Political News

ఈ పేచీ.. తీర‌నిది.. క‌మిటీల‌తో స‌రి!

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న ఆస్తుల వివాదం ఇప్ప‌ట్లో ప‌రిష్కారం అయ్యేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా జ‌రిగిన ముఖ్య‌మంత్రుల స‌మావేశంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటు వైపు ఏపీ నుంచి చంద్ర‌బాబు, అటువైపు తెలంగాణ నుంచి రేవంత్‌రెడ్డిలు.. కీల‌క రోల్ పోషిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా చాలా చాలా ఆస‌క్తిగా ఈ మీటింగ్‌ను పరిశీలించారు. రెండు గంట‌ల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో కీల‌క‌మైన 10 అంశాల‌ను అజెండాగా చేసుకున్నారు. అయితే.. దేనిపైనా క్లారిటీ రాక‌పోవ‌డం.. ప‌ట్టు-బిగింపులు విడ‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆది నుంచి నెల‌కొన్న రాజ‌కీయ ప్ర‌భావం.. ఇప్పుడు కూడా కొన‌సాగింది. తెలంగాణలో నెల‌కొన్న విభ‌జ‌న స్థిరాస్తుల‌ను ఇచ్చేది లేద‌ని.. గ‌తంలో కేసీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడే చెప్పారు. ఇప్పుడు దీనిని రేవంత్‌రెడ్డి కొన‌సాగించారు. వాస్త‌వానికి ఆర్టీసీ భ‌వ‌న్ స‌హా.. లేక్ వ్యూ అతిథి గృహం కీల‌కంగా మారాయి. వీటిని త‌మ‌కు పంచాల‌న్నది.. ఏపీ డిమాండ్. కానీ, దీనికి గ‌త స‌ర్కారు ఒప్పుకోన‌ట్టే ఇప్పుడు రేవంత్ ప్ర‌భుత్వం కూడా స‌సేమ‌రా అంది. స్థిర ఆస్తులు ఏవున్నా కూడా.. తెలంగాణ‌కు ద‌ఖ‌లు ప‌డాల్సిందేన‌ని తేల్చి చెప్పారు సీఎం. ఇది విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో మోకాల‌డ్డుతున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.

అయితే.. ఇప్పుడు కొంత వెసులుబాటు క‌ల్పిస్తూ.. ఏపీకి అవ‌స‌ర‌మైతే. స్థ‌లం ఇస్తాం.. మీరు క‌ట్టుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టు తెలిసింది. ఇది ఏపీకి మ‌రింత భారంగా ప‌రిణ‌మించే అంశంగా మారింది. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ద‌శాబ్ద కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్యల ప‌రిష్కారానికి కొత్త‌గా క‌మిటీల‌ను ప్ర‌తిపాదించ‌డం మాత్ర‌మే ఈ స‌మావేశంలో జ‌రిగిన మేలైన నిర్ణ‌యంగా చెప్పుకొవ‌చ్చు. ఒక‌టి మంత్రుల‌తో కూడిన క‌మిటీ అయితే..రెండోది.. అధికారుల‌తో కూడిన క‌మిటీ. విబ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌పై నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు.. అధికారుల క‌మిటీ చ‌ర్య‌లు సూచిస్తుంది.

ఇక‌, విభ‌జ‌న చ‌ట్టంలో లేని.. తిరుమ‌ల‌, ఓడ‌రేవులు, తీర‌ప్రాంతం వంటి అంశాల‌పై మంత్రుల క‌మిటీ సూచ‌న‌లు చేస్తుంది. వీటిని ఆ ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే.. ఇరు రాష్ట్రాలుకూడా.. చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్క‌రించుకునేందుకు మొగ్గు చూపాయి. ఇదేస‌మ‌యంలో కొన్ని అంశాల‌పై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. వాటిపై చ‌ర్చ‌కు వ‌చ్చినా.. తీర్పుల‌ను బ‌ట్టి.. నిర్ణ‌యం తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఇత‌మిత్థంగా తేల్చింది.. ఏమీ లేక‌పోయినా.. ఒక సుహృద్భావ వాతావర‌ణం అయితే.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డ‌డం ఒక్క‌టే ఆశాజ‌న‌కంగా మారింది.

Satya

Recent Posts

రామ్ చరణ్ 17… లాంగ్ వెయిటింగ్ తప్పదు

పెద్ది విజయాన్ని ఆస్వాదిస్తున్న రామ్ చరణ్ త్వరలోనే చేతికి కీలకమైన సర్జరీ చేయించుకోబోతున్నాడు. ప్రమోషన్ల కోసమే దాన్ని బ్రేక్ వేస్తూ…

3 hours ago

వరలక్ష్మి మీద మళ్ళీ ఆరోపణలు

ఆ మధ్య ఎస్ సరస్వతి సినిమా విడుదల టైంలో దర్శక నిర్మాత వరలక్ష్మి శరత్ కుమార్, రచయిత సాయి మాధవ్…

3 hours ago

బొంబాయి మాఫియాలో ‘బాలయ్య’ మాస్

వీరసింహారెడ్డి కాంబినేషన్ రిపీట్ చేస్తూ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని మళ్ళీ చేతులు కలిపారు. ప్రారంభం కావడంలో కొంత…

4 hours ago

‘దురంధర్’ చూసిన కళ్ళకు ‘ఆల్ఫా’ నచ్చేనా

ఎవరు ఔనన్నా కాదన్నా బాలీవుడ్ స్పై థ్రిల్లర్స్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సినిమాగా దురంధర్ పేరు…

5 hours ago

అమరావతిలో రూ.2.5 వేల కోట్ల కేంద్ర ప్రాజెక్టు

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా కాకుండా చేయడం ఇక ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఒక వేళ కూటమి…

7 hours ago

మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్‌.. వైసీపీకి ఇర‌కాటం.. !

నెల్లూరు జిల్లా వైసీపీలో మాజీ మంత్రుల సెల్ఫ్ గోల్ రాజకీయాలు పార్టీని, వారి కార్యకర్తలను తీవ్ర స్థాయిలో ఇబ్బందికి గురిచేస్తున్నాయి.…

8 hours ago