ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు తాజాగా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ దఫా వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశ పెట్ట నున్నారు. వైసీపీ హయాంలో జూలై నెల ఆఖరు వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జట్ను ప్రవేశ పెట్టారు. ఈ గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించుకుంది.
అయితే.. ఈ సమావేశాలకు వైసీపీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించుకుంది. ముందుగా.. సంప్రదాయం ప్రకారం.. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు.. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించే అంశాలపై.. బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం నిర్వహిస్తారు. దీనిని అధికార పార్టీనే నిర్వహిస్తుంది. దీనికి అసెంబ్లీ సభాపతిగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వం వహిస్తారు. అదేవిధంగా సభలో ప్రభుత్వాధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారు.
సంప్రదాయం ప్రకారం.. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానిస్తారు. అయితే.. ఈ సారి వైసీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా దక్కలేదు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పీకర్ అయ్యన్నకు ఆయన లేఖ రాశారు. దీనిపైకూడా.. కేబినెట్లో చర్చ జరిగింది. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆహ్వానిస్తామని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో వైసీపీని కూడా ఆహ్వానించాలని.. వచ్చినా.. రాకపోయినా.. వారి ఇష్టానికే వదిలేయాలని మంత్రులు కూడా చెప్పినట్టు తెలిసింది.
సంప్రదాయాన్ని మాత్రం మనం గౌరవిద్దామని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. దీంతో వైసీపీని బీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని.. అయితే.. స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఇది ఉండాలని.. నిర్ణయించారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 16, 2024 6:59 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…