కడప జిల్లా, ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఉన్న పట్లు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడ ఆ కుటుంబం తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది.
వైఎస్ అయినా, ఆయన వారసుడు జగన్ అయినా.. పులివెందులకు వెళ్లకుండా, ఎన్నికల ప్రచారం కూడా చేయకుండానే అక్కడ ఎన్నికల్లో గెలిచేస్తుంటారు. వారికి భారీ మెజారిటీలు కూడా గ్యారెంటీ.
ఐతే ఈసారి మాత్రం ఎన్నికల్లో జగన్కు మెజారిటీ కొంచెం తగ్గింది. సొంత నియోజకవర్గంలోనూ జగన్కు వ్యతిరేకత తప్పలేదనే చర్చ జరిగింది ఫలితాల సమయంలో. కాగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తర్వాతి రోజే పులివెందులకు వెళ్లగా.. అక్కడ ఆయన ఇంటి దగ్గర కొంత గందరగోళ వాతావరణం నెలకొంది.
సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు.. ఇంటిమీద రాళ్ల దాడి చేస్తే కిటికీల అద్దాలు పగిలినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఐతే కొన్ని వీడియో దృశ్యాలు చూస్తే అక్కడి వాతావరణం కొంచెం గందరగోళంగా తయారైనట్లే కనిపించింది.
సొంత పార్టీ కార్యకర్తల నుంచే జగన్ తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని.. సీఎంగా ఉండగా తమను పట్టించుకోకుండా ఓడిపోయాక నియోజకవర్గానికి వస్తారా అంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్.. కొన్ని టీవీ ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. ఐతే ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది.
జగన్ తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించారని.. ఇందుకు జనం పెద్ద ఎత్తున హాజరు కావడంతో గందరగోళం నెలకొని అద్దాలు పగిలాయని.. అంతే తప్ప అక్కడ నిరసనలు, అందోళనలు లాంటివేమీ జరగలేదని వైసీపీ హ్యాండిల్లో పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీతోనూ ఈ మేరకు వివరణ ఇప్పించారు.
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…