తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇలాంటి కష్టకాలం వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఊహించి ఉండరు. నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన షాక్తో కుంగిపోయిన కేసీఆర్ను.. లోక్సభ ఎన్నికల్లో సున్నా ఫలితం మరింత దెబ్బకొట్టింది. దీంతో పార్టీ ఉనికి ప్రమాదంలో పడటంతో నాయకులు పక్క చూపులు చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ సమయంలో బీఆర్ఎస్ను కాపాడేది హరీష్ రావు మాత్రమేనన్న అభిప్రాయాలు ఆ పార్టీలోనే వినిపిస్తున్నాయి. ఆయనకు అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టాలనే డిమాండ్లూ వస్తున్నాయి. కానీ ఆ అవకాశం ఇస్తారా? అన్నదే ప్రశ్న.
ఎన్నికల ఫలితాలతో ఢీలా పడ్డ కేసీఆర్ ఫాం హౌజ్ దాటి బయటకు రావడం లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటల్లో పదును లేదు. దీంతో పార్టీ శ్రేణులు మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏ లీడర్ ఎప్పుడు పార్టీ నుంచి జంప్ అవుతారో తెలియని పరిస్థితి. పార్టీ నాయకులు, శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపి,ఈ జంపింగ్లను ఆపే దిశగా కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు. క్లాస్ లీడర్గా పేరున్న కేటీఆర్ పార్టీని కాపాడలేరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
పార్టీ అధినేత కేసీఆర్ ఎలాగో విశ్రాంతి తీసుకుంటున్నారు. అందుకే అధ్యక్షుడిగా హరీష్ రావును నియమిస్తే పార్టీ తిరిగి పుంజుకునే అవకాశముంటుంది. మాస్ లీడర్గా పేరొందిన హరీష్ పార్టీలో మళ్లీ జోష్ నింపే ఆస్కారముంటుంది. కానీ హరీష్కు కేసీఆర్ ఆ బాధ్యతలు ఇవ్వడం అనుమానంగానే మారింది. పేరుకు మేనళ్లుడే అయినా హరీష్ను నమ్మే విషయంలో కేసీఆర్ కాస్త సందేహిస్తారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. గతంలో హరీష్ బీజేపీలో చేరతారనే ప్రచారంతో ఆయన్ని అప్పట్లో కేసీఆర్ దూరం పెట్టారని అంటారు. కానీ పార్టీ కోసం నిబద్ధతతో పని చేసే హరీష్కు పగ్గాలు అప్పగిస్తే బీఆర్ఎస్ను బతికించుకోవచ్చని సొంత నాయకులే అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 24, 2024 9:54 am
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…