ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు మరింత విశ్వాస పాత్రుడు అయ్యారా? ఏపీ సీఎంపై మోడీకి మరింత వాత్సల్యం పెరిగిందా? అంటే.. జాతీయ మీడియా కథనాలు ఔననే చెబుతున్నాయి. దీనికి కారణం.. మోడీ దగ్గర చంద్రబాబు వ్యవహరించిన తీరేనని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్న జేడీయూ, ఎల్జీపీ వంటివి.. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ.. పట్టుబడుతు న్నాయి. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనిని చర్చించాలని కూడా.. నితీష్ కోరుతున్నారు.
ఈ విషయంలో మోడీకిసంకట స్థితి ఏర్పడింది. ఇప్పటికే బిహార్ అసెంబ్లీలో దీనికి సంబంధించిన తీర్మా నం ఆమోదించేయడంతోపాటు.. కూటమి పార్టీలు.. ఒత్తిడి పెంచే దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఈ పరిణా మం సహజంగానే మోడీకి ఇబ్బందిగా మారింది. అటు ఔననే పరిస్థితి లేదు. ఇటు కాదనే అవకాశం లేదు. సంకీర్ణ సర్కారు ఏర్పడడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సంకట స్థితిలో చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా ప్రస్తావన లేకుండానే మోడీతో భేటీని ముగించారు.
నిజానికి ఏపీకి కూడా.. ప్రత్యేక హోదా డిమాండ్ ఉంది. 2014 నుంచి ఏపీ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. గతంలో ఇదే విషయంపై మోడీతో చంద్రబాబు రగడకు దిగారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చా రు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా ఆయన అడగాలని అనుకుంటే.. హోదా పై మోడీ దగ్గర ప్రతిపాదన పెట్టుకోవచ్చు. అంతేకాదు.. బిహార్ సీఎం నితీష్ కుమార్ చేసినట్టు తాను కూడా అసెంబ్లీలో తీర్మానం చేసుకుని.. మోడీపై ఒత్తడి తెచ్చినా.. గతంలో మాదిరిగా మోడీ వ్యతిరేకించే పరిస్థితి.. కయ్యానికి కాలుదువ్వే పరిస్థితి ఉండదు.
అయినా.. చంద్రబాబు చాలా దూరదృష్టితో ఆలోచన చేశారు. ఇప్పటికిప్పుడు హోదా గురించి ప్రస్తావించి .. కేంద్రం ముందు గొంతెమ్మ కోరికల జాబితా పెట్టడం కంటే.. ముందుగా.. రావాల్సిన పోలవరం నిధులు, రాజధాని నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు వంటివాటిని రాబట్టుకుని.. తర్వాత.. నెమ్మదిగా.. బిహార్కు ఇచ్చినప్పుడు ఏపీ విషయాన్ని కూడా కదిపి అప్పుడు ఉభయ కుశలోపరిగా లబ్ధి పొందాలన్న వ్యూహంతో చంద్రబాబు ఆలోచన చేసి ఉంటారని జాతీయ మీడియా చెబుతోంది. ఇది వ్యూహాత్మకమే తప్ప.. హోదాను బాబు వదులుకోలేదన్నది జాతీయ మీడియా మాట.
This post was last modified on July 6, 2024 1:14 pm
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…
వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి కొత్తగా రాజకీయ పార్టీని పెడతానని కొన్నాళ్ల కిందటే ప్రకటించారు.…
సంక్రాంతికి వస్తున్నాం ఇండస్ట్రీ హిట్ కొట్టాక ఏడాదిన్నరగా వెంకటేష్ ని సోలో హీరోగా దర్శనం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్న…