Political News

22 నుంచి అసెంబ్లీ.. జ‌గ‌న్‌పై కేబినెట్‌లో చ‌ర్చ‌!

ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు.. ఈ నెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేర‌కు తాజాగా మంత్రి వ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. ఈ ద‌ఫా వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను అసెంబ్లీలో ప్ర‌వేశ పెట్ట నున్నారు. వైసీపీ హ‌యాంలో జూలై నెల ఆఖ‌రు వ‌ర‌కు ఓట్ ఆన్ అకౌంట్ బ‌డ్జ‌ట్‌ను ప్ర‌వేశ పెట్టారు. ఈ గ‌డువు ఈ నెల 31తో ముగియ‌నుంది. దీంతో వ‌చ్చే ఏడు మాసాల‌కు సంబంధించిన బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టి ఆమోదించుకోవాల‌ని మంత్రి వ‌ర్గం నిర్ణ‌యించుకుంది.

అయితే.. ఈ స‌మావేశాల‌కు వైసీపీని ఆహ్వానించాల‌ని కేబినెట్ నిర్ణ‌యించుకుంది. ముందుగా.. సంప్రదాయం ప్ర‌కారం.. స‌మావేశాల్లో వ్య‌వహ‌రించాల్సిన తీరు.. ఎన్ని రోజులు స‌మావేశాలు నిర్వ‌హించే అంశాల‌పై.. బిజినెస్ ఎడ్వైజ‌రీ క‌మిటీ(బీఏసీ) స‌మావేశం నిర్వ‌హిస్తారు. దీనిని అధికార పార్టీనే నిర్వ‌హిస్తుంది. దీనికి అసెంబ్లీ స‌భాప‌తిగా ఉన్న స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు నేతృత్వం వ‌హిస్తారు. అదేవిధంగా స‌భ‌లో ప్ర‌భుత్వాధినేత చంద్ర‌బాబు కూడా పాల్గొంటారు.

సంప్ర‌దాయం ప్ర‌కారం.. బీఏసీ స‌మావేశానికి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాన్ని కూడా ఆహ్వానిస్తారు. అయితే.. ఈ సారి వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌హోదా ద‌క్క‌లేదు. దీనిపై మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ ఇప్ప‌టికే స్పీక‌ర్ అయ్య‌న్న‌కు ఆయ‌న లేఖ రాశారు. దీనిపైకూడా.. కేబినెట్లో చ‌ర్చ‌ జరిగింది. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యానికి తాము క‌ట్టుబ‌డి ఉండాల‌ని కేబినెట్ నిర్ణ‌యించింది. స్పీక‌ర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. ఆహ్వానిస్తామ‌ని.. సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు తేల్చి చెప్పారు.

ఈ నేప‌థ్యంలో వైసీపీని కూడా ఆహ్వానించాల‌ని.. వ‌చ్చినా.. రాక‌పోయినా.. వారి ఇష్టానికే వ‌దిలేయాల‌ని మంత్రులు కూడా చెప్పిన‌ట్టు తెలిసింది.
సంప్ర‌దాయాన్ని మాత్రం మ‌నం గౌర‌విద్దామ‌ని సీఎం చంద్ర‌బాబు కూడా చెప్పారు. దీంతో వైసీపీని బీఏసీ స‌మావేశానికి ఆహ్వానించాల‌ని.. అయితే.. స్పీక‌ర్ తీసుకునే నిర్ణ‌యం ఆధారంగానే ఇది ఉండాల‌ని.. నిర్ణ‌యించారు. మ‌రి జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on July 16, 2024 6:59 pm

Share

Recent Posts

హోంమంత్రి పై కూలిన డ్రోన్‌… ఏం జ‌రిగింది?

ఏపీ హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్‌.. కొద్ద దూరం పైకి వెళ్లి…

43 minutes ago

కుళ్లిపోయిన 100 టన్నుల చికెన్‌… చేపల ఆహారంగా!

కుళ్లిపోయిన చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో…

2 hours ago

విద్యార్థినులతో కలిసి జలకాలాట… ప్రిన్సిపాల్ సస్పెండ్

బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…

2 hours ago

ఆ ముగ్గురి మ‌ర‌ణానికి కార‌ణం ఐఫోన్ కాదా?

మ‌హారాష్ట్ర‌లో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండ‌గా, నిమిషాల వ్య‌వ‌ధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్…

2 hours ago

జగన్ మతమార్పిడులు ప్రోత్సహించారు.. విజయసాయి సంచలన ఆరోపణ

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…

3 hours ago

ప్యారడైజ్ కోసం ప్రాణాలు పెట్టేస్తున్నారు

సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…

4 hours ago