Political News

ప‌వ‌న్ చెప్పిన పెద్ద త‌ల‌కాయ‌లు ఎవ‌రు? !

ఏపీ డిప్యూటీ సీఎం, అట‌వీ శాఖ మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్.. తాజాగా అట‌వీ సంప‌ద‌పై స‌మీక్షించారు. ఈ స‌మీక్ష‌కు అట‌వీ శాఖ ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా కీల‌క‌మైన ఎర్ర చంద‌నం అక్ర‌మ రవాణా పై ప‌వ‌న్ ఆరా తీశారు.

ఎర్ర చంద‌నం దొంగిలించ‌డం.. దుంగ‌ల‌ను దాచ‌డం.. ర‌వాణా.. ఏయే దేశాల‌కు అమ్ముతున్నారు? వంటి అనేక ప్ర‌శ్న‌లు సంధించారు. వాటి వివ‌రాలు కూడా తెలుసుకున్నారు. మాజీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లో 158 దుంగ‌లు దొరికాయ‌ని.. వీటి విలువ 1.6 కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌నిఅధికారులు వెల్ల‌డించారు. దీనికి సంబంధించి కొంద‌రు బాధ్యుల‌ను కూడా అరెస్టు చేశామ‌న్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “చిన్న‌వాళ్లు.. కూలీలు, లారీ డ్రైవ‌ర్లు.. క్లీన‌ర్లు ప‌ట్టుకున్న‌ట్టు చెబుతు న్నారు. కానీ, ఇది కాదు మ‌న‌కు కావాల్సింది. అస‌లు వీటిని త‌ర‌లిస్తున్న పెద్ద త‌ల‌కాయ‌లు కావాలి. ముందు వాళ్ల‌ను ప‌ట్టుకోం డి. వాళ్ల‌ను క‌ట్ట‌డి చేస్తే.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం తేలిక అవుతుంది” అని వెల్ల‌డించారు.

దీంతో అధికారులు త‌మ‌కు కొంత స‌మ‌యం కావాల‌ని కోరారు. అదేస‌మ‌యంలో చైనా, నేపాల్ త‌దిత‌ర దేశాల‌కు త‌ర‌లిపోయిన‌.. దుంగ‌ల‌పైనా నిఘా పెట్టాల‌ని.. అవ‌స‌ర‌మైతే.. వాటిని వెన‌క్కి తెచ్చే మార్గాల‌ను కూడా అన్వేషించాల‌ని ప‌వ‌న్ కోరారు.

ఎవ‌రీ పెద్ద త‌ల‌కాయ‌లు?

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. పెద్ద త‌ల‌కాయ‌ల‌ను ప‌ట్టుకోవాల‌ని సూచించ‌డంతో అధికారుల మ‌ధ్య చ‌ర్చ‌ప్రారంభ‌మైంది. ఎవ‌రీ పెద్ద‌త‌ల‌కాయ‌లు అనేది వారికి తెలుసున‌నేది ప్ర‌భుత్వ వ‌ర్గాల మాట‌. కొన్ని ద‌శాబ్దాలుగా.. చిత్తూరు జిల్లాకు చెందిన కొంద‌రు రాజ‌కీయ నేత‌లు.. ఈ అక్ర‌మ ర‌వాణాలో పాతుకు పోయారు.

వీరిలో వైసీపీకి చెందిన బ‌ల‌మైన నాయ‌కులు కూడా ఉన్నార‌ని.. గ‌తంలో ప‌వ‌నే ఆరోపించారు. ఈ విష‌యాన్ని టీడీపీ నాయ‌కులు కూడా గ‌తంలో వెల్ల‌డించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వంటి కీల‌క నాయ‌కులు ఈ త‌తంగంలో కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని అప్ప‌ట్లో టీడీపీ నాయ‌కులు బాహాటంగానే విమ‌ర్శించారు.

అయిన‌ప్ప‌టికీ.. ఎవ‌రిపైనా గ‌తంలో చ‌ర్య‌లు కానీ.. విచార‌ణ కానీ జ‌ర‌గ‌లేదు. వీరితోపాటు.. బెంగ‌ళూరుకు చెందిన మ‌రొకొంద‌రు నాయ‌కులు కూడా ఉన్నార‌నే సందేహాలు ఉన్నాయి. స్మ‌గ్లింగుకు సంబందించి అంత‌ర్జాతీయ ముఠాతో వీరికి సంబంధాలు ఉన్నాయ‌ని త‌ర‌చుగా వార్త‌లు కూడా వ‌స్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ పెద్ద‌త‌ల‌కాయ‌ల ప్ర‌స్తావ‌న‌ను తీసుకువ‌చ్చార‌ని అంటున్నారు. మ‌రి ఈ విష‌యంలో అధికారులు ఏం చేస్తారో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అధికారుల‌కు తెలియ‌ద‌ని కాదు.. తెలిసినా.. రాజకీయ ప్ర‌యోజ‌నాలు వారిని క‌ట్ట‌డి చేశాయి. ఇప్పుడు ఆ క‌ట్ట‌డి నుంచి ఏమేర‌కు బ‌య‌ట ప‌డ‌తారో చూడాలి.

Satya

Recent Posts

వంద కోట్ల విలువైన ‘బంగారం’

సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…

45 minutes ago

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

3 hours ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

4 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

5 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

7 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

8 hours ago