తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో ఒక్కసారిగా కలకలం రేగింది. సీనియర్ నాయకుడు, గతంలో పార్టీలో కీలక పదవులు కూడా చేసి, అధిష్టానం దగ్గర మెప్పు పొందిన జీవన్ రెడ్డి అలిగారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జగిత్యాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే.. ఎమ్మెల్సీగా ఉన్నారు. ప్రస్తుతం ఆ పదవికి రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నట్టు అనుచరులు చెబుతున్నారు. దీంతో అసలు పార్టీలో ఏమైంది? జవన్ రెడ్డి ఎందుకు అలిగారు? అనే చర్చ తెరమీదికి వచ్చింది.
ఇటీవల కాలంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ను దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ను చేపట్టింది. బీఆర్ ఎస్లో గెలిచిన వారిని ఒకరు తర్వాత ఒకరుగా పార్టీలో చేర్చుకుం టున్న విషయం తెలిసిందే. గతంలో పార్లమెంటు ఎన్నికలకు ముందే.. దానం నాగేందర్ను చేర్చుకుని ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. తాజాగా పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడిని కూడా చేర్చు కున్నారు.
ఈ క్రమంలో జగిత్యాల నుంచి బీఆర్ ఎస్ తరఫున విజయం దక్కించుకుని.. జీవన్ రెడ్డిని ఓడించిన సంజయ్ను కూడా సీఎం రేవంత్ పార్టీలోకి తీసుకున్నారు. ఇదే.. జీవన్రెడ్డిని ఆగ్రహానికి గురి చేసింది. కనీసం తనకు ఒక్క మాట కూడా చెప్పకుండానే ఇలా ఎలా చేస్తారంటూ ఆయన మండిపడుతున్నారు. తనకు ప్రత్యర్థిగా ఉన్న సంజయ్ను కేంద్రంగా చేసుకుని జీవన్ రెడ్డి దశాబ్దకాలంగా పోరాటాలు చేస్తున్నారు. ఇంతలోనే ఆయనను పార్టీలోకి చేర్చుకోవడంతో జీవన్ అలకపాన్పు ఎక్కారు.
ఈ విషయం తెలుసుకున్న కీలక నాయకులు ఆయనను లైన్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. మేరకు జీవన్ రెడ్డి లైన్లోకి వస్తారో చూడాలి. తన పదవి ఎమ్మెల్సీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన జీవన్ రెడ్డి పార్టీ మార్పు విషయంపైనా ఆలోచన చేస్తున్నారని మరికొందరు చెబుతున్నారు. కానీ, ఇది జరగదు. సుదీర్ఘకాలంగా ఆయన పార్టీతో అనుబంధం పెంచుకున్న నేపథ్యంలో కాంగ్రెస్లోనే ఉంటారు. కానీ, ఇప్పుడు రేవంత్కు మాత్రం కొన్ని చిక్కులు తప్పవని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on June 25, 2024 7:33 am
అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…
చాట్జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…
నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…
ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…
షాప్లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…