Political News

ఎయిమ్స్ లో చేరిన బీజేపీ నేత అద్వానీ

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, భారతరత్న లాల్ కృష్ణ అద్వానీ బుధవారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. వృద్ధాప్య సమస్యల కారణంగా అద్వానీని ఎయిమ్స్‌లో చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్‌లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రస్తుతం అద్వానీ ఆరోగ్యం బాగానే ఉందని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు. 

అద్వానీ వయసు 96 సంవత్సరాలు. అద్వానీకి ఈ ఏడాది  భారతరత్న అవార్డు లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపిన ఆయన, ఇది తనకే కాదు, తన ఆదర్శాలు, సిద్ధాంతాలకు కూడా దక్కిన గౌరవమని అద్వానీ అన్నారు. ఆయన ఆరోగ్య రీత్యా రాష్ట్రపతి, ప్రధాని ఆయన ఇంటికి వెళ్లి అవార్డును అందజేశారు.

కరాచీలో జన్మించిన అద్వానీ దేశ విభజన సమయంలో భారతదేశానికి వచ్చి ముంబయిలో స్థిరపడ్డారు. 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్ లో చేరిన ఆయన 1980లో వాజ్ పాయ్ తో కలిసి భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకులలో ఒకరు. ఒకసారి రాజ్యసభ, ఏడు సార్లు లోక్ సభ సభ్యుడయిన ఆయన భారత ఉప ప్రధానిగా పనిచేశారు. 1990లో ఆయన నిర్వహించిన రామజన్మభూమి రథయాత్ర బీజేపీ ఎదుగుదలకు కాలక్రమంలో దోహదం చేసింది. 

This post was last modified on June 27, 2024 11:20 am

Share
Show comments
Published by
Satya
Tags: Advani

Recent Posts

ఇండి’గోల’పై కేటీఆర్ ‘పెత్తనం’ కామెంట్స్

బీఆర్ ఎస్ కార్యనిర్వాహ‌క అధ్య‌క్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అధికారం ఒక‌రిద్ద‌రి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…

1 hour ago

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

4 hours ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

5 hours ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

8 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

8 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

9 hours ago