Political News

రాజ‌ధాని రైతుల క‌ష్టాలు తీరేనా..!

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి స్థిర‌ప‌డింది. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది కాబ‌ట్టి.. అమ‌రావ‌తికి ఢోకాలేదు. ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతాయి. కానీ, ఇప్పుడు అస‌లు స‌మ‌స్య రైతుల‌తోనే ఉంది. వారికి దాదాపు ఏడాది కాలంగా నిధులు ఇవ్వ‌డం నిలిచిపోయింది. నిబంధ‌న‌ల మేర‌కు వారికి నెల నెలా పింఛ‌న్లు ఇవ్వాలి. ఇవి ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో ఏటా ఒక‌సారి కౌలు చెల్లించాలి. ఈ విష‌యంలోనే వైసీపీ స‌ర్కారు రైతుల‌ను ప‌క్కన పెట్టింది.

వారు అనేక ప‌ర్యాయాలు కోర్టుల‌కు వెళ్లి.. కౌలు సొమ్ములు తెచ్చుకున్నారు.కానీ, ఏడాదిన్న‌ర‌గా వారికి నిధు లు ఆగిపోయాయి. దీంతో అప్ప‌ట్లోనే హైకోర్టులో కేసులు వేశారు. ప్ర‌స్తుతం అవ‌న్నీ విచార‌ణ ద‌శ‌లోనే ఉన్నాయి. దీంతో నిధులు ఇవ్వ‌డంలో వైసీపీప్ర‌భుత్వం త‌ప్పించుకుంది. ఇప్పుడు ఈ సొమ్ములు సుమా రు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నాయ‌ని తెలుస్తోంది. 33 వేల ఎక‌రాల పొలాల‌కు సంబంధించి కొంద‌రు మెట్ట భూములు ఇస్తే.. మ‌రికొంద‌రు మాగాణి భూములు ఇచ్చారు.

వీటికి ఆయా భూములను బ‌ట్టి.. కౌలు చెల్లించాలి. కొంద‌రికి ఇది ఏడాదికి 30 వేల రూపాయ‌లు ఉండ‌గా.. మ‌రికొంద‌రికి ఎక‌రానికి రూ.50 వేలు, ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు కూడా ఉంది. మూడు పంట‌లు పండే భూముల‌కు రూ.2 ల‌క్షల వ‌ర‌కు కౌలు ప్ర‌భుత్వ‌మే ఇవ్వాలి. ఈ సొమ్ములను ఏడాదిన్న‌ర‌గా వైసీపీ ప్ర‌భుత్వం నిలిపి వేసింది. దీంతో రైతులు అప్ప‌ట్లోనే న్యాయ పోరాటం చేశారు. స‌రే.. ప్ర‌భుత్వం మారిపోయింది. ఇప్పుడు.. చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంపై స‌ర్కారును ఒత్తిడి చేయ‌లేక‌.. అలాగ‌ని.. మౌనంగా ఉండ‌లేక‌.. రైతులు ఇబ్బందులు ప‌డు తున్నారు. చంద్ర‌బాబు కు అర్జీలు స‌మ‌ర్పించేందుకు రైతులు రెడీ అవుతున్నారు. అయితే..ఎలానూ రాజ‌ధాని ప‌ట్టాలెక్కుతున్న నేప‌థ్యంలో ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని స‌ర్కారు చెబుతోంది. దీంతో రైతులు కొంత మేర‌కు ఆశ‌గానే ఎదురు చూస్తున్నా.. నిధుల విష‌యంలో ఏదో ఒకటి తేల్చాల‌ని వారు కోరుతున్నారు.

This post was last modified on June 26, 2024 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క‌విత న‌న్ను ప‌దికోట్లు అడిగారు: పాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్ర‌జాశాంతి పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ సువార్తీకుడు కేఏ పాల్‌.. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ…

27 minutes ago

మ‌మ‌త ప‌రిస్థితి.. ఏపీకి పాఠం అవుతుందా?!

త‌మ్ముడు త‌మ్ముడే.. రాజ‌కీయం రాజ‌కీయ‌మే.. బీజేపీ విష‌యంలో ఇది అక్ష‌రాలా నిజం. త‌న‌కు అవ‌కాశం లేనంత సేపూ.. ఆ పార్టీ…

3 hours ago

‘అడ్డంకులెన్నైనా.. ఆకివీడు రామాలయ నిర్మాణం ఆగదు’

ఏపీలో మతపరమైన వివాదాలకు కేంద్రంగా మారిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఆదివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.…

4 hours ago

కెపాసిటీ లేకే ర‌జినీ సినిమా వ‌దిలేశా

సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ నిర్మించే సినిమా ద‌ర్శ‌కుడి ఎంపిక విష‌యంలో ఎంత త‌ల‌నొప్పి ఎదురైందో…

5 hours ago

తొలిసారి బాల‌య్య‌తో అనిరుధ్‌?

టాలీవుడ్లో ఇప్ప‌టికే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర క‌థానాయ‌కుల‌తో పాటు నాని, విజ‌య్…

6 hours ago

పవన్ వచ్చాక పిఠాపురంలో ఏం చేశారు?

ఉమ్మ‌డి తూర్పు గోదావ‌రి జిల్లాలోని పిఠాపురం నియోజ‌కవ‌ర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ 2024…

6 hours ago