Political News

ఎంత త‌ప్పు చేశావు జ‌గ‌న్‌.. పులివెందులే చెపుతోన్న ప‌చ్చి నిజం…?

జ‌గ‌న్ అభిమానులు.. వైసీపీ సానుభూతి ప‌రులు అంటున్న మాట ఇదే. ‘ఎంత త‌ప్పు చేశావు జ‌గ‌న్‌’ అనే అంటున్నారు. జ‌నాల‌ను న‌మ్ముకుని.. అన్నీ వారికి ఊడ్చి పెట్టి.. అప్పుల‌పై అప్పులు తెచ్చి ప‌థ‌కాల‌ను అమ‌లు చేశారు. ఈ క్ర‌మంలో విపక్షాల నుంచి అనేక విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. సైకో అన్నా భ‌రించారు. తుగ్ల‌క్ అన్నా స‌హించారు. అప్పులు చేస్తూ.. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నార‌ని అన్నా.. ప‌ట్టించుకోకుండా.. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి నిధులు పంపిణీ చేశారు. ఫ‌లితంగా ఏం ద‌క్కింది? ఎన్నిక ల్లో ఘోర ఓట‌మి. ఒక‌నాడు ఠీవీగా ఎగిరిన జెండా.. ఇప్పుడు రెప‌రెప‌లు పోయి.. కొట్టుమిట్టాడే ప‌రిస్థితి.

“కొంతైనా ప్ర‌శాంత‌త ద‌క్కుతుంద‌ని ఆశించి ఇక్క‌డ‌కు వ‌స్తే.. ఇక్క‌డా త‌ల‌నొప్పేనా!” అని జ‌గ‌న్ అనుకునే ప‌రిస్థితి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే వ‌చ్చిందంటే.. జ‌గ‌న్ చేసింది త‌ప్పా? ఒప్పా? అనేది అర్థ‌మ‌వుతూనే ఉంది. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు.. తాజాగా జ‌గ‌న్ దంప‌తుల‌ను చుట్టుముట్టారు. మాకు బిల్లులు చెల్లిస్తారా? లేదా? అని నిల‌దీశారు. దీంతో జ‌గ‌న్ దంప‌తులు సహ‌జంగానే ఉక్కిరిబిక్కిరికి గుర‌య్యారు. ఓట‌మి త‌ర్వాత‌.. ఎక్క‌డికీ వెళ్ల‌ని జ‌గ‌న్‌.. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లారు. ఆయ‌న ఉద్దేశం వేరు. కానీ, ఆయ‌న వ‌చ్చార‌ని తెలుసుకుని అప్పులోళ్లు ఎగ‌బ‌డ్డారు.

వీరిలో 5 లక్ష‌ల నుంచి 50 ల‌క్ష‌ల ప‌నులు చేసిన కాంట్రాక్ట‌ర్లు ఉన్నారు. అంద‌రూ వైసీపీవారే. కానీ, ఏం ప్ర‌యోజ‌నం.. ఈగ‌లు ముసురుకున్న‌ట్టు ముసురుకున్నారు. “ఇప్పుడు ప‌రిస్థితి అంద‌రూ చూస్తూనే ఉన్నారు. కొంత మేర‌కు ఓపిక ప‌ట్టండి. మ‌నం అన్నీ సాధిద్దాం” అని నెత్తీనోరూ మొత్తుకున్నా.. జ‌గ‌న్ మాట వినిపించుకోలేదు. త‌మ‌కు సొమ్ములే కావాలంటూ యాగీ చేశారు. ఇవ‌న్నీ ఒక్క పులివెందుల‌తోనే పోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంద‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇదంతా ఎందుకు జ‌రిగింది? అని ఆత్మ విమ‌ర్శ చేసుకుంటే.. ప‌థ‌కాల కార‌ణంగా.. ప్ర‌జ‌ల‌కు డ‌బ్బులు పంచేయ‌డ‌మే.

చేతికి ఎముక లేకుండా.. కీల‌క ప్రాజెక్టుల‌ను కూడా ఫ‌ణంగా పెట్టి ప్ర‌జ‌ల‌కు సొమ్ములు చేర్చారు. వేల‌కు వేల కోట్ల‌ను ప్ర‌జ‌ల‌కు ప‌థ‌కాల రూపంలో అందించారు. పోనీ.. దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం ద‌క్కిందా? “మీ బిడ్డ‌ను మీరే కాపాడుకోవాలి” అని జ‌గ‌న్ నినాదాన్ని ప్ర‌జ‌లు ప‌ట్టించుకున్నారా? అంటే.. తెలుస్తూనే ఉంది. ప‌ట్టించుకోక‌పోగా.. క‌నీసం గౌర‌వ ప్ర‌ద‌మైన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ద‌క్క‌కుండా చేశారు. మ‌రి ఈ ఐదేళ్ల‌లో ఢిల్లీ టు విజ‌య‌వాడ చేసిన ప్ర‌ద‌క్షిణ‌లు.. అప్పుల కోసం ప‌డిన పాట్లు ఏమైపోయాయి? అనేది ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ఏదేమైనా జ‌గ‌న్ చేసింది త‌ప్ప‌ని అంటున్నారు వైసీపీ నాయ‌కులు.

This post was last modified on June 24, 2024 3:37 pm

Share
Show comments
Published by
Satya
Tags: Pulivendula

Recent Posts

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు…

1 hour ago

15 నిమిషాల దర్శనం… నటి క్లారిటీ

సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…

3 hours ago

పెద్ద ఒత్తిడిని ‘పెద్ది’ తట్టుకోగలదా

అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…

3 hours ago

అన్వేషణను అరెస్టు చేస్తారా?

హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…

5 hours ago

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

7 hours ago

బండ్ల గణేష్ చెప్పినట్లే.. బన్నీ వాసు

గత ఏడాది లిటిల్ హార్ట్స్ సినిమా సక్సెస్ మీట్లో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం…

7 hours ago