Political News

రాజ‌ధాని రైతుల క‌ష్టాలు తీరేనా..!

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి స్థిర‌ప‌డింది. చంద్ర‌బాబు కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చింది కాబ‌ట్టి.. అమ‌రావ‌తికి ఢోకాలేదు. ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతాయి. కానీ, ఇప్పుడు అస‌లు స‌మ‌స్య రైతుల‌తోనే ఉంది. వారికి దాదాపు ఏడాది కాలంగా నిధులు ఇవ్వ‌డం నిలిచిపోయింది. నిబంధ‌న‌ల మేర‌కు వారికి నెల నెలా పింఛ‌న్లు ఇవ్వాలి. ఇవి ఇస్తున్నారు. అదేస‌మ‌యంలో ఏటా ఒక‌సారి కౌలు చెల్లించాలి. ఈ విష‌యంలోనే వైసీపీ స‌ర్కారు రైతుల‌ను ప‌క్కన పెట్టింది.

వారు అనేక ప‌ర్యాయాలు కోర్టుల‌కు వెళ్లి.. కౌలు సొమ్ములు తెచ్చుకున్నారు.కానీ, ఏడాదిన్న‌ర‌గా వారికి నిధు లు ఆగిపోయాయి. దీంతో అప్ప‌ట్లోనే హైకోర్టులో కేసులు వేశారు. ప్ర‌స్తుతం అవ‌న్నీ విచార‌ణ ద‌శ‌లోనే ఉన్నాయి. దీంతో నిధులు ఇవ్వ‌డంలో వైసీపీప్ర‌భుత్వం త‌ప్పించుకుంది. ఇప్పుడు ఈ సొమ్ములు సుమా రు 50 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉన్నాయ‌ని తెలుస్తోంది. 33 వేల ఎక‌రాల పొలాల‌కు సంబంధించి కొంద‌రు మెట్ట భూములు ఇస్తే.. మ‌రికొంద‌రు మాగాణి భూములు ఇచ్చారు.

వీటికి ఆయా భూములను బ‌ట్టి.. కౌలు చెల్లించాలి. కొంద‌రికి ఇది ఏడాదికి 30 వేల రూపాయ‌లు ఉండ‌గా.. మ‌రికొంద‌రికి ఎక‌రానికి రూ.50 వేలు, ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు కూడా ఉంది. మూడు పంట‌లు పండే భూముల‌కు రూ.2 ల‌క్షల వ‌ర‌కు కౌలు ప్ర‌భుత్వ‌మే ఇవ్వాలి. ఈ సొమ్ములను ఏడాదిన్న‌ర‌గా వైసీపీ ప్ర‌భుత్వం నిలిపి వేసింది. దీంతో రైతులు అప్ప‌ట్లోనే న్యాయ పోరాటం చేశారు. స‌రే.. ప్ర‌భుత్వం మారిపోయింది. ఇప్పుడు.. చంద్ర‌బాబు ఏం చేస్తార‌నేది ప్ర‌శ్న‌.

ఈ విష‌యంపై స‌ర్కారును ఒత్తిడి చేయ‌లేక‌.. అలాగ‌ని.. మౌనంగా ఉండ‌లేక‌.. రైతులు ఇబ్బందులు ప‌డు తున్నారు. చంద్ర‌బాబు కు అర్జీలు స‌మ‌ర్పించేందుకు రైతులు రెడీ అవుతున్నారు. అయితే..ఎలానూ రాజ‌ధాని ప‌ట్టాలెక్కుతున్న నేప‌థ్యంలో ఇబ్బందులు త‌ప్పుతాయ‌ని స‌ర్కారు చెబుతోంది. దీంతో రైతులు కొంత మేర‌కు ఆశ‌గానే ఎదురు చూస్తున్నా.. నిధుల విష‌యంలో ఏదో ఒకటి తేల్చాల‌ని వారు కోరుతున్నారు.

This post was last modified on June 26, 2024 10:30 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు…

24 minutes ago

బీఆర్ఎస్‌లో పూర్తి ప్ర‌క్షాళ‌న… కారణమేంటి?

తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…

43 minutes ago

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

4 hours ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

4 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

5 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

5 hours ago