రాజకీయాల్లో ఉన్నవారు.. గెలవొచ్చు.. ఓడొచ్చు. ప్రజా తీర్పు. ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యానికి గీటు రాయి కనుక.. ఎంతటి వారైనా.. దీనికి బద్ధులు కావాల్సిందే. నా మాటనే ఎదిరిస్తారా అంటూ.. దేశాన్ని తన చేతిలోకి తీసుకుని నల్లచట్టాన్ని ప్రయోగించి ఇందిరమ్మ సైతం.. ప్రజాభిప్రాయ తుఫాను కెరటాల్లో కొట్టుకుపోయిన సంగతి .. ఈ దేశం ఒక చరిత్ర.
ఆమె అక్కడితో కుంగిపోలేదు.. రాటు దేలారు.. తప్పులు తెలుసుకున్నారు. ఎమర్జెన్జీ వంటి కీచక చట్టం తన పతనానికి కారణమని తెలుసుకుని లెంపలేసుకుని తర్వాత విజయం దక్కించుకున్నారు.
ఇలాంటి ఉదాహరణలు ఈ దేశంలో కోకొల్లలు. భిన్నమైన వ్యక్తలు.. భిన్నమైన మనస్తత్వాల కలగాపులగం గా ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోనవసరం లేదు. ఎవరికీఅర్థం కూడా కాదు. అదే అర్థమై ఉంటే.. మోడీకి 400 సీట్లు దక్కేవేమో.
అందుకే ప్రాప్తకాలజ్ఞతగా వ్యవహరించాలి. ప్రజల నాడిని పట్టుకునే ప్రయత్నం అయినా..చేయాలి. ఈ విషయంలోనే వైసీపీ అధినేతగా జగన్ విఫలమయ్యాను. “నేను చేసిం ది మంచి!“ అని ఇప్పటికీ చెప్పుకోవడం వెనుక .. లోపించిన ప్రాప్తకాలజ్ఞత స్పష్టంగా గోచరమవుతోంది.
“ఎవరి కోసం.. అధికారంలోకి వచ్చాం.. ఎవరు ఈ అధికారాన్ని అప్పగించారు? అనే రెండు సూత్రాలే ప్ర భుత్వానికి ప్రామాణికత“ అంటూ.. పార్లమెంటు వేదికగా.. వాజపేయి చేసిన సూచన అక్షర సత్యం. ఆనాడు.. `ఒక్క ఎంపీ` లోటుతో అధికారం కోల్పోయిన క్షణంలో ఆయన చేసి ఈవ్యాఖ్యలే తర్వాత కాలంలో ఆయనను తిరుగులేని మెజారిటీతో అధికారం దక్కించుకునేలా చేశాయి.
`అధికారం ఐదేళ్ల అవధి. జనజీవన సాంగత్యం జీవిత పర్యంతం`- అంటూ.. తొలి పలుకుల్లో పార్లమెంటుకు హితవు పలికిన నెహ్రూ.. జీవితకాలంలో ఏ నాడూ ఓడింది లేదంటే.. ఎంత దూరదృష్టితో ఆయన ప్రజలకు చేరువయ్యారో చూడొచ్చు.
లోపాలు ఉండొచ్చు.. తప్పులు కూడా చేయొచ్చు. పాలకులు కూడా మనుషులే. కానీ, వాటిని తెలుసుకోగ లిగిన నాడే.. నాయకుడు జననేత అవుతాడు. ఈ లోపం జగన్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది.
ఇంకా.. నేను చేసిన చట్టాలు మంచివి.. అణిచివేతలు మంచివి.. మద్యం మంచిది.. పన్నులు మంచివి.. ప్రజలే నన్ను అర్ధం చేసుకోలేకపోయారని ఆయన చెబుతున్న తీరును చూస్తే.. ఇంకా జగన్ బయటకు రాలేదా? లేక ఆయన చుట్టూ ఉన్నవారే.. బయటకు రానివ్వడం లేదా? ఏదేమైనా.. గెలుపు-ఓటమి.. సహజం.. తేడా తెలుసుకోవడమే ముఖ్యం జగన్!!
This post was last modified on June 25, 2024 10:00 am
అదేంటి రాజకీయాల్లో గెలిచిన తర్వాత విజయ్ ఇక సినిమాల్లో నటించడు కదా, మరి నిర్మాతలకు పండగ ఏమిటనుకుంటున్నారా. తమిళనాడు ముఖ్యమంత్రిగా…
కొత్త ఏడాదిలో అయిదో నెల వచ్చేసింది. సంక్రాంతి తర్వాత మళ్ళీ సరైన ఊపు కోసం ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ కు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐడీఎంకేలకు టీవీకే పెద్ద షాకిచ్చిన సంగతి తెలిసిందే.…
తమిళనాడు ఎన్నికల కౌంటింగ్ ట్రెండ్స్లో 105 స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ముందంజలో ఉండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. అందుక్కారణం నటుడు విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్ మార్కు దిశగా…
తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ ముందంజలో ఉండటం చూస్తుంటే, అందరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ ప్రయాణం…