Political News

ఉండిలో హుండీ తెరిచిన ట్రిపులార్‌.. !

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి మార్పులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామ‌రాజును ప‌క్క‌న పెట్టి మ‌రీ.. వైసీపీ నుంచి వ‌చ్చి.. ఆ పార్టీపై యుద్ధం చేసిన ర‌ఘురామ‌రాజుకు.. చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు.

ఈ ప్ర‌క్రియ‌లో అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి ర‌ఘురామ‌ గెలిచారు. అయితే.. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో భారీ హామీలు గుప్పించారు.

తాను గెలిస్తే.. ఉండిని అద్భుతంగా తీర్చి దిద్దుతాన‌న్నారు. దీనిని ప్ర‌జ‌లు విశ్వ‌సించి.. ఆయ‌న‌పై అభిమానం చూపారు. గెలుపు గుర్రం ఎక్కించారు. అయితే.. అభివృద్ది విష‌యంలో స‌ర్కారు నుంచి సాయం తీసుకుందామంటే.. ఆర్థికంగా స‌ర్కారు ఇబ్బందుల్లో ఉంది.

గ‌త జ‌గ‌న్ స‌ర్కారు మాదిరిగానే ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా అప్పులు చేయ‌కుండా న‌డిచేలా లేదు. దీంతో ప్ర‌భుత్వం ముందు ప్ర‌తిపాద‌న పెట్టినా ప్ర‌యోజ‌నం లేద‌ని ఆర్ . ఆర్ .ఆర్ . గుర్తించారు.

ఈ నేప‌థ్యంలో తెలివిగా ఆయ‌న హుండీ తెరిచారు. ఇదేమీ.. అవినీతి కోసం కాదు.. అక్ర‌మాల కోసం కాదు. సాయం కోసం. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోస‌మే. క్రౌడ్ ఫండింగ్‌.. అంటే సామూహిక విరాళాల సేక‌ర‌ణ‌కు ర‌ఘురామ గ‌ల్లా రెడీ చేశారు. ఇది మంచి నిర్ణ‌య‌మే త‌ప్పేమీ కాదు.

ఏదైనా ఆప‌ద‌లు, ప్ర‌కృతి విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు.. ప్రభుత్వాలు కూడా.. ఇలా సొమ్ములు క‌లెక్ట్ చేస్తాయి. దీనిలో ఎవ‌రిపైనా బ‌ల‌వంతాలు ఉండ‌వు. ఎవ‌రినీ ఒత్తిడి చేయ‌డం కూడా ఉండ‌దు.

ఇదే విధానాన్ని ర‌ఘురామ చేప‌ట్టారు. దేశ‌, విదేశాల్లో ఉన్న ఉండి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తోపాటు.. స్వ‌చ్ఛంద సంస్థ‌లు.. అభివృద్ధి కాముకుల నుంచి కూడా.. ఆయ‌న విరాళాలు సేక‌రిస్తున్నారు. తొలుత ఫండింగ్‌గా తానే రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సొమ్మును జ‌మ చేశారు.

అనంత‌రం.. త‌న‌కు తెలిసిన పారిశ్రామిక వేత్త‌లు, ఎంపీల‌కు కూడా.. సందేశాలు పంపించారు. క్రౌడ్ ఫండింగ్కు స‌హ‌క‌రించాల‌ని విన్న‌వించారు. మొత్తానికి ఈ ప్ర‌య‌త్నం బాగున్నా.. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసే స్థాయిలో వ‌స్తాయా? రావా? అన్న‌ది చూడాలి.

This post was last modified on June 25, 2024 12:16 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

2 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

4 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

4 hours ago