కడప జిల్లా, ముఖ్యంగా పులివెందుల ప్రాంతంలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఉన్న పట్లు గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. దశాబ్దాలుగా అక్కడ ఆ కుటుంబం తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తోంది.
వైఎస్ అయినా, ఆయన వారసుడు జగన్ అయినా.. పులివెందులకు వెళ్లకుండా, ఎన్నికల ప్రచారం కూడా చేయకుండానే అక్కడ ఎన్నికల్లో గెలిచేస్తుంటారు. వారికి భారీ మెజారిటీలు కూడా గ్యారెంటీ.
ఐతే ఈసారి మాత్రం ఎన్నికల్లో జగన్కు మెజారిటీ కొంచెం తగ్గింది. సొంత నియోజకవర్గంలోనూ జగన్కు వ్యతిరేకత తప్పలేదనే చర్చ జరిగింది ఫలితాల సమయంలో. కాగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అనంతరం జగన్ తర్వాతి రోజే పులివెందులకు వెళ్లగా.. అక్కడ ఆయన ఇంటి దగ్గర కొంత గందరగోళ వాతావరణం నెలకొంది.
సొంత పార్టీ కార్యకర్తలు, అభిమానులే ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు.. ఇంటిమీద రాళ్ల దాడి చేస్తే కిటికీల అద్దాలు పగిలినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలొచ్చాయి. ఐతే కొన్ని వీడియో దృశ్యాలు చూస్తే అక్కడి వాతావరణం కొంచెం గందరగోళంగా తయారైనట్లే కనిపించింది.
సొంత పార్టీ కార్యకర్తల నుంచే జగన్ తిరుగుబాటు ఎదుర్కొంటున్నారని.. సీఎంగా ఉండగా తమను పట్టించుకోకుండా ఓడిపోయాక నియోజకవర్గానికి వస్తారా అంటూ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్.. కొన్ని టీవీ ఛానెళ్లలో వార్తలు వచ్చాయి. ఐతే ఈ ప్రచారాన్ని వైసీపీ ఖండించింది.
జగన్ తన నియోజకవర్గంలో ప్రజా దర్బార్ నిర్వహించారని.. ఇందుకు జనం పెద్ద ఎత్తున హాజరు కావడంతో గందరగోళం నెలకొని అద్దాలు పగిలాయని.. అంతే తప్ప అక్కడ నిరసనలు, అందోళనలు లాంటివేమీ జరగలేదని వైసీపీ హ్యాండిల్లో పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీతోనూ ఈ మేరకు వివరణ ఇప్పించారు.
This post was last modified on June 23, 2024 12:43 pm
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను కూటమి సర్కార్ ఏర్పాటు చేసిన…
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…