Political News

త‌మ్ముడు త‌న వాడైనా.. చంద్ర‌బాబు ‘ధ‌ర్మ’ ఇదీ!!

త‌మ్ముడు త‌న‌వాడే అయినా.. ధ‌ర్మం చెప్పాలన్న‌ట్టుగా స్పందించారు సీఎం చంద్ర‌బాబు. ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలో రెండు రోజుల కింద‌ట‌.. టీడీపీకి చెందిన కొందరు నాయ‌కులు.. వైసీపీ మ‌ద్ద‌తు దారుగా ఉన్న మంజుల అనే ఓ మ‌హిళ పొలంపై దాడి చేశారు. ఆమెకు చెందిన 8 ఎక‌రాల్లోని చీనీ(బ‌త్తాయి) తోట‌ల‌ను అడ్డంగా న‌రికేశారు. దీనిపై మీడియాలోనూ క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే.. రెండు రోజులైనా.. త‌న‌కు న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. స‌ద‌రు మ‌హిళ‌.. సీఎంవో కార్యాల‌యానికి ఈ మెయిల్ రూపంలో ఫిర్యాదు చేశారు.

ఈ ఘ‌ట‌న .. సీఎం చంద్ర‌బాబు దృష్టికి వ‌చ్చింది. అంతే.. చేసింది త‌న‌వారే.. అని తెలిసినా.. చంద్ర‌బాబు ఎక్క‌డా వారిని వెనుకేసుకురాలేదు. వెంట‌నే స్పందించారు. అంతేకాదు.. ఆగ్ర‌హం కూడా వ్య‌క్తం చేశారు. రాజ‌కీయాలు ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కేన‌ని తేల్చి చెప్పారు. అంతేకాదు.. బ‌త్తాయి తోట‌ల‌ నరికివేత‌ను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఇటువంటి విష సంస్కృతిని సహించేది లేదని హెచ్చరించారు. పంట పొలాలు ధ్వంసం చేయడం, తోటలను నరికివేయడం లాంటి చర్యలను ఉపేక్షించేది లేదని అన్నారు.

మంజుల బ‌త్తాయి తోట‌ల నరికివేతపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు అధికారులను ఆదేశించారు. రౌడీ రాజకీయాలకు, విధ్వంస విధానాలకు పాల్పడే వారు తీరు మార్చుకోకపోతే మూల్యం చెల్లిస్తారని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికా రులను ఆదేశించారు. అంతేకాదు.. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రు ఉన్నా విడిచి పెట్ట‌ద్ద‌ని జిల్లా అధికారుల‌ను ఆదేశించారు. జీవితాల‌ను నాశ‌నం చేసే ఇలాంటి ఘ‌ట‌నల విష‌యంలో ఇక‌పై ఫిర్యాదులు కూడా రాకుండా చ‌ర్య‌లు ఉండాల‌న్నారు.

అప్ప‌ట్లో అంతా రివ‌ర్స్‌!

గ‌త వైసీపీ పాల‌న‌లో కూడా ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక ల త‌ర్వాత‌.. త‌మ వారికి ఓటేయ‌లేదంటూ.. గ్రామాల‌కు గ్రామాల‌నే వైసీపీ నాయ‌కులు వేధించారు. నీళ్లు ఇవ్వ‌కుండా.. చెత్త ఎత్త‌కుండా.. వ‌ర్షం వ‌చ్చినా.. కూడాప ట్టించుకోకుండా.. విద్యుత్ స‌ర‌ఫ‌రాను నిలిపివేసి వేదించిన ఘ‌ట‌న‌లు అనేకం ఉన్నాయి. వీటిపై గ్రామ‌స్థులు ఫిర్యాదు చేసినా.. అప్ప‌టి వైసీపీ నాయ‌కులు కానీ.. సీఎం కానీ.. ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. కానీ.. ఇప్పుడు త‌న వారే ఈ కేసులో ఉన్నార‌ని తెలిసి కూడా.. చంద్ర‌బాబు చ‌ర్య‌లకు ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 17, 2024 10:16 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago