Political News

ఎయిమ్స్ లో చేరిన బీజేపీ నేత అద్వానీ

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యల కారణంగా అద్వానీని ఎయిమ్స్‌లో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. 

అద్వానీ వయసు 96 సంవత్సరాలు. అద్వానీకి ఈ ఏడాది  భారతరత్న అవార్డు లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఇది తనకే కాదు, తన ఆదర్శాలు, సిద్ధాంతాలకు కూడా దక్కిన గౌరవమని అద్వానీ అన్నారు. ఆయన ఆరోగ్య రీత్యా రాష్ట్రపతి, ప్రధాని ఆయన ఇంటికి వెళ్లి అవార్డును అందజేశారు.

కరాచీలో జన్మించిన అద్వానీ దేశ విభజన సమయంలో భారతదేశానికి వచ్చి ముంబయిలో స్థిరపడ్డారు. 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన 1980లో వాజ్ పాయ్ తో కలిసి భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఒకసారి రాజ్యసభ, ఏడు సార్లు లోక్ సభ సభ్యుడయిన ఆయన భారత ఉప ప్రధానిగా పనిచేశారు. 1990లో ఆయన నిర్వహించిన రామజన్మభూమి రథయాత్ర బీజేపీ ఎదుగుదలకు కాలక్రమంలో దోహదం చేసింది. 

This post was last modified on June 27, 2024 11:20 am

Share
Show comments
Published by
Satya
Tags: Advani

Recent Posts

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

21 minutes ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

40 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

4 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

4 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

5 hours ago