Political News

ఉండిలో హుండీ తెరిచిన ట్రిపులార్‌.. !

ఉమ్మ‌డి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలోని కీల‌క‌మైన ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ఈ సారి మార్పులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామ‌రాజును ప‌క్క‌న పెట్టి మ‌రీ.. వైసీపీ నుంచి వ‌చ్చి.. ఆ పార్టీపై యుద్ధం చేసిన ర‌ఘురామ‌రాజుకు.. చంద్ర‌బాబు టికెట్ ఇచ్చారు.

ఈ ప్ర‌క్రియ‌లో అనేక నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. మొత్తానికి ర‌ఘురామ‌ గెలిచారు. అయితే.. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న ఎన్నిక‌ల స‌మ‌యంలో భారీ హామీలు గుప్పించారు.

తాను గెలిస్తే.. ఉండిని అద్భుతంగా తీర్చి దిద్దుతాన‌న్నారు. దీనిని ప్ర‌జ‌లు విశ్వ‌సించి.. ఆయ‌న‌పై అభిమానం చూపారు. గెలుపు గుర్రం ఎక్కించారు. అయితే.. అభివృద్ది విష‌యంలో స‌ర్కారు నుంచి సాయం తీసుకుందామంటే.. ఆర్థికంగా స‌ర్కారు ఇబ్బందుల్లో ఉంది.

గ‌త జ‌గ‌న్ స‌ర్కారు మాదిరిగానే ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా అప్పులు చేయ‌కుండా న‌డిచేలా లేదు. దీంతో ప్ర‌భుత్వం ముందు ప్ర‌తిపాద‌న పెట్టినా ప్ర‌యోజ‌నం లేద‌ని ఆర్ . ఆర్ .ఆర్ . గుర్తించారు.

ఈ నేప‌థ్యంలో తెలివిగా ఆయ‌న హుండీ తెరిచారు. ఇదేమీ.. అవినీతి కోసం కాదు.. అక్ర‌మాల కోసం కాదు. సాయం కోసం. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోస‌మే. క్రౌడ్ ఫండింగ్‌.. అంటే సామూహిక విరాళాల సేక‌ర‌ణ‌కు ర‌ఘురామ గ‌ల్లా రెడీ చేశారు. ఇది మంచి నిర్ణ‌య‌మే త‌ప్పేమీ కాదు.

ఏదైనా ఆప‌ద‌లు, ప్ర‌కృతి విప‌త్తులు వ‌చ్చిన‌ప్పుడు.. ప్రభుత్వాలు కూడా.. ఇలా సొమ్ములు క‌లెక్ట్ చేస్తాయి. దీనిలో ఎవ‌రిపైనా బ‌ల‌వంతాలు ఉండ‌వు. ఎవ‌రినీ ఒత్తిడి చేయ‌డం కూడా ఉండ‌దు.

ఇదే విధానాన్ని ర‌ఘురామ చేప‌ట్టారు. దేశ‌, విదేశాల్లో ఉన్న ఉండి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌తోపాటు.. స్వ‌చ్ఛంద సంస్థ‌లు.. అభివృద్ధి కాముకుల నుంచి కూడా.. ఆయ‌న విరాళాలు సేక‌రిస్తున్నారు. తొలుత ఫండింగ్‌గా తానే రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు సొమ్మును జ‌మ చేశారు.

అనంత‌రం.. త‌న‌కు తెలిసిన పారిశ్రామిక వేత్త‌లు, ఎంపీల‌కు కూడా.. సందేశాలు పంపించారు. క్రౌడ్ ఫండింగ్కు స‌హ‌క‌రించాల‌ని విన్న‌వించారు. మొత్తానికి ఈ ప్ర‌య‌త్నం బాగున్నా.. నియోజ‌క‌వ‌ర్గాన్ని అభివృద్ధి చేసే స్థాయిలో వ‌స్తాయా? రావా? అన్న‌ది చూడాలి.

This post was last modified on June 25, 2024 12:16 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago