Political News

జ‌గ‌న్ ప‌ట్టించుకోలా.. మీరెందుకు ప‌ట్టించుకుంటారు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న‌ గ‌త ఐదేళ్ల‌లో ప్ర‌తిప‌క్ష పార్టీలైన తెలుగుదేశం, జ‌న‌సేన నేత‌ల‌ను మించి జ‌గ‌న్ అండ్ కోను ఇబ్బంది పెట్టిన నాయ‌కుడు ర‌ఘురామకృష్ణంరాజు. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఏడాది తిర‌క్క‌ముందే ఆయ‌న రెబ‌ల్ నేత‌గా మారారు. వైసీపీలో ఉంటూనే మా ముఖ్య‌మంత్రి, మా పార్టీ అంటూ ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో జ‌గ‌న్ అండ్ కో వైఫ‌ల్యాలు, అక్ర‌మాల‌న్నింటినీ బ‌య‌ట‌పెట్టారాయ‌న‌.

దీంతో జ‌గ‌న్ ఆయ‌న మీద క‌సి పెంచుకుని ఒక కేసులో జైల్లో పెట్టించే ప్ర‌య‌త్నం చేశారు. పోలీసులు ఆయ‌న్ని హింసించిన‌ట్లు బ‌ల‌మైన అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కాగా ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి జ‌గ‌న్‌కు గ‌ట్టి పంచ్ ఇచ్చారు ర‌ఘురామ‌. విజ‌యానంత‌రం కూడా ఆయ‌న జ‌గ‌న్ అండ్ కోను వ‌ద‌ల‌ట్లేదు. అసెంబ్లీలో జ‌గ‌న్‌కు ఇచ్చిన కౌంట‌ర్ల గురించి తెలిసిందే.

కాగా ర‌ఘురామ తాజాగా జ‌గ‌న్‌తో పాటు బీఆర్ఎస్ అగ్ర నేత‌ల్లో ఒక‌రైన కేటీఆర్‌ను ఒకేసారి టార్గెట్ చేసుకున్నారు. ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఎలా ఓడిపోయిందో అర్థం కావ‌డం లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణ‌లో ఎందుకు ఓడిపోయామో తెలియ‌ని స్థితిలో బీఆర్ఎస్ ఉంద‌ని.. ఆ పార్టీది కూడా వైసీపీ స్థితే అని.. మిత్ర‌ధ‌ర్మం పాటిస్తూ వైసీపీ ఓట‌మి గురించి ఆయ‌న ఆశ్చ‌ర్య‌పోయార‌ని.. కానీ జ‌గ‌న్ ఆ పార్టీ ఓడిపోయిన‌పుడు ప‌ట్టించుకోని విష‌యం మ‌రిచిపోతున్నార‌ని ర‌ఘురామ అన్నారు.

బీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోయిన‌పుడు జ‌గ‌న్ ఒక్క మాటా మాట్లాడ‌లేద‌ని.. ఇంత ష‌క్క‌గా ప‌రిపాలించినా ఓడిపోయారంటేని ఒక్క మాటా అన‌లేదని జ‌గ‌న్ స్టైల్లో ఆయ‌న మాట్లాడుతూ ఆయ‌న కేటీఆర్‌కు ఆ సంగ‌తి గుర్తు చేసే ప్ర‌య‌త్నం చేశారు. తామెందుకు ఓడిపోయామో తెలియ‌క జ‌గ‌న్ ఇంకా బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకుంటుంటే కేటీఆర్ కూడా అలాగే మాట్లాడుతున్నార‌ని.. కానీ వారి పార్టీని ప‌ట్టించుకోని జ‌గ‌న్ గురించి వాళ్లెందుకు ఆందోళ‌న చెందుతున్నార‌ని ర‌ఘురామ ప్ర‌శ్నించారు.

This post was last modified on July 11, 2024 9:49 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

2 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

3 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

3 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago