ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు తాజాగా మంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఈ దఫా వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశ పెట్ట నున్నారు. వైసీపీ హయాంలో జూలై నెల ఆఖరు వరకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జట్ను ప్రవేశ పెట్టారు. ఈ గడువు ఈ నెల 31తో ముగియనుంది. దీంతో వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్ను ప్రవేశ పెట్టి ఆమోదించుకోవాలని మంత్రి వర్గం నిర్ణయించుకుంది.
అయితే.. ఈ సమావేశాలకు వైసీపీని ఆహ్వానించాలని కేబినెట్ నిర్ణయించుకుంది. ముందుగా.. సంప్రదాయం ప్రకారం.. సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు.. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించే అంశాలపై.. బిజినెస్ ఎడ్వైజరీ కమిటీ(బీఏసీ) సమావేశం నిర్వహిస్తారు. దీనిని అధికార పార్టీనే నిర్వహిస్తుంది. దీనికి అసెంబ్లీ సభాపతిగా ఉన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వం వహిస్తారు. అదేవిధంగా సభలో ప్రభుత్వాధినేత చంద్రబాబు కూడా పాల్గొంటారు.
సంప్రదాయం ప్రకారం.. బీఏసీ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా ఆహ్వానిస్తారు. అయితే.. ఈ సారి వైసీపీకి ప్రధాన ప్రతిపక్షహోదా దక్కలేదు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే స్పీకర్ అయ్యన్నకు ఆయన లేఖ రాశారు. దీనిపైకూడా.. కేబినెట్లో చర్చ జరిగింది. స్పీకర్ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉండాలని కేబినెట్ నిర్ణయించింది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. ఆహ్వానిస్తామని.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు తేల్చి చెప్పారు.
ఈ నేపథ్యంలో వైసీపీని కూడా ఆహ్వానించాలని.. వచ్చినా.. రాకపోయినా.. వారి ఇష్టానికే వదిలేయాలని మంత్రులు కూడా చెప్పినట్టు తెలిసింది.
సంప్రదాయాన్ని మాత్రం మనం గౌరవిద్దామని సీఎం చంద్రబాబు కూడా చెప్పారు. దీంతో వైసీపీని బీఏసీ సమావేశానికి ఆహ్వానించాలని.. అయితే.. స్పీకర్ తీసుకునే నిర్ణయం ఆధారంగానే ఇది ఉండాలని.. నిర్ణయించారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…