Political News

రాజ‌ధాని రైతుల క‌ష్టాలు తీరేనా..!

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి స్థిర‌ప‌డింది. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది కాబ‌ట్టి.. అమ‌రావ‌తికి ఢోకాలేదు. ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతాయి. కానీ, ఇప్పుడు అస‌లు స‌మ‌స్య రైతుల‌తోనే ఉంది. వారికి దాదాపు ఏడాది కాలంగా నిధులు ఇవ్వ‌డం నిలిచిపోయింది. నిబంధ‌న‌ల మేర‌కు వారికి నెల నెలా పింఛ‌న్లు ఇవ్వాలి. ఇవి ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో ఏటా ఒక‌సారి కౌలు చెల్లించాలి. ఈ విష‌యంలోనే వైసీపీ స‌ర్కారు రైతుల‌ను ప‌క్కన పెట్టింది.

వారు అనేక ప‌ర్యాయాలు కోర్టుల‌కు వెళ్లి.. కౌలు సొమ్ములు తెచ్చుకున్నారు.కానీ, ఏడాదిన్న‌ర‌గా వారికి నిధు లు ఆగిపోయాయి. దీంతో అప్ప‌ట్లోనే హైకోర్టులో కేసులు వేశారు. ప్ర‌స్తుతం అవ‌న్నీ విచార‌ణ ద‌శ‌లోనే ఉన్నాయి. దీంతో నిధులు ఇవ్వ‌డంలో వైసీపీప్ర‌భుత్వం త‌ప్పించుకుంది. ఇప్పుడు ఈ సొమ్ములు సుమా రు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నాయ‌ని తెలుస్తోంది. 33 వేల ఎక‌రాల పొలాల‌కు సంబంధించి కొంద‌రు మెట్ట భూములు ఇస్తే.. మ‌రికొంద‌రు మాగాణి భూములు ఇచ్చారు.

వీటికి ఆయా భూములను బ‌ట్టి.. కౌలు చెల్లించాలి. కొంద‌రికి ఇది ఏడాదికి 30 వేల రూపాయ‌లు ఉండ‌గా.. మ‌రికొంద‌రికి ఎక‌రానికి రూ.50 వేలు, ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు కూడా ఉంది. మూడు పంట‌లు పండే భూముల‌కు రూ.2 ల‌క్షల వ‌ర‌కు కౌలు ప్ర‌భుత్వ‌మే ఇవ్వాలి. ఈ సొమ్ములను ఏడాదిన్న‌ర‌గా వైసీపీ ప్ర‌భుత్వం నిలిపి వేసింది. దీంతో రైతులు అప్ప‌ట్లోనే న్యాయ పోరాటం చేశారు. స‌రే.. ప్ర‌భుత్వం మారిపోయింది. ఇప్పుడు.. చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంపై స‌ర్కారును ఒత్తిడి చేయ‌లేక‌.. అలాగ‌ని.. మౌనంగా ఉండ‌లేక‌.. రైతులు ఇబ్బందులు ప‌డు తున్నారు. చంద్ర‌బాబు కు అర్జీలు స‌మ‌ర్పించేందుకు రైతులు రెడీ అవుతున్నారు. అయితే..ఎలానూ రాజ‌ధాని ప‌ట్టాలెక్కుతున్న నేప‌థ్యంలో ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని స‌ర్కారు చెబుతోంది. దీంతో రైతులు కొంత మేర‌కు ఆశ‌గానే ఎదురు చూస్తున్నా.. నిధుల విష‌యంలో ఏదో ఒకటి తేల్చాల‌ని వారు కోరుతున్నారు.

This post was last modified on June 26, 2024 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వేలిముద్రగాళ్లు కూడా సీఎం అవుతారు’

మాజీ మంత్రి కొండా సురేఖ కొన్ని సందర్భాల్లో తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్…

1 hour ago

ముక్కుసూటిగా పోతే.. రఘురామకే ఇబ్బంది.. !

రాజకీయాల్లో ముక్కుసూటితనం పనికిరాదు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టవలసిందే. ఈ విషయం ప్రస్తుతం ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజుకు…

1 hour ago

బలవంత్ మీద ఫోకస్ పెరుగుతోంది

ఇది సోషల్ మీడియా కాలం. చిన్న సినిమాలకు మార్కెటింగ్ ప్రాణ సంకటంగా మారిపోయింది. చేస్తే ఒక బాధ చేయకపోతే ఒక…

2 hours ago

శవమై తేలిన మనపల్లి అత్యాచార నిందితుడు

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన మదనపల్లి ఏడేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా…

3 hours ago

రామ్ ఫలితమే సంతోష్ శోభన్ చూస్తాడా

గత ఏడాది సెప్టెంబర్ లో ఆంధ్రకింగ్ తాలూకా రిలీజైనప్పుడు పాజిటివ్ రివ్యూలు వెల్లువెత్తాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది.…

8 hours ago

‘ఫంకీ’తో లాభపడ్డ ఒకే వ్యక్తి

వేలంటైన్ప్ డే వీకెండ్లో మంచి అంచనాల మధ్య విడుదలైన చిత్రం.. ఫంకీ. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విశ్వక్సేన్‌ను హీరీగా…

8 hours ago