ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు తాజాగా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ దఫా వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశ పెట్ట నున్నారు. వైసీపీ హయాంలో జూలై నెల ఆఖరు వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జట్ను ప్రవేశ పెట్టారు. ఈ గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించుకుంది.
అయితే.. ఈ సమావేశాలకు వైసీపీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించుకుంది. ముందుగా.. సంప్రదాయం ప్రకారం.. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు.. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించే అంశాలపై.. బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం నిర్వహిస్తారు. దీనిని అధికార పార్టీనే నిర్వహిస్తుంది. దీనికి అసెంబ్లీ సభాపతిగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వం వహిస్తారు. అదేవిధంగా సభలో ప్రభుత్వాధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారు.
సంప్రదాయం ప్రకారం.. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానిస్తారు. అయితే.. ఈ సారి వైసీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా దక్కలేదు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పీకర్ అయ్యన్నకు ఆయన లేఖ రాశారు. దీనిపైకూడా.. కేబినెట్లో చర్చ జరిగింది. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆహ్వానిస్తామని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో వైసీపీని కూడా ఆహ్వానించాలని.. వచ్చినా.. రాకపోయినా.. వారి ఇష్టానికే వదిలేయాలని మంత్రులు కూడా చెప్పినట్టు తెలిసింది.
సంప్రదాయాన్ని మాత్రం మనం గౌరవిద్దామని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. దీంతో వైసీపీని బీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని.. అయితే.. స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఇది ఉండాలని.. నిర్ణయించారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 16, 2024 6:59 pm
యుద్ధ నేపధ్యాలు, చారిత్రాత్మక సంఘటనలు ఆధారంగా తీసే సినిమాలకు మినిస్ట్రీ అఫ్ డిఫెన్స్ అంగీకారం తప్పనిసరి. లేదంటే సెన్సార్ అభ్యంతరాలు…
మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగిన ఓ ఆధ్యాత్మిక వేడుక ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీసింది. 21 రోజుల పాటు…
అవును, నిజమే.. విజయ్ సాయి రెడ్డి మీడియా రంగంలోకి వస్తున్నారట.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించారు. త్వరలో…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజై మూడు నెలలు దాటేసింది. ఇప్పటిదాకా చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్స్ లేవు. అదిగో ఇదిగో…
టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో అడివి శేష్ పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నిర్మాతలు రెడీగా ఉన్నా వేగంగా సినిమాలు చేసేందుకు పరుగులు…
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్లు చెల్లించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా పెద్ద…