ఏపీలోని సీఎం చంద్రబాబు నేతృత్వంలోని మంత్రివర్గ బృందం విపక్ష నేత జగన్ కు భారీ ఇచ్చింది. గతంలో ఆయన ప్రబుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసింది. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో తొలి అజెండా అంశంగా.. దీనిని ఉంచారు. దీనికి కేబినెట్ ఏకగ్రీ వంగా ఆమోదం తెలిపింది. ఈ చట్టాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనేరద్దు చేస్తామని.. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. మలి సంతకం కూడా దీనిపైనే చేస్తానని చెప్పారు.
అన్నట్టుగానే మూడో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైనే చేశారు. ఇక, ఇప్పుడు మంత్రి వర్గంలో నూ చర్చించి.. దీనిని రద్దు చేశారు. త్వరలోనే జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ చట్టం రద్దుకు సంబంధించిన బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించడంతో పూర్తిగా ఈ చట్టం కనుమరుగు కానుంది. అయితే.. ఈ చట్టం కింద ఇప్పటికే 20 వేల మందికి పట్టాలు ఇచ్చారు. వాటిని కూడా రద్దు చేసి సమీక్షించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నారు.
ఇక, ఉచిత ఇసుకను పూర్తిస్థాయిలో ఆమోదిస్తూ.. మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 20 జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఈ పథకాన్ని మున్ముందు.. అన్ని జిల్లాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితిలోనూ వేళ్లు పెట్టొద్దనే విధానానికి కూడా మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అక్టోబరు నుంచి మరింతగా ఇసుక అందుబాటులోకి వస్తుందని, అప్పుడు అన్ని ప్రాంతాలకు విస్తరించాలని మంత్రి మండలి తీర్మానించింది.
ఇక, పౌరసరఫరాల శాఖకు 2 వేల కోట్లు అప్పు రూపంలో తెల్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన గతంలో జగన్ సర్కారు చేసిందే అయినా.. ఇప్పుడు దీనిని అనుసరించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రి వర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం ఎన్సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పోరేషన్కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, మంత్రులు ఎవరూ వివాదాల జోలికి పోకూడదని చంద్రబాబు ఈ సందర్భంగా దిశా నిర్దేశం చేశారు.
This post was last modified on July 16, 2024 9:53 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…