Political News

22 నుంచి అసెంబ్లీ.. జ‌గ‌న్‌పై కేబినెట్‌లో చ‌ర్చ‌!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేర‌కు తాజాగా మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ద‌ఫా వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట నున్నారు. వైసీపీ హ‌యాంలో జూలై నెల ఆఖ‌రు వ‌ర‌కు ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జ‌ట్‌ను ప్ర‌వేశ పెట్టారు. ఈ గ‌డువు ఈ నెల 31తో ముగియ‌నుంది. దీంతో వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకోవాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించుకుంది.

అయితే.. ఈ స‌మావేశాల‌కు వైసీపీని ఆహ్వానించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించుకుంది. ముందుగా.. సంప్రదాయం ప్ర‌కారం.. స‌మావేశాల్లో వ్య‌వహ‌రించాల్సిన తీరు.. ఎన్ని రోజులు స‌మావేశాలు నిర్వ‌హించే అంశాల‌పై.. బిజినెస్ ఎడ్వైజ‌రీ క‌మిటీ(బీఏసీ) స‌మావేశం నిర్వ‌హిస్తారు. దీనిని అధికార పార్టీనే నిర్వ‌హిస్తుంది. దీనికి అసెంబ్లీ స‌భాప‌తిగా ఉన్న స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు నేతృత్వం వ‌హిస్తారు. అదేవిధంగా స‌భ‌లో ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు కూడా పాల్గొంటారు.

సంప్ర‌దాయం ప్ర‌కారం.. బీఏసీ స‌మావేశానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని కూడా ఆహ్వానిస్తారు. అయితే.. ఈ సారి వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌హోదా ద‌క్క‌లేదు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే స్పీక‌ర్ అయ్య‌న్న‌కు ఆయ‌న లేఖ రాశారు. దీనిపైకూడా.. కేబినెట్లో చ‌ర్చ‌ జరిగింది. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యానికి తాము క‌ట్టుబ‌డి ఉండాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఆహ్వానిస్తామ‌ని.. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు తేల్చి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీని కూడా ఆహ్వానించాల‌ని.. వ‌చ్చినా.. రాక‌పోయినా.. వారి ఇష్టానికే వ‌దిలేయాల‌ని మంత్రులు కూడా చెప్పిన‌ట్టు తెలిసింది.
సంప్ర‌దాయాన్ని మాత్రం మ‌నం గౌర‌విద్దామ‌ని సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. దీంతో వైసీపీని బీఏసీ స‌మావేశానికి ఆహ్వానించాల‌ని.. అయితే.. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యం ఆధారంగానే ఇది ఉండాల‌ని.. నిర్ణ‌యించారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 16, 2024 6:59 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

4 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago