రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గడిచిన నెల రోజుల పాలనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు.. సమీక్షించారు. పాలనలో అనుసరించాల్సిన పద్ధతులను.. ఇప్పటి వరకు సాగించిన పాలనను కూడా చర్చించారు. ఈ సందర్భంగా ఎక్కువ
మంది ప్రజలు తమ సమస్యలను పరిష్కరిస్తే.. బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఇదే అభిప్రాయాన్ని చంద్రబాబు కూడా తెలిపారు. రాష్ట్ర కీలక సమస్యల పరిష్కారం ఎలా ఉన్నప్పటికీ.. వ్యక్తిగతంగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్న వారు లక్షల సంఖ్యలో ఉన్నారన్న విషయాన్ని సీఎం, డిప్యూటీ సీఎం చెప్పుకొచ్చారు. తాము నిర్వహించిన ప్రజాదర్బార్లో నిత్యం వేలాది మంది ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నట్టు టీడీపీ మంత్రులు కూడా చెప్పారు. ఇక, జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహిస్తున్న జనవాణిలో కూడా ఎక్కువ మంది ప్రజలు తమ వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోరుతున్నారని పవన్ కల్యాణ్ సహా ఇతర జనసేన పార్టీకి చెందిన మంత్రులు చెప్పారు.
ఈ నేపథ్యంలో ఇప్పటికే.. జనసేన పార్టీ కార్యాలయాల్లో నాయకులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరించేలా ఆదేశాలు జారి చేసినట్టు పవన్ చెప్పారు. ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున కూడా.. చర్యలు తీసుకుంటే బాగుంటుందన్న సూచనల నేపథ్యంలో చంద్రబాబు కూడా పార్టీ కేంద్ర కార్యాల యంలో రొజుకోక మంత్రి చొప్పున ఉండి.. ప్రజల నుంచి సమస్యలు స్వీకరించి.. వాటిని పరిష్కరిం చాలని చంద్రబాబు ఆదేశించారు. దీంతో ఈ నెల నుంచే మంత్రులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఉండి.. ప్రజల నుంచి సమస్యలు తీసుకోవడంతోపాటు.. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయనున్నారు.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…