Political News

22 నుంచి అసెంబ్లీ.. జ‌గ‌న్‌పై కేబినెట్‌లో చ‌ర్చ‌!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేర‌కు తాజాగా మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ద‌ఫా వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట నున్నారు. వైసీపీ హ‌యాంలో జూలై నెల ఆఖ‌రు వ‌ర‌కు ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జ‌ట్‌ను ప్ర‌వేశ పెట్టారు. ఈ గ‌డువు ఈ నెల 31తో ముగియ‌నుంది. దీంతో వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకోవాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించుకుంది.

అయితే.. ఈ స‌మావేశాల‌కు వైసీపీని ఆహ్వానించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించుకుంది. ముందుగా.. సంప్రదాయం ప్ర‌కారం.. స‌మావేశాల్లో వ్య‌వహ‌రించాల్సిన తీరు.. ఎన్ని రోజులు స‌మావేశాలు నిర్వ‌హించే అంశాల‌పై.. బిజినెస్ ఎడ్వైజ‌రీ క‌మిటీ(బీఏసీ) స‌మావేశం నిర్వ‌హిస్తారు. దీనిని అధికార పార్టీనే నిర్వ‌హిస్తుంది. దీనికి అసెంబ్లీ స‌భాప‌తిగా ఉన్న స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు నేతృత్వం వ‌హిస్తారు. అదేవిధంగా స‌భ‌లో ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు కూడా పాల్గొంటారు.

సంప్ర‌దాయం ప్ర‌కారం.. బీఏసీ స‌మావేశానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని కూడా ఆహ్వానిస్తారు. అయితే.. ఈ సారి వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌హోదా ద‌క్క‌లేదు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే స్పీక‌ర్ అయ్య‌న్న‌కు ఆయ‌న లేఖ రాశారు. దీనిపైకూడా.. కేబినెట్లో చ‌ర్చ‌ జరిగింది. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యానికి తాము క‌ట్టుబ‌డి ఉండాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఆహ్వానిస్తామ‌ని.. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు తేల్చి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీని కూడా ఆహ్వానించాల‌ని.. వ‌చ్చినా.. రాక‌పోయినా.. వారి ఇష్టానికే వ‌దిలేయాల‌ని మంత్రులు కూడా చెప్పిన‌ట్టు తెలిసింది.
సంప్ర‌దాయాన్ని మాత్రం మ‌నం గౌర‌విద్దామ‌ని సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. దీంతో వైసీపీని బీఏసీ స‌మావేశానికి ఆహ్వానించాల‌ని.. అయితే.. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యం ఆధారంగానే ఇది ఉండాల‌ని.. నిర్ణ‌యించారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

Satya

Recent Posts

జగన్ అటాక్ మోడ్ లోకి వచ్చినట్టేనా…?

ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…

20 minutes ago

సీబీఎన్ @ 361 డిగ్రీస్..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. పాల‌న‌, ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యాలు.. వేస్తున్న అడుగులు, భ‌విష్య‌త్తు ఆంధ్ర ప్ర‌దేశ్ నిర్మాణం.. వంటి ప‌లు…

50 minutes ago

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

3 hours ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

3 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

4 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

4 hours ago