టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ సింప్లిసిటీ బాగుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మంత్రి గా ప్రమాణం అనంతరం.. ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. దీనిని కొనసాగిస్తున్నారు కూడా. ఈ క్రమంలో సాధారణ ప్రజలకు కొంత వెసులుబాటు కూడా కల్పించారు. దీంతో అందరూ హ్యాపీగా వెళ్లి నారా లోకేష్ను కలుస్తున్నారు. తాజాగా సచివాలయం నాలుగో బ్లాక్ లోని ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్. తన కుర్చీకి ఎలాంటి ఆర్భాటాలు వద్దని తెలిపారు. ఈ క్రమంలో తన కుర్చీకి కట్టిన తెల్లటి టవల్ను స్వయంగా తీసేశారు. ఈ సింప్లిసిటీ బాగానే ఉంది. అయితే.. మున్ముందు కూడా దీనిని కొనసాగిస్తే బెటర్గానే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.
ఇక, వ్యక్తిగత కార్యాచరణలో ఉన్న సింప్లిసిటీ వ్యవహారాల్లోకి కూడా రావాల్సి ఉంటుంది. కొన్నాళ్ల కిందట చంద్రబాబు కూడా.. కూటమి పార్టీల సమావేశంలో తనకు వేసిన ప్రత్యేక కుర్చీని మార్చుకుని అందరితో సమానంగానే కూర్చున్నారు.
అంతేకాదు.. మంత్రులుకూడా సింప్లిసిటీ పాటించేలా చూడాల్సి ఉంది. సహజంగా ఉన్నతస్థానాల్లో ఉన్న నాయకులు ఎలా వ్యవహరిస్తారో.. కిందిస్థాయి వారు కూడా.. అలానే ముందుకు సాగుతారు కాబట్టి ఇబ్బంది ఉండకపోవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడిన కొత్తకావడం.. ఎమ్మెల్యే అనంతరం మంత్రి కావడంతో నారా లోకేష్ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మున్ముందు కూడా.. దీనిని కొనసాగిస్తే.. ఖచ్చితం గా ఫీల్ గుడ్ మినిస్టర్ అనే పేరు రావడం ఖాయం.
This post was last modified on June 24, 2024 3:39 pm
జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…