ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కీలకమైన ఉండి నియోజకవర్గంలో ఈ సారి మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజును పక్కన పెట్టి మరీ.. వైసీపీ నుంచి వచ్చి.. ఆ పార్టీపై యుద్ధం చేసిన రఘురామరాజుకు.. చంద్రబాబు టికెట్ ఇచ్చారు.
ఈ ప్రక్రియలో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి రఘురామ గెలిచారు. అయితే.. ఉండి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి ఆయన ఎన్నికల సమయంలో భారీ హామీలు గుప్పించారు.
తాను గెలిస్తే.. ఉండిని అద్భుతంగా తీర్చి దిద్దుతానన్నారు. దీనిని ప్రజలు విశ్వసించి.. ఆయనపై అభిమానం చూపారు. గెలుపు గుర్రం ఎక్కించారు. అయితే.. అభివృద్ది విషయంలో సర్కారు నుంచి సాయం తీసుకుందామంటే.. ఆర్థికంగా సర్కారు ఇబ్బందుల్లో ఉంది.
గత జగన్ సర్కారు మాదిరిగానే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అప్పులు చేయకుండా నడిచేలా లేదు. దీంతో ప్రభుత్వం ముందు ప్రతిపాదన పెట్టినా ప్రయోజనం లేదని ఆర్ . ఆర్ .ఆర్ . గుర్తించారు.
ఈ నేపథ్యంలో తెలివిగా ఆయన హుండీ తెరిచారు. ఇదేమీ.. అవినీతి కోసం కాదు.. అక్రమాల కోసం కాదు. సాయం కోసం. నియోజకవర్గం అభివృద్ధి కోసమే. క్రౌడ్ ఫండింగ్.. అంటే సామూహిక విరాళాల సేకరణకు రఘురామ గల్లా రెడీ చేశారు. ఇది మంచి నిర్ణయమే తప్పేమీ కాదు.
ఏదైనా ఆపదలు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు.. ప్రభుత్వాలు కూడా.. ఇలా సొమ్ములు కలెక్ట్ చేస్తాయి. దీనిలో ఎవరిపైనా బలవంతాలు ఉండవు. ఎవరినీ ఒత్తిడి చేయడం కూడా ఉండదు.
ఇదే విధానాన్ని రఘురామ చేపట్టారు. దేశ, విదేశాల్లో ఉన్న ఉండి నియోజకవర్గం ప్రజలతోపాటు.. స్వచ్ఛంద సంస్థలు.. అభివృద్ధి కాముకుల నుంచి కూడా.. ఆయన విరాళాలు సేకరిస్తున్నారు. తొలుత ఫండింగ్గా తానే రూ.5 లక్షల వరకు సొమ్మును జమ చేశారు.
అనంతరం.. తనకు తెలిసిన పారిశ్రామిక వేత్తలు, ఎంపీలకు కూడా.. సందేశాలు పంపించారు. క్రౌడ్ ఫండింగ్కు సహకరించాలని విన్నవించారు. మొత్తానికి ఈ ప్రయత్నం బాగున్నా.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే స్థాయిలో వస్తాయా? రావా? అన్నది చూడాలి.
This post was last modified on June 25, 2024 12:16 pm
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…
టీమ్ ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఇంటర్నేషనల్ కెరీర్ దాదాపు ముగింపు దశకు చేరుకున్నట్లే కనిపిస్తోంది. గతేడాది జరిగిన…
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…