Political News

ఎంత త‌ప్పు చేశావు జ‌గ‌న్‌.. పులివెందులే చెపుతోన్న ప‌చ్చి నిజం…?

జ‌గ‌న్ అభిమానులు.. వైసీపీ సానుభూతి ప‌రులు అంటున్న మాట ఇదే. ‘ఎంత త‌ప్పు చేశావు జ‌గ‌న్‌’ అనే అంటున్నారు. జ‌నాల‌ను న‌మ్ముకుని.. అన్నీ వారికి ఊడ్చి పెట్టి.. అప్పుల‌పై అప్పులు తెచ్చి ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. ఈ క్ర‌మంలో విపక్షాల నుంచి అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. సైకో అన్నా భ‌రించారు. తుగ్ల‌క్ అన్నా స‌హించారు. అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నార‌ని అన్నా.. ప‌ట్టించుకోకుండా.. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి నిధులు పంపిణీ చేశారు. ఫ‌లితంగా ఏం ద‌క్కింది? ఎన్నిక ల్లో ఘోర ఓట‌మి. ఒక‌నాడు ఠీవీగా ఎగిరిన జెండా.. ఇప్పుడు రెప‌రెప‌లు పోయి.. కొట్టుమిట్టాడే ప‌రిస్థితి.

“కొంతైనా ప్ర‌శాంత‌త ద‌క్కుతుంద‌ని ఆశించి ఇక్క‌డ‌కు వ‌స్తే.. ఇక్క‌డా త‌ల‌నొప్పేనా!” అని జ‌గ‌న్ అనుకునే ప‌రిస్థితి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే వ‌చ్చిందంటే.. జ‌గ‌న్ చేసింది త‌ప్పా? ఒప్పా? అనేది అర్థ‌మ‌వుతూనే ఉంది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు.. తాజాగా జ‌గ‌న్ దంప‌తుల‌ను చుట్టుముట్టారు. మాకు బిల్లులు చెల్లిస్తారా? లేదా? అని నిల‌దీశారు. దీంతో జ‌గ‌న్ దంప‌తులు సహ‌జంగానే ఉక్కిరిబిక్కిరికి గుర‌య్యారు. ఓట‌మి త‌ర్వాత‌.. ఎక్క‌డికీ వెళ్ల‌ని జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారు. ఆయ‌న ఉద్దేశం వేరు. కానీ, ఆయ‌న వ‌చ్చార‌ని తెలుసుకుని అప్పులోళ్లు ఎగ‌బ‌డ్డారు.

వీరిలో 5 లక్ష‌ల నుంచి 50 ల‌క్ష‌ల ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు ఉన్నారు. అంద‌రూ వైసీపీవారే. కానీ, ఏం ప్ర‌యోజ‌నం.. ఈగ‌లు ముసురుకున్న‌ట్టు ముసురుకున్నారు. “ఇప్పుడు ప‌రిస్థితి అంద‌రూ చూస్తూనే ఉన్నారు. కొంత మేర‌కు ఓపిక ప‌ట్టండి. మ‌నం అన్నీ సాధిద్దాం” అని నెత్తీనోరూ మొత్తుకున్నా.. జ‌గ‌న్ మాట వినిపించుకోలేదు. త‌మ‌కు సొమ్ములే కావాలంటూ యాగీ చేశారు. ఇవ‌న్నీ ఒక్క పులివెందుల‌తోనే పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇదంతా ఎందుకు జ‌రిగింది? అని ఆత్మ విమ‌ర్శ చేసుకుంటే.. ప‌థ‌కాల కార‌ణంగా.. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచేయ‌డ‌మే.

చేతికి ఎముక లేకుండా.. కీల‌క ప్రాజెక్టుల‌ను కూడా ఫ‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌కు సొమ్ములు చేర్చారు. వేల‌కు వేల కోట్ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాల రూపంలో అందించారు. పోనీ.. దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం ద‌క్కిందా? “మీ బిడ్డ‌ను మీరే కాపాడుకోవాలి” అని జ‌గ‌న్ నినాదాన్ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకున్నారా? అంటే.. తెలుస్తూనే ఉంది. ప‌ట్టించుకోక‌పోగా.. క‌నీసం గౌర‌వ ప్ర‌ద‌మైన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌కుండా చేశారు. మ‌రి ఈ ఐదేళ్ల‌లో ఢిల్లీ టు విజ‌య‌వాడ చేసిన ప్ర‌ద‌క్షిణ‌లు.. అప్పుల కోసం ప‌డిన పాట్లు ఏమైపోయాయి? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏదేమైనా జ‌గ‌న్ చేసింది త‌ప్ప‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

This post was last modified on June 24, 2024 3:37 pm

Share

Recent Posts

బీజేపీ ఎమ్మెల్యే అక్ర‌మాల‌పై నేరుగా మోడీకే ఫిర్యాదు చేసిన ఫ్రెండ్‌!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ బీజేపీ అగ్ర‌నేత‌. ఇక‌, ఆయ‌న సొంత రాష్ట్రం గుజ‌రాత్‌. తాజాగా మోడీ చిన్న‌నాటి స్నేహితుడు,…

48 minutes ago

రామాయణ సంగీతానికి తెర లేచింది

విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…

51 minutes ago

హైదరాబాద్ లో బాలికను రేప్ చేసిన 8 మంది

మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…

1 hour ago

జైలర్ 2 మీద పందెం కాసేదెవరు

అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…

2 hours ago

నిర్మాత రిస్క్ చేశాడు… జాక్‌పాట్ కొడుతున్నాడు

ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంత‌కుముందులా ఉదారంగా కొత్త సినిమాల‌ను కొన‌ట్లేద‌న్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌లు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫ‌ర్…

2 hours ago

సుకుమార్ మీద దేవి ఫ్యాన్స్ ఎటాక్

కొంద‌రు ద‌ర్శ‌కులు టెక్నీషియ‌న్ల విష‌యంలో చాలా ప‌ర్టికుల‌ర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్ పుట్ ఇచ్చే…

5 hours ago