Political News

టీడీపీలో కొత్త సంప్ర‌దాయం.. తెలిస్తే..ఆశ్చ‌ర్యం ఖాయం!

రాష్ట్రంలోని కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌కంగా ఉన్న టీడీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా గ‌డిచిన నెల రోజుల పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. స‌మీక్షించారు. పాల‌న‌లో అనుస‌రించాల్సిన ప‌ద్ధ‌తుల‌ను.. ఇప్ప‌టి వ‌ర‌కు సాగించిన పాల‌న‌ను కూడా చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా ఎక్కువ
మంది ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తే.. బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు.

ఇదే అభిప్రాయాన్ని చంద్ర‌బాబు కూడా తెలిపారు. రాష్ట్ర కీల‌క స‌మ‌స్య‌ల ప‌రిష్కారం ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ్య‌క్తిగ‌తంగా త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుకుంటున్న వారు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నార‌న్న విష‌యాన్ని సీఎం, డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. తాము నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బార్‌లో నిత్యం వేలాది మంది ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఎదురు చూస్తున్న‌ట్టు టీడీపీ మంత్రులు కూడా చెప్పారు. ఇక‌, జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో నిర్వ‌హిస్తున్న జ‌న‌వాణిలో కూడా ఎక్కువ మంది ప్ర‌జలు త‌మ వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతున్నార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా ఇత‌ర జ‌న‌సేన పార్టీకి చెందిన మంత్రులు చెప్పారు.

ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే.. జ‌న‌సేన పార్టీ కార్యాల‌యాల్లో నాయ‌కులు అందుబాటులో ఉండి ప్ర‌జ‌ల స‌మస్యలు ప‌రిష్క‌రించేలా ఆదేశాలు జారి చేసిన‌ట్టు ప‌వ‌న్ చెప్పారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ త‌ర‌ఫున కూడా.. చ‌ర్య‌లు తీసుకుంటే బాగుంటుంద‌న్న సూచ‌న‌ల నేప‌థ్యంలో చంద్ర‌బాబు కూడా పార్టీ కేంద్ర కార్యాల యంలో రొజుకోక మంత్రి చొప్పున ఉండి.. ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు స్వీక‌రించి.. వాటిని ప‌రిష్క‌రిం చాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. దీంతో ఈ నెల నుంచే మంత్రులు టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో ఉండి.. ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు తీసుకోవ‌డంతోపాటు.. వాటిని ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

This post was last modified on July 16, 2024 6:26 pm

Share
Show comments
Published by
Satya
Tags: TDP

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

3 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

3 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

3 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

4 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

6 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

8 hours ago