రాజకీయాల్లో ఉన్నవారు.. గెలవొచ్చు.. ఓడొచ్చు. ప్రజా తీర్పు. ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యానికి గీటు రాయి కనుక.. ఎంతటి వారైనా.. దీనికి బద్ధులు కావాల్సిందే. నా మాటనే ఎదిరిస్తారా అంటూ.. దేశాన్ని తన చేతిలోకి తీసుకుని నల్లచట్టాన్ని ప్రయోగించి ఇందిరమ్మ సైతం.. ప్రజాభిప్రాయ తుఫాను కెరటాల్లో కొట్టుకుపోయిన సంగతి .. ఈ దేశం ఒక చరిత్ర.
ఆమె అక్కడితో కుంగిపోలేదు.. రాటు దేలారు.. తప్పులు తెలుసుకున్నారు. ఎమర్జెన్జీ వంటి కీచక చట్టం తన పతనానికి కారణమని తెలుసుకుని లెంపలేసుకుని తర్వాత విజయం దక్కించుకున్నారు.
ఇలాంటి ఉదాహరణలు ఈ దేశంలో కోకొల్లలు. భిన్నమైన వ్యక్తలు.. భిన్నమైన మనస్తత్వాల కలగాపులగం గా ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోనవసరం లేదు. ఎవరికీఅర్థం కూడా కాదు. అదే అర్థమై ఉంటే.. మోడీకి 400 సీట్లు దక్కేవేమో.
అందుకే ప్రాప్తకాలజ్ఞతగా వ్యవహరించాలి. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం అయినా..చేయాలి. ఈ విషయంలోనే వైసీపీ అధినేతగా జగన్ విఫలమయ్యాను. “నేను చేసిం ది మంచి!“ అని ఇప్పటికీ చెప్పుకోవడం వెనుక .. లోపించిన ప్రాప్తకాలజ్ఞత స్పష్టంగా గోచరమవుతోంది.
“ఎవరి కోసం.. అధికారంలోకి వచ్చాం.. ఎవరు ఈ అధికారాన్ని అప్పగించారు? అనే రెండు సూత్రాలే ప్ర భుత్వానికి ప్రామాణికత“ అంటూ.. పార్లమెంటు వేదికగా.. వాజపేయి చేసిన సూచన అక్షర సత్యం. ఆనాడు.. `ఒక్క ఎంపీ` లోటుతో అధికారం కోల్పోయిన క్షణంలో ఆయన చేసి ఈవ్యాఖ్యలే తర్వాత కాలంలో ఆయనను తిరుగులేని మెజారిటీతో అధికారం దక్కించుకునేలా చేశాయి.
`అధికారం ఐదేళ్ల అవధి. జనజీవన సాంగత్యం జీవిత పర్యంతం`- అంటూ.. తొలి పలుకుల్లో పార్లమెంటుకు హితవు పలికిన నెహ్రూ.. జీవితకాలంలో ఏ నాడూ ఓడింది లేదంటే.. ఎంత దూరదృష్టితో ఆయన ప్రజలకు చేరువయ్యారో చూడొచ్చు.
లోపాలు ఉండొచ్చు.. తప్పులు కూడా చేయొచ్చు. పాలకులు కూడా మనుషులే. కానీ, వాటిని తెలుసుకోగ లిగిన నాడే.. నాయకుడు జననేత అవుతాడు. ఈ లోపం జగన్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది.
ఇంకా.. నేను చేసిన చట్టాలు మంచివి.. అణిచివేతలు మంచివి.. మద్యం మంచిది.. పన్నులు మంచివి.. ప్రజలే నన్ను అర్ధం చేసుకోలేకపోయారని ఆయన చెబుతున్న తీరును చూస్తే.. ఇంకా జగన్ బయటకు రాలేదా? లేక ఆయన చుట్టూ ఉన్నవారే.. బయటకు రానివ్వడం లేదా? ఏదేమైనా.. గెలుపు-ఓటమి.. సహజం.. తేడా తెలుసుకోవడమే ముఖ్యం జగన్!!
This post was last modified on June 25, 2024 10:00 am
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…