ఏపీ రాజధానిగా అమరావతి స్థిరపడింది. చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి.. అమరావతికి ఢోకాలేదు. పనులు కూడా వేగంగా జరుగుతాయి. కానీ, ఇప్పుడు అసలు సమస్య రైతులతోనే ఉంది. వారికి దాదాపు ఏడాది కాలంగా నిధులు ఇవ్వడం నిలిచిపోయింది. నిబంధనల మేరకు వారికి నెల నెలా పింఛన్లు ఇవ్వాలి. ఇవి ఇస్తున్నారు. అదేసమయంలో ఏటా ఒకసారి కౌలు చెల్లించాలి. ఈ విషయంలోనే వైసీపీ సర్కారు రైతులను పక్కన పెట్టింది.
వారు అనేక పర్యాయాలు కోర్టులకు వెళ్లి.. కౌలు సొమ్ములు తెచ్చుకున్నారు.కానీ, ఏడాదిన్నరగా వారికి నిధు లు ఆగిపోయాయి. దీంతో అప్పట్లోనే హైకోర్టులో కేసులు వేశారు. ప్రస్తుతం అవన్నీ విచారణ దశలోనే ఉన్నాయి. దీంతో నిధులు ఇవ్వడంలో వైసీపీప్రభుత్వం తప్పించుకుంది. ఇప్పుడు ఈ సొమ్ములు సుమా రు 50 లక్షల వరకు ఉన్నాయని తెలుస్తోంది. 33 వేల ఎకరాల పొలాలకు సంబంధించి కొందరు మెట్ట భూములు ఇస్తే.. మరికొందరు మాగాణి భూములు ఇచ్చారు.
వీటికి ఆయా భూములను బట్టి.. కౌలు చెల్లించాలి. కొందరికి ఇది ఏడాదికి 30 వేల రూపాయలు ఉండగా.. మరికొందరికి ఎకరానికి రూ.50 వేలు, లక్షన్నర వరకు కూడా ఉంది. మూడు పంటలు పండే భూములకు రూ.2 లక్షల వరకు కౌలు ప్రభుత్వమే ఇవ్వాలి. ఈ సొమ్ములను ఏడాదిన్నరగా వైసీపీ ప్రభుత్వం నిలిపి వేసింది. దీంతో రైతులు అప్పట్లోనే న్యాయ పోరాటం చేశారు. సరే.. ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు.. చంద్రబాబు ఏం చేస్తారనేది ప్రశ్న.
ఈ విషయంపై సర్కారును ఒత్తిడి చేయలేక.. అలాగని.. మౌనంగా ఉండలేక.. రైతులు ఇబ్బందులు పడు తున్నారు. చంద్రబాబు కు అర్జీలు సమర్పించేందుకు రైతులు రెడీ అవుతున్నారు. అయితే..ఎలానూ రాజధాని పట్టాలెక్కుతున్న నేపథ్యంలో ఇబ్బందులు తప్పుతాయని సర్కారు చెబుతోంది. దీంతో రైతులు కొంత మేరకు ఆశగానే ఎదురు చూస్తున్నా.. నిధుల విషయంలో ఏదో ఒకటి తేల్చాలని వారు కోరుతున్నారు.
This post was last modified on June 26, 2024 10:30 am
ఏపీలో కూటమి ప్రభుత్వం రాకతో మళ్లీ పెట్టుబడులకు జోష్ పెరిగింది. ప్రభుత్వం ఏర్పడిన మూడు మాసాల్లోనే పలు కంపెనీలు పెట్టుబడులు…
వైసీపీ అధినేత, తన సోదరుడు జగన్పై పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. అయితే.. నేరుగా పేరు చెప్పకుం…
మాములుగా టాలీవుడ్ దసరాకు స్టార్ హీరోల సినిమాలు రావడం సహజం. సంక్రాంతి తర్వాత ఎక్కువ సెలవులు వచ్చే సీజన్ కావడంతో…
గేమ్ ఛేంజర్ ప్రమోషన్లు మొదలైన నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ పబ్లిసిటీ పరంగా దిల్ రాజు టీమ్ మీద భారీ ఆశలు…
నార్త్ ఇండియాలో ఎవ్వరూ ఊహించని ఫలితాన్ని అందుకున్న సౌత్ సినిమాల్లో ‘పుష్ప’ ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలు ఉత్తరాదిన…
"నా మతమేంటి అని అడుగుతున్నారు.. మానవత్వమే నా మతం" అంటూ నిన్నటి ప్రెస్ మీట్లో ఎంతో నాటకీయంగా మాట్లాడేశారు మాజీ…