Political News

22 నుంచి అసెంబ్లీ.. జ‌గ‌న్‌పై కేబినెట్‌లో చ‌ర్చ‌!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేర‌కు తాజాగా మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ద‌ఫా వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట నున్నారు. వైసీపీ హ‌యాంలో జూలై నెల ఆఖ‌రు వ‌ర‌కు ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జ‌ట్‌ను ప్ర‌వేశ పెట్టారు. ఈ గ‌డువు ఈ నెల 31తో ముగియ‌నుంది. దీంతో వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకోవాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించుకుంది.

అయితే.. ఈ స‌మావేశాల‌కు వైసీపీని ఆహ్వానించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించుకుంది. ముందుగా.. సంప్రదాయం ప్ర‌కారం.. స‌మావేశాల్లో వ్య‌వహ‌రించాల్సిన తీరు.. ఎన్ని రోజులు స‌మావేశాలు నిర్వ‌హించే అంశాల‌పై.. బిజినెస్ ఎడ్వైజ‌రీ క‌మిటీ(బీఏసీ) స‌మావేశం నిర్వ‌హిస్తారు. దీనిని అధికార పార్టీనే నిర్వ‌హిస్తుంది. దీనికి అసెంబ్లీ స‌భాప‌తిగా ఉన్న స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు నేతృత్వం వ‌హిస్తారు. అదేవిధంగా స‌భ‌లో ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు కూడా పాల్గొంటారు.

సంప్ర‌దాయం ప్ర‌కారం.. బీఏసీ స‌మావేశానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని కూడా ఆహ్వానిస్తారు. అయితే.. ఈ సారి వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌హోదా ద‌క్క‌లేదు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే స్పీక‌ర్ అయ్య‌న్న‌కు ఆయ‌న లేఖ రాశారు. దీనిపైకూడా.. కేబినెట్లో చ‌ర్చ‌ జరిగింది. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యానికి తాము క‌ట్టుబ‌డి ఉండాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఆహ్వానిస్తామ‌ని.. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు తేల్చి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీని కూడా ఆహ్వానించాల‌ని.. వ‌చ్చినా.. రాక‌పోయినా.. వారి ఇష్టానికే వ‌దిలేయాల‌ని మంత్రులు కూడా చెప్పిన‌ట్టు తెలిసింది.
సంప్ర‌దాయాన్ని మాత్రం మ‌నం గౌర‌విద్దామ‌ని సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. దీంతో వైసీపీని బీఏసీ స‌మావేశానికి ఆహ్వానించాల‌ని.. అయితే.. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యం ఆధారంగానే ఇది ఉండాల‌ని.. నిర్ణ‌యించారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 16, 2024 6:59 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

4 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

5 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

5 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

6 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

8 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

8 hours ago