Political News

ఈ పేచీ.. తీర‌నిది.. క‌మిటీల‌తో స‌రి!

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న ఆస్తుల వివాదం ఇప్ప‌ట్లో ప‌రిష్కారం అయ్యేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా జ‌రిగిన ముఖ్య‌మంత్రుల స‌మావేశంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటు వైపు ఏపీ నుంచి చంద్ర‌బాబు, అటువైపు తెలంగాణ నుంచి రేవంత్‌రెడ్డిలు.. కీల‌క రోల్ పోషిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా చాలా చాలా ఆస‌క్తిగా ఈ మీటింగ్‌ను పరిశీలించారు. రెండు గంట‌ల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో కీల‌క‌మైన 10 అంశాల‌ను అజెండాగా చేసుకున్నారు. అయితే.. దేనిపైనా క్లారిటీ రాక‌పోవ‌డం.. ప‌ట్టు-బిగింపులు విడ‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆది నుంచి నెల‌కొన్న రాజ‌కీయ ప్ర‌భావం.. ఇప్పుడు కూడా కొన‌సాగింది. తెలంగాణలో నెల‌కొన్న విభ‌జ‌న స్థిరాస్తుల‌ను ఇచ్చేది లేద‌ని.. గ‌తంలో కేసీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడే చెప్పారు. ఇప్పుడు దీనిని రేవంత్‌రెడ్డి కొన‌సాగించారు. వాస్త‌వానికి ఆర్టీసీ భ‌వ‌న్ స‌హా.. లేక్ వ్యూ అతిథి గృహం కీల‌కంగా మారాయి. వీటిని త‌మ‌కు పంచాల‌న్నది.. ఏపీ డిమాండ్. కానీ, దీనికి గ‌త స‌ర్కారు ఒప్పుకోన‌ట్టే ఇప్పుడు రేవంత్ ప్ర‌భుత్వం కూడా స‌సేమ‌రా అంది. స్థిర ఆస్తులు ఏవున్నా కూడా.. తెలంగాణ‌కు ద‌ఖ‌లు ప‌డాల్సిందేన‌ని తేల్చి చెప్పారు సీఎం. ఇది విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో మోకాల‌డ్డుతున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.

అయితే.. ఇప్పుడు కొంత వెసులుబాటు క‌ల్పిస్తూ.. ఏపీకి అవ‌స‌ర‌మైతే. స్థ‌లం ఇస్తాం.. మీరు క‌ట్టుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టు తెలిసింది. ఇది ఏపీకి మ‌రింత భారంగా ప‌రిణ‌మించే అంశంగా మారింది. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ద‌శాబ్ద కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్యల ప‌రిష్కారానికి కొత్త‌గా క‌మిటీల‌ను ప్ర‌తిపాదించ‌డం మాత్ర‌మే ఈ స‌మావేశంలో జ‌రిగిన మేలైన నిర్ణ‌యంగా చెప్పుకొవ‌చ్చు. ఒక‌టి మంత్రుల‌తో కూడిన క‌మిటీ అయితే..రెండోది.. అధికారుల‌తో కూడిన క‌మిటీ. విబ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌పై నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు.. అధికారుల క‌మిటీ చ‌ర్య‌లు సూచిస్తుంది.

ఇక‌, విభ‌జ‌న చ‌ట్టంలో లేని.. తిరుమ‌ల‌, ఓడ‌రేవులు, తీర‌ప్రాంతం వంటి అంశాల‌పై మంత్రుల క‌మిటీ సూచ‌న‌లు చేస్తుంది. వీటిని ఆ ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే.. ఇరు రాష్ట్రాలుకూడా.. చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్క‌రించుకునేందుకు మొగ్గు చూపాయి. ఇదేస‌మ‌యంలో కొన్ని అంశాల‌పై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. వాటిపై చ‌ర్చ‌కు వ‌చ్చినా.. తీర్పుల‌ను బ‌ట్టి.. నిర్ణ‌యం తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఇత‌మిత్థంగా తేల్చింది.. ఏమీ లేక‌పోయినా.. ఒక సుహృద్భావ వాతావర‌ణం అయితే.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డ‌డం ఒక్క‌టే ఆశాజ‌న‌కంగా మారింది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

కర్ణుడిగా సూర్య.. అప్డేట్ వచ్చింది

ఇటీవలే ‘కల్కి’ సినిమాలో కాసేపు ప్రభాస్ కర్ణుడిగా కనిపిస్తే.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. మహాభారతంలో ఎన్నో…

3 hours ago

ప‌వ‌న్ విమ‌ర్శ‌ల‌కు డీఎంకే కౌంట‌ర్

తిరుమ‌ల ల‌డ్డు వివాదం త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిందువులు ఆచ‌రించే స‌నాత‌న ధ‌ర్మం గురించి చాలా బ‌లంగా గ‌ళాన్ని వినిపిస్తున్న…

6 hours ago

లోకేష్ కనకరాజ్‌కు కోపమొచ్చింది

తమిళంలో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకడు.. లోకేష్ కనకరాజ్. మామూలుగా అతను చాలా కూల్‌గా కనిపిస్తాడు. అలాంటి దర్శకుడికి ఇప్పుడు…

6 hours ago

శివ ప్రభంజనానికి 35 వసంతాలు

1989 సంవత్సరం. అక్టోబర్ 5వ తేదీ. బ్రేక్ డాన్సులు, ఫైట్లు, భారీ సెట్ల హంగులు ఆర్భాటాలు, అవుట్ డోర్ లొకేషన్ల…

6 hours ago

తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే వినిపించాలి

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ…

7 hours ago

జ‌గ‌న్ త‌న బాధ‌ను ప్ర‌పంచం బాధ చేస్తున్నారే!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా ట్వీట్ చేశారు. దీనిలో 10 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను పోస్టు చేశా…

7 hours ago