Political News

బాబు ఎఫెక్ట్‌.. ప్ర‌భుత్వ పాజిటివిటీ గ్రాఫ్ ఏ రేంజ్‌లో అంటే..!

రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైంది. గత నెల 12న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. ఈ నేపథ్యంలో గడిచిన నెల రోజుల్లో ఆయన వేసిన అడుగులు పాజిటివిటీని పెంచాయ‌నే చెప్పాలి.

వచ్చి రావడంతోనే సహజంగా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేస్తారని విపక్షం ఎదురు చూసింది. కానీ ఒక్కొక్కటి అమలు చేస్తూ నిదానంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేయటం చంద్రబాబు సీనియారిటీకి అద్దం పట్టింది. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది, దీనికి ప్రభుత్వం అడుగులు వేస్తోంది అనే స్పష్టమైన సూచనలను ఆయన పంపించారు.

వ‌చ్చీ రావడంతోనే పోలవరంలో పర్యటించారు. పోలవరం సమస్యలపై కేంద్రానికి నివేదిక ఇచ్చారు. అంతర్జాతీయ నిపుణుల బృందాన్ని తీసుకొచ్చారు. పరిశీలన చేయిస్తున్నారు. తద్వారా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతాలను ప్రజల్లోకి బలంగా పంపించగలిగారు.

అనంతరం అమరావతి రాజధానులో పర్యటించారు. అమరావతి ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుంది? ఏం చేయాలి? అనేది సమీక్షించారు. ప్రజలకు స్వేత పత్రం విడుదల చేశారు. అదేవిధంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించారు.

కేంద్రానికి కూడా నివేదికలు సమర్పించారు. అమరావతికి సాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలంటూ ఆయన అర్జీలు పెట్టుకున్నారు. తద్వారా చంద్రబాబు నాయుడు వస్తే అభివృద్ధి జరుగుతుంది అన్న సంకేతాలను బలంగా పంపించగలిగారు.

ఇక‌, పెంచిన పింఛన్లను ఠంచనుగా పంపిణీ చేయించారు. వాలంటీర్లు ఉంటే తప్ప పింఛన్లను అందించలేమని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాలంటీర్లు లేకపోయినా వ్యవస్థ ఆగదని, పేదలకు. లబ్ధిదారులకు మేలు జరుగుతుందని ఆ దిశగా తాము పని చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు కచ్చితంగా చేసి చూపించారు. అదేవిధంగా ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున పెంచిన నగదును ఇచ్చారు.

ఇక ఉద్యోగుల విషయానికొస్తే వారు కూడా సంతోషించేలా ఒకటి రెండు తారీకుల్లోనే వేతనాలను పూర్తిస్థాయిలో అందించగలిగారు. రిటైర్డ్ ఉద్యోగులకు కూడా పింఛన్లు సకాలంలో ఇవ్వగలిగారు. ఇవన్నీ సానుకూల సంకేతాలు అందించాయి.

మరో ముఖ్యమైన విషయం ఉచిత ఇసుక అందించడం. ప్రభుత్వం వచ్చి నెలరోజులు కూడా గడవకముందే చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుకను పక్కాగా అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 20 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా ఈ పథకాన్ని ప్రారంభించారు.

తక్కువ ఖర్చుతో కేవలం రవాణా, కూలీ చార్జీలు చెల్లించడం ద్వారా ప్రజలకు మెరుగైన విధానంలో ఇసుకను అందించేలా ఏర్పాట్లు చేశారు. ఇది భవన నిర్మాణ రంగాన్ని రియల్ ఎస్టేట్ రంగాన్ని అదేవిధంగా సాధారణ ప్రజలకు కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితిని కల్పించింది.

తద్వారా చంద్రబాబు ప్రభుత్వంపై సానుకూల ధోరణి మరింత పెరిగేలా చేసింది. ఈ నెల రోజుల్లో అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా చంద్రబాబు వేసిన అడుగులు భవిష్యత్తులో రాష్ట్రం ముందుకు వెళుతుంది అనే భావనను సాధారణ ప్రజల నుంచి మేధావులు వరకు కూడా అంగీకరించేలా చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 10, 2024 4:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

1 minute ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

2 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

4 hours ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

5 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

5 hours ago