ఇటీవల వెలువడిని సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. శాసన సభ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఇక, లోక్ సభ ఎన్నికల్లో 4 స్థానాలతోనే సరిపెట్టుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అంతేకాదు, బీజేపీలోకి వైసీపీ ఎంపీలను చేర్చేందుకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఆ ప్రచారాన్ని మిథున్ రెడ్డి ఖండించారు.
బీజేపీలో చేరాల్సిన ఖర్మ, అవసరం తనకు లేదని మిథున్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా తాను పార్లమెంటు లో పనిచేస్తానని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ ఆశీస్సులతో, రాజంపేట ప్రజల మద్దతుతో మూడోసారి పార్లమెంటులో అడుగుపెట్టి హ్యాట్రిక్ కొట్టానని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూలంగా ఉండే బిల్లులకు మద్దతిస్తానని, లేని బిల్లులను వ్యతిరేకిస్తానని చెప్పారు. తాను బీజేపీలోకి వెళతానని కూటమి నేతలు మైండ్ గేమ్ ఆడుతూ దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తాను విపక్షంలో ఉన్నపుడు కూడా ఇటువంటి ప్రచారం జరిగిందని మిథున్ రెడ్డి తెలిపారు. తనను జగన్ సొంత తమ్ముడిలా చూసుకున్నారని, భవిష్యత్తులో జగన్ నేతృత్వంలో తమ పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. రాజంపేటలో అత్యధిక రహదారులు నిర్మించిన ఘనత వైసీపీదని, మాట నిలబెట్లుకున్న నేతగా జగన్ ను జనం అభిమానిస్తారని చెప్పారు. చంద్రబాబు మోసాన్ని ప్రజలు త్వరలో గ్రహిస్తారని అన్నారు.
This post was last modified on June 25, 2024 3:19 pm
చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్లో మంచి క్రేజ్తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…
మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…
మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…
జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…