ఏపీలో ఏం జరిగిందో ఏమో.. వరుసగా జరుగుతున్న అత్యంత దారుణ ఘటనలు సగటు వ్యక్తులను నివ్వెర పోయేలా చేస్తున్నా యి. కేవలం నాలుగంటే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో మూడు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నాలుగు కూడా.. పసికందులపైనే కావడం గమనార్హం. వీటిలో ఒక ఘటన ఐదు రోజుల చిన్నారిపై జరగ్గా.. మరో రెండు ఘటనలు కూడా 8 ఏళ్ల ముక్కుపచ్చలారని చిన్నారులపై చోటు చేసుకున్నాయి. ఆయా ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉలిక్కిపడేలా చేయడం తోపాటు.. మహిళలకే కాదు.. బాలికలకు కూడా రక్షణ కొరవడిందనే చర్చకు దారితీశాయి.
ఎక్కెడక్కడ?
వినేందుకు కూడా అసహ్యం:
విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం జీలుగువలసలో అత్యంత దారుణం జరిగింది. వరుసకు తాతయ్యే 61 ఏళ్ల వ్యక్తి.. ఊయలలో ఆడుకుంటున్న ఐదు నెలల పసికందును అపహరించి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇది వినేందుకు కూడా అసహ్యంగా ఉన్నా.. నిజం. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. స్పందించిన ప్రభుత్వం సదరు నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదేశించింది. చిన్నారి పేరిట రూ.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది.
ఆడిస్తానంటూ.. అఘాయిత్యం:
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మూలకండ్రిగ గ్రామంలో ఆరేళ్ల బాలికను ఆడిస్తానంటూ.. పిలిచిన 65 ఏళ్ల తాత.. ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన సమయంలో ఇంట్లో ఆ బాలిక ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఇంట్లోకి వెళ్లిన వృద్ధుడు.. ముందు చాక్లెట్ ఇచ్చి.. తర్వాత ఆడుకుందామంటూ.. తన ఇంటికి తీసుకువెళ్లి.. దారుణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేశారు.
యూట్యూబ్ చూసి అఘాయిత్యం:
నాలుగు రోజుల కిందట నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమర్రి పరిధిలో ఎనిమిదేళ్ల బాలికపై జరిగిన అఘాయిత్యం రాష్ట్రం నివ్వెర పోయేలా చేసింది. బాలికను ఆడుకుందామని పిలిచిన ముగ్గురు బాలురు.. అత్యంత దారుణానికి ఒడిగట్టారు. అంతేకాదు.. ఆమెపై అత్యాచారం చేసి.. అనంతరం.. హత్య చేశారు. బాలిక మృత దేహాన్ని ఓ బాలుడి తండ్రి.. కృష్ణానదిలో పడేయడం మరింత కలకలం రేపింది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. యూట్యూబ్ చూసి బాలురు.. ఈ అఘాయిత్యానికి పాల్పడడం. మరి పిల్లలకు సెలఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు ఈ ఘటన తర్వాతైనా మేల్కొంటారో లేదో చూడాలి.
అమ్మ పిలుస్తోందంటూ…
గుంటూరు జిల్లా చేబ్రోలులో 13 ఏళ్ల బాలికను ఓ గ్యాస్ డెలివరీ బాయ్.. ఆమె స్కూలుకు వెళ్లి.. మరీ మీ అమ్మ పిలుస్తోందంటూ బయటకు పిలిచాడు. అనంతరం.. తన ఇంటికి తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడడమే కాకుండా.. ఆమె గొంతు పిసికి చంపేశాడు. ఈ ఘటన 15వ తేదీ చోటు చేసుకుంది. గ్యాస్ డెలివరీ బాయ్గా చేస్తోన్న నాగరాజు ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో అందరూ నివ్వెర పోయారు. చనువుగా ఉన్నాడని భావించిన గ్యాస్ డెలివరీ బాయ్ ఇలా చేయడంతో బాలిక కుటుంబం నిర్ఘాంత పోయింది. కాగా, నాగరాజు పరారీలో ఉన్నాడు.
This post was last modified on July 16, 2024 9:31 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…