Political News

22 నుంచి అసెంబ్లీ.. జ‌గ‌న్‌పై కేబినెట్‌లో చ‌ర్చ‌!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేర‌కు తాజాగా మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ద‌ఫా వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట నున్నారు. వైసీపీ హ‌యాంలో జూలై నెల ఆఖ‌రు వ‌ర‌కు ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జ‌ట్‌ను ప్ర‌వేశ పెట్టారు. ఈ గ‌డువు ఈ నెల 31తో ముగియ‌నుంది. దీంతో వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకోవాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించుకుంది.

అయితే.. ఈ స‌మావేశాల‌కు వైసీపీని ఆహ్వానించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించుకుంది. ముందుగా.. సంప్రదాయం ప్ర‌కారం.. స‌మావేశాల్లో వ్య‌వహ‌రించాల్సిన తీరు.. ఎన్ని రోజులు స‌మావేశాలు నిర్వ‌హించే అంశాల‌పై.. బిజినెస్ ఎడ్వైజ‌రీ క‌మిటీ(బీఏసీ) స‌మావేశం నిర్వ‌హిస్తారు. దీనిని అధికార పార్టీనే నిర్వ‌హిస్తుంది. దీనికి అసెంబ్లీ స‌భాప‌తిగా ఉన్న స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు నేతృత్వం వ‌హిస్తారు. అదేవిధంగా స‌భ‌లో ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు కూడా పాల్గొంటారు.

సంప్ర‌దాయం ప్ర‌కారం.. బీఏసీ స‌మావేశానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని కూడా ఆహ్వానిస్తారు. అయితే.. ఈ సారి వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌హోదా ద‌క్క‌లేదు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే స్పీక‌ర్ అయ్య‌న్న‌కు ఆయ‌న లేఖ రాశారు. దీనిపైకూడా.. కేబినెట్లో చ‌ర్చ‌ జరిగింది. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యానికి తాము క‌ట్టుబ‌డి ఉండాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఆహ్వానిస్తామ‌ని.. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు తేల్చి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీని కూడా ఆహ్వానించాల‌ని.. వ‌చ్చినా.. రాక‌పోయినా.. వారి ఇష్టానికే వ‌దిలేయాల‌ని మంత్రులు కూడా చెప్పిన‌ట్టు తెలిసింది.
సంప్ర‌దాయాన్ని మాత్రం మ‌నం గౌర‌విద్దామ‌ని సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. దీంతో వైసీపీని బీఏసీ స‌మావేశానికి ఆహ్వానించాల‌ని.. అయితే.. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యం ఆధారంగానే ఇది ఉండాల‌ని.. నిర్ణ‌యించారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 16, 2024 6:59 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

తెలివైన నిర్ణయం తీసుకున్న సారంగపాణి

ముందు విడుదల తేదీని ప్రకటించుకుని, ఆ తర్వాత పోటీదారులు వస్తే తప్పని పరిస్థితుల్లో డేట్ మార్చుకునే పరిస్థితి చిన్న సినిమాలకే…

1 hour ago

బాబు చేతులు మీదుగా అంగరంగ వైభవంగా కళ్యాణం

ఏపీలో రాముడి త‌ర‌హా రామ‌రాజ్యం తీసుకురావాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. రామ‌రాజ్యం అంటే.. ఏపీ స‌మ‌గ్ర అభివృద్ధి…

2 hours ago

త‌మిళ‌నాడుకు మంచి రోజులు: ప‌వ‌న్ క‌ల్యాణ్‌

త‌మిళ‌నాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవ‌డంపై ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.…

2 hours ago

మైత్రీకి డబ్బులొచ్చాయ్.. పేరు చెడుతోంది

హీరోలు మాత్రమేనా పాన్ ఇండియా రేంజికి వెళ్లేది.. నిర్మాతలు వెళ్లలేరా అన్నట్లు బహు భాషల్లో సినిమాలు తీస్తూ దూసుకెళ్తోంది టాలీవుడ్ అగ్ర…

2 hours ago

పవన్ కుమారుడిపై అనుచిత పోస్టు.. కేసులు నమోదు

సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు ఎంతకు తెగిస్తున్నారన్న దానికి ఈ ఘటన నిలువెత్తు నిదర్శనమని చెప్పక తప్పదు. జనసేన అధినేత, ఏపీ…

9 hours ago

గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్… జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై…

14 hours ago