Political News

ఈ పేచీ.. తీర‌నిది.. క‌మిటీల‌తో స‌రి!

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న ఆస్తుల వివాదం ఇప్ప‌ట్లో ప‌రిష్కారం అయ్యేలా క‌నిపించ‌డం లేదు. తాజాగా జ‌రిగిన ముఖ్య‌మంత్రుల స‌మావేశంపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇటు వైపు ఏపీ నుంచి చంద్ర‌బాబు, అటువైపు తెలంగాణ నుంచి రేవంత్‌రెడ్డిలు.. కీల‌క రోల్ పోషిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల ప్ర‌జ‌లు కూడా చాలా చాలా ఆస‌క్తిగా ఈ మీటింగ్‌ను పరిశీలించారు. రెండు గంట‌ల పాటు జ‌రిగిన ఈ స‌మావేశంలో కీల‌క‌మైన 10 అంశాల‌ను అజెండాగా చేసుకున్నారు. అయితే.. దేనిపైనా క్లారిటీ రాక‌పోవ‌డం.. ప‌ట్టు-బిగింపులు విడ‌వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ఆది నుంచి నెల‌కొన్న రాజ‌కీయ ప్ర‌భావం.. ఇప్పుడు కూడా కొన‌సాగింది. తెలంగాణలో నెల‌కొన్న విభ‌జ‌న స్థిరాస్తుల‌ను ఇచ్చేది లేద‌ని.. గ‌తంలో కేసీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడే చెప్పారు. ఇప్పుడు దీనిని రేవంత్‌రెడ్డి కొన‌సాగించారు. వాస్త‌వానికి ఆర్టీసీ భ‌వ‌న్ స‌హా.. లేక్ వ్యూ అతిథి గృహం కీల‌కంగా మారాయి. వీటిని త‌మ‌కు పంచాల‌న్నది.. ఏపీ డిమాండ్. కానీ, దీనికి గ‌త స‌ర్కారు ఒప్పుకోన‌ట్టే ఇప్పుడు రేవంత్ ప్ర‌భుత్వం కూడా స‌సేమ‌రా అంది. స్థిర ఆస్తులు ఏవున్నా కూడా.. తెలంగాణ‌కు ద‌ఖ‌లు ప‌డాల్సిందేన‌ని తేల్చి చెప్పారు సీఎం. ఇది విభ‌జ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో మోకాల‌డ్డుతున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌.

అయితే.. ఇప్పుడు కొంత వెసులుబాటు క‌ల్పిస్తూ.. ఏపీకి అవ‌స‌ర‌మైతే. స్థ‌లం ఇస్తాం.. మీరు క‌ట్టుకోండి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్టు తెలిసింది. ఇది ఏపీకి మ‌రింత భారంగా ప‌రిణ‌మించే అంశంగా మారింది. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ద‌శాబ్ద కాలంగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్యల ప‌రిష్కారానికి కొత్త‌గా క‌మిటీల‌ను ప్ర‌తిపాదించ‌డం మాత్ర‌మే ఈ స‌మావేశంలో జ‌రిగిన మేలైన నిర్ణ‌యంగా చెప్పుకొవ‌చ్చు. ఒక‌టి మంత్రుల‌తో కూడిన క‌మిటీ అయితే..రెండోది.. అధికారుల‌తో కూడిన క‌మిటీ. విబ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌పై నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు.. అధికారుల క‌మిటీ చ‌ర్య‌లు సూచిస్తుంది.

ఇక‌, విభ‌జ‌న చ‌ట్టంలో లేని.. తిరుమ‌ల‌, ఓడ‌రేవులు, తీర‌ప్రాంతం వంటి అంశాల‌పై మంత్రుల క‌మిటీ సూచ‌న‌లు చేస్తుంది. వీటిని ఆ ప్రాతిప‌దిక‌న ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. అయితే.. ఇరు రాష్ట్రాలుకూడా.. చ‌ర్చ‌ల ద్వారానే ప‌రిష్క‌రించుకునేందుకు మొగ్గు చూపాయి. ఇదేస‌మ‌యంలో కొన్ని అంశాల‌పై కోర్టుల్లో కేసులు ఉన్నాయి. వాటిపై చ‌ర్చ‌కు వ‌చ్చినా.. తీర్పుల‌ను బ‌ట్టి.. నిర్ణ‌యం తీసుకునేందుకు మొగ్గు చూపారు. ఇత‌మిత్థంగా తేల్చింది.. ఏమీ లేక‌పోయినా.. ఒక సుహృద్భావ వాతావర‌ణం అయితే.. ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఏర్ప‌డ‌డం ఒక్క‌టే ఆశాజ‌న‌కంగా మారింది.

Share
Show comments
Published by
Satya

Recent Posts

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

46 minutes ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

1 hour ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

2 hours ago

బండి భగీరథ్ కేసు ఫిర్యాదురాలి వయసుపై ట్విస్ట్

కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…

2 hours ago

నిర్మాతల మధ్య ముదురుతున్న వివాదం

తెలంగాణ‌లో సింగిల్ స్క్రీన్ల‌ను న‌డిపించే ఎగ్జిబిట‌ర్ల‌కు, నిర్మాత‌ల‌కు మధ్య పీట‌ముడి గ‌ట్టిగానే బిగుసుకునేలా క‌నిపిస్తోంది. అద్దె విధానం ప‌క్క‌న పెట్టి…

2 hours ago

విచారణకు భగీరథ్ డుమ్మా

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…

6 hours ago