ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో రాష్ట్రంలోనే అధికంగా గాజువాక శాసనసభ స్థానం నుండి 95,235 ఓట్ల అత్యధిక మెజారిటీతో టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు విజయం సాధించాడు. మంత్రివర్గంలో అవకాశం దక్కకపోవడంతో ఆయనకు ఏపీ టీడీపీ అధ్యక్ష్య పదవిని కట్టబెట్టారు.
అయితే పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజారిటీ సాధించినా నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓట్లు సాధించి జనసేన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అగ్రస్థానంలో నిలిచినట్లు ఏడీఆర్ విశ్లేషణలో వెల్లడయింది. తన నియోజకవర్గంలో ఆయన 70.23 శాతం ఓట్లు సాధించడం విశేషం. అయితే ఆయనకు దక్కిన మెజారిటీ మాత్రం 64,594. వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న శ్రీనివాస్ 2021లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. గత ఏడాది డిసెంబరులో జనసేనలో చేరి ఎమ్మెల్యేగా గెలిచాడు.
మహిళా ఎమ్మెల్యేలలో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి 64.21 అత్యధిక శాతం ఓట్లు సాధించగా, పాలకొల్లు టిడిపి ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు 69.30 శాతం, నెల్లూరు సిటీ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి పొంగూరు నారాయణ 68.99 శాతం ఓట్లు సాధించారు.
అత్యల్పంగా 0.19 శాతం ఓట్లతో మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, 0.47 శాతం ఓట్లతో గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అత్యల్ప ఓట్లతో విజయం సాధించిన వారిలో ఉన్నారు.
This post was last modified on July 16, 2024 12:54 pm
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…