Political News

జ‌గ‌న్‌కు షాకిచ్చిన చంద్ర‌బాబు కేబినెట్‌

ఏపీలోని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని మంత్రివ‌ర్గ బృందం విప‌క్ష నేత జ‌గ‌న్ కు భారీ ఇచ్చింది. గ‌తంలో ఆయ‌న ప్ర‌బుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన‌.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేసింది. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో తొలి అజెండా అంశంగా.. దీనిని ఉంచారు. దీనికి కేబినెట్ ఏక‌గ్రీ వంగా ఆమోదం తెలిపింది. ఈ చ‌ట్టాన్ని తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నేర‌ద్దు చేస్తామ‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. మ‌లి సంత‌కం కూడా దీనిపైనే చేస్తాన‌ని చెప్పారు.

అన్న‌ట్టుగానే మూడో సంత‌కం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు పైనే చేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రి వ‌ర్గంలో నూ చ‌ర్చించి.. దీనిని ర‌ద్దు చేశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ చ‌ట్టం ర‌ద్దుకు సంబంధించిన బిల్లును ప్ర‌వేశ పెట్టి ఆమోదించ‌డంతో పూర్తిగా ఈ చ‌ట్టం క‌నుమ‌రుగు కానుంది. అయితే.. ఈ చ‌ట్టం కింద ఇప్ప‌టికే 20 వేల మందికి ప‌ట్టాలు ఇచ్చారు. వాటిని కూడా ర‌ద్దు చేసి స‌మీక్షించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. ఈ చట్టం స్థానంలో కొత్త చ‌ట్టాన్ని తీసుకురానున్నారు.

ఇక‌, ఉచిత ఇసుక‌ను పూర్తిస్థాయిలో ఆమోదిస్తూ.. మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం 20 జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ ప‌థ‌కాన్ని మున్ముందు.. అన్ని జిల్లాల‌కు విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్టి ప‌రిస్థితిలోనూ వేళ్లు పెట్టొద్ద‌నే విధానానికి కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. అక్టోబ‌రు నుంచి మ‌రింత‌గా ఇసుక అందుబాటులోకి వ‌స్తుంద‌ని, అప్పుడు అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించాల‌ని మంత్రి మండ‌లి తీర్మానించింది.

ఇక‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు 2 వేల కోట్లు అప్పు రూపంలో తెల్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్ర‌తిపాద‌న గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కారు చేసిందే అయినా.. ఇప్పుడు దీనిని అనుస‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు మంత్రి వ‌ర్గం ఏక‌గ్రీవంగా నిర్ణ‌యించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక‌, మంత్రులు ఎవ‌రూ వివాదాల జోలికి పోకూడ‌ద‌ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా దిశా నిర్దేశం చేశారు.

This post was last modified on July 16, 2024 9:53 pm

Share

Recent Posts

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

2 minutes ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

1 hour ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

3 hours ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

4 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

5 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

6 hours ago