Political News

విద్యుత్ కమిషన్ రద్దుకు సుప్రీం నో

విద్యుత్ కొనుగోళ్లు, ఒప్పందాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ అవకతవకలపై విచారణ జరిపేందుకు ఓ కమిషన్ ను కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ విద్యుత్ విచారణ కమిషన్ కు చైర్మన్ గా జస్టిస్ నరసింహారెడ్డిని నియమించింది. అయితే, ఆ విచారణ పూర్తికాకముందే నరసింహారెడ్డి మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆ కమిషన్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు తలుపు తట్టారు.

ఈ నేపథ్యంలోనే ఈరోజు కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యుత్ విచారణ కమిషన్ నియామకంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిధిని అతిక్రమించిందని, ఆ ఒప్పందాలపై ట్రైబ్యునల్ ఉండగా న్యాయ విచారణ ఎలా చేస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా విచారణ జరుపుతున్న ఆ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతారని, మీడియా ముందు అభిప్రాయాలు ఎలా వ్యక్తం చేస్తారని సిజెఐ ప్రశ్నించారు. న్యాయమూర్తి న్యాయం చెప్పడమే కాదని, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సీజేఐ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

ఇక, విద్యుత్ కమిషన్ రద్దు చేయాలంటూ కేసీఆర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సీజేఐ కీలక ఆదేశాలు చేశారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డిని తొలగించి ఆయన స్థానంలో కొత్త వారిని నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కమిషన్ రద్దు చేయాల్సిన అవసరం లేదన్న తెలంగాణ ప్రభుత్వ వాదనతో కోర్టు ఏకీభవించింది. సోమవారంలోగా కొత్త చైర్మన్ ను నియమిస్తామని సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

అయితే, తాను ఎక్కడా పక్షపాత ధోరణితో వ్యవహరించలేదని జస్టిస్ నరసింహారెడ్డి వివరణనిచ్చారు. రోజు మార్చి రోజు కమిషన్ ప్రెస్ బ్రీఫింగ్ ఏర్పాటు చేసిందని, మీడియా సమావేశం పెట్టకుంటే పత్రికల్లో ఊహాజనిత సమాచారం ప్రచురించడంతో తాను బ్రీఫింగ్ ఇవ్వాల్సి వచ్చిందని చెప్పారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను కాపాడేందుకు తాను కమిషన్ నుండి తప్పుకుంటున్నానని అన్నారు.

This post was last modified on July 17, 2024 10:13 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నందమూరి హీరోలకు నెంబర్ 2 గండం

అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…

1 hour ago

ఆర్జీవీ మీద ఇంత గౌరవమా?

రామ్ గోపాల్ వ‌ర్మ అంటే ఒక‌ప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్ట‌ర్. శివ‌, రంగీలా, స‌త్య‌, కంపెనీ, స‌ర్కార్…

3 hours ago

ఈ సంక్రాంతికైనా జనంలోకి జగన్ వస్తారా?

రాష్ట్ర రాజ‌కీయాల్లో మార్పు స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకునే దిశ‌గా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. స‌హ‌జంగా అధికారంలో ఉన్న‌పార్టీలు…

6 hours ago

‘పార్టీ మారినోళ్లు రెండూ కానోల్లా?’

తెలంగాణ‌లో తాజాగా జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంద‌ని.. ఇది 2029 వ‌ర‌కు కొన‌సాగుతుంద‌ని.. అప్పుడు…

8 hours ago

కూటమి కట్టక తప్పదేమో జగన్

వ్య‌క్తిగ‌త విష‌యాలే..  జ‌గ‌న్‌కు మైన‌స్ అవుతున్నాయా? ఆయ‌న ఆలోచ‌నా ధోర‌ణి మార‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వా? అంటే.. అవున‌నే సంకేతాలు పార్టీ…

10 hours ago

ఎవ‌రికి ఎప్పుడు `ముహూర్తం` పెట్టాలో లోకేష్ కు తెలుసు

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…

13 hours ago