Political News

జ‌గ‌న్‌కు షాకిచ్చిన చంద్ర‌బాబు కేబినెట్‌

ఏపీలోని సీఎం చంద్ర‌బాబు నేతృత్వంలోని మంత్రివ‌ర్గ బృందం విప‌క్ష నేత జ‌గ‌న్ కు భారీ ఇచ్చింది. గ‌తంలో ఆయ‌న ప్ర‌బుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకువ‌చ్చిన‌.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ర‌ద్దు చేసింది. తాజాగా జ‌రిగిన మంత్రివ‌ర్గ స‌మావేశంలో తొలి అజెండా అంశంగా.. దీనిని ఉంచారు. దీనికి కేబినెట్ ఏక‌గ్రీ వంగా ఆమోదం తెలిపింది. ఈ చ‌ట్టాన్ని తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నేర‌ద్దు చేస్తామ‌ని.. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. మ‌లి సంత‌కం కూడా దీనిపైనే చేస్తాన‌ని చెప్పారు.

అన్న‌ట్టుగానే మూడో సంత‌కం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ర‌ద్దు పైనే చేశారు. ఇక‌, ఇప్పుడు మంత్రి వ‌ర్గంలో నూ చ‌ర్చించి.. దీనిని ర‌ద్దు చేశారు. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ చ‌ట్టం ర‌ద్దుకు సంబంధించిన బిల్లును ప్ర‌వేశ పెట్టి ఆమోదించ‌డంతో పూర్తిగా ఈ చ‌ట్టం క‌నుమ‌రుగు కానుంది. అయితే.. ఈ చ‌ట్టం కింద ఇప్ప‌టికే 20 వేల మందికి ప‌ట్టాలు ఇచ్చారు. వాటిని కూడా ర‌ద్దు చేసి స‌మీక్షించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. ఈ చట్టం స్థానంలో కొత్త చ‌ట్టాన్ని తీసుకురానున్నారు.

ఇక‌, ఉచిత ఇసుక‌ను పూర్తిస్థాయిలో ఆమోదిస్తూ.. మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం 20 జిల్లాల‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన ఈ ప‌థ‌కాన్ని మున్ముందు.. అన్ని జిల్లాల‌కు విస్త‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్టి ప‌రిస్థితిలోనూ వేళ్లు పెట్టొద్ద‌నే విధానానికి కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపింది. అక్టోబ‌రు నుంచి మ‌రింత‌గా ఇసుక అందుబాటులోకి వ‌స్తుంద‌ని, అప్పుడు అన్ని ప్రాంతాల‌కు విస్త‌రించాల‌ని మంత్రి మండ‌లి తీర్మానించింది.

ఇక‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌కు 2 వేల కోట్లు అప్పు రూపంలో తెల్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్ర‌తిపాద‌న గ‌తంలో జ‌గ‌న్ స‌ర్కారు చేసిందే అయినా.. ఇప్పుడు దీనిని అనుస‌రించాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు మంత్రి వ‌ర్గం ఏక‌గ్రీవంగా నిర్ణ‌యించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్‌కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక‌, మంత్రులు ఎవ‌రూ వివాదాల జోలికి పోకూడ‌ద‌ని చంద్ర‌బాబు ఈ సంద‌ర్భంగా దిశా నిర్దేశం చేశారు.

This post was last modified on July 16, 2024 9:53 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago