వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న గత ఐదేళ్లలో ప్రతిపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన నేతలను మించి జగన్ అండ్ కోను ఇబ్బంది పెట్టిన నాయకుడు రఘురామకృష్ణంరాజు. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన ఏడాది తిరక్కముందే ఆయన రెబల్ నేతగా మారారు. వైసీపీలో ఉంటూనే మా ముఖ్యమంత్రి, మా పార్టీ అంటూ రచ్చబండ కార్యక్రమంలో జగన్ అండ్ కో వైఫల్యాలు, అక్రమాలన్నింటినీ బయటపెట్టారాయన.
దీంతో జగన్ ఆయన మీద కసి పెంచుకుని ఒక కేసులో జైల్లో పెట్టించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆయన్ని హింసించినట్లు బలమైన అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి జగన్కు గట్టి పంచ్ ఇచ్చారు రఘురామ. విజయానంతరం కూడా ఆయన జగన్ అండ్ కోను వదలట్లేదు. అసెంబ్లీలో జగన్కు ఇచ్చిన కౌంటర్ల గురించి తెలిసిందే.
కాగా రఘురామ తాజాగా జగన్తో పాటు బీఆర్ఎస్ అగ్ర నేతల్లో ఒకరైన కేటీఆర్ను ఒకేసారి టార్గెట్ చేసుకున్నారు. ఏపీ ఎన్నికల్లో వైసీపీ ఎలా ఓడిపోయిందో అర్థం కావడం లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఎందుకు ఓడిపోయామో తెలియని స్థితిలో బీఆర్ఎస్ ఉందని.. ఆ పార్టీది కూడా వైసీపీ స్థితే అని.. మిత్రధర్మం పాటిస్తూ వైసీపీ ఓటమి గురించి ఆయన ఆశ్చర్యపోయారని.. కానీ జగన్ ఆ పార్టీ ఓడిపోయినపుడు పట్టించుకోని విషయం మరిచిపోతున్నారని రఘురామ అన్నారు.
బీఆర్ఎస్ తెలంగాణలో ఓడిపోయినపుడు జగన్ ఒక్క మాటా మాట్లాడలేదని.. ఇంత షక్కగా పరిపాలించినా ఓడిపోయారంటేని ఒక్క మాటా అనలేదని జగన్ స్టైల్లో ఆయన మాట్లాడుతూ ఆయన కేటీఆర్కు ఆ సంగతి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తామెందుకు ఓడిపోయామో తెలియక జగన్ ఇంకా బుర్ర బద్దలు కొట్టుకుంటుంటే కేటీఆర్ కూడా అలాగే మాట్లాడుతున్నారని.. కానీ వారి పార్టీని పట్టించుకోని జగన్ గురించి వాళ్లెందుకు ఆందోళన చెందుతున్నారని రఘురామ ప్రశ్నించారు.
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…
యానిమల్ 3 గంటల 20 నిముషాలు ఉన్నా జనం బోర్ కొట్టకుండా చూశారు. పుష్ప 2 అంతకంటే ఎక్కువే అయినా…
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…