో కార్యాల‌యానికి ఈ మెయిల్ రూపంలో ఫిర్యాదు చేశారు.

ఈ ఘ‌ట‌న .. సీఎం చంద్ర‌బాబు దృష్టికి వ‌చ్చింది. అంతే.. చేసింది త‌న‌వారే.. అని తెలిసినా.. చంద్ర‌బాబు ఎక్క‌డా వారిని వెనుకేసుకురాలేదు. వెంట‌నే స్పందించారు. అంతేకాదు.. ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాలు ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కేన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. బ‌త్తాయి తోట‌ల‌ నరికివేత‌ను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు.

మంజుల బ‌త్తాయి తోట‌ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలకు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రు ఉన్నా విడిచి పెట్ట‌ద్ద‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. జీవితాల‌ను నాశ‌నం చేసే ఇలాంటి ఘ‌ట‌నల విష‌యంలో ఇక‌పై ఫిర్యాదులు కూడా రాకుండా చ‌ర్య‌లు ఉండాల‌న్నారు.

అప్ప‌ట్లో అంతా రివ‌ర్స్‌!

గ‌త వైసీపీ పాల‌న‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక ల త‌ర్వాత‌.. త‌మ వారికి ఓటేయ‌లేదంటూ.. గ్రామాల‌కు గ్రామాల‌నే వైసీపీ నాయ‌కులు వేధించారు. నీళ్లు ఇవ్వ‌కుండా.. చెత్త ఎత్త‌కుండా.. వ‌ర్షం వ‌చ్చినా.. కూడాప ట్టించుకోకుండా.. విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసి వేదించిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. వీటిపై గ్రామ‌స్థులు ఫిర్యాదు చేసినా.. అప్ప‌టి వైసీపీ నాయ‌కులు కానీ.. సీఎం కానీ.. ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. కానీ.. ఇప్పుడు త‌న వారే ఈ కేసులో ఉన్నార‌ని తెలిసి కూడా.. చంద్ర‌బాబు చ‌ర్య‌లకు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 17, 2024 10:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

13 minutes ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

3 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

4 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

4 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

5 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

5 hours ago