Political News

విధ్వంసం అంటే ఇది కాదు జగన్ !

గుంటూరు జిల్లా శివారులోని తాడేప‌ల్లిలో కొత్తగా నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాల‌యాన్ని నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని పేర్కొంటూ.. శ‌నివారం ఉద‌యం అధికారులు కూల్చివేసిన విష‌యం తెలిసిందే. 7 బుల్డోజ‌ర్ల‌ను వినియోగించి, ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త మ‌ధ్య ఈ భ‌వ‌నాల‌ను కూల్చేశారు.

అయితే.. దీనిపై స్పందించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. చంద్రబాబు ప్ర‌భుత్వం విధ్వంసానికి పాల్ప‌డుతోంద‌ని.. రాష్ట్రంలో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమన కాండను ఈ స్థాయికి తీసుకెళ్లారంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని అన్నారు.

అయితే.. జ‌గ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ప‌లు వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. విధ్వంసం అంటే.. ఇది కాదు..జ‌గ‌న్ రెడ్డీ! అని కామెంట్లు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ హ‌యాంలో జ‌రిగిన కొన్ని ఘ‌ట‌న‌ల‌ను వారు ఉద‌హ‌రిస్తూ.. ఇవీ విధ్వంసాలంటే! అని చెబుతున్నారు. అవి ఏంటంటే!

ప్ర‌జావేదిక కూల్చివేత‌: గ‌తంలో చంద్ర‌బాబు పాల‌న స‌మ‌యంలో 8 కోట్ల రూపాయ‌లు వ్య‌యం చేసి ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోసం నిర్మించిన ప్ర‌జావేదిక‌.. అనేక రూపాల్లో వినియోగించుకునేందుకు ప్ర‌య‌త్నించార‌ని చెబుతున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినేందుకు.. ప్ర‌జాప్ర‌తినిధుల స‌మావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు దీనిని నిర్మించార‌ని తెలిపారు.కానీ, 2019లో అధికారంలో కి వ‌చ్చిన జ‌గ‌న్‌.. దీనిని కూల్చి వేశార‌ని.. క‌నీసం దీనిపై చ‌ర్చించ‌కుండానే.. ఒక్క మాట‌తో దీనిని కూల్చి వేశార‌ని.. ఇదీ విధ్వంసం అంటే అని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్ప‌టంలో కూల్చివేత‌లు: మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఇప్ప‌టం గ్రామంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్స‌వం నిర్వ‌హించారు. ఈ స‌మ‌యంలో అక్క‌డి రైతులు కొంద‌రు.. ఆయ‌న‌కు స్థ‌లం ఇచ్చారు. దానిలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ స‌మావేశం నిర్వ‌హించుకున్నారు. దీనిపై క‌క్ష క‌ట్టిన‌ట్టుగా వైసీపీ ప్ర‌బుత్వం అప్ప‌ట్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌భ‌కు పొలాల‌ను ఇచ్చిన వారి ఇళ్ల‌ను కూల‌గొట్టింద‌నే ఆరోప‌ణ‌లు వినిపించాయి. దీనిని ప్ర‌స్తావిస్తూ.. విధ్వంసం అంటే ఇదీ జ‌గ‌న్ రెడ్డీ అని వ్యాఖ్యానిస్తున్నారు.

పోల‌వ‌రం నిధుల మ‌ళ్లింపు: ఏపీ ప్ర‌జ‌ల జీవ‌నాడి వంటి పోల‌వ‌రం ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేసేందుకు.. కేంద్ర ప్ర‌బుత్వం 6 వేల కోట్లను ఇచ్చింది. దీనిని వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌కు మ‌ళ్లించి.. ఆ నిధుల‌ను రూపాయి కూడా పోల‌వ‌రం ప్రాజెక్టుకు ఖ‌ర్చు చేయ‌ని విధాన‌మే విధ్వంసం అని.. ఇన్ని విధ్వంసాల‌ను ప‌క్క‌న పెట్టి.. ఇప్పుడు జ‌రిగిన చిన్న ఘ‌ట‌న‌పై ఎందుకు గ‌గ్గోలు పెడుతున్నారంటూ జ‌గ‌న్‌పై వారంతా మండిప‌డుతున్నారు. గ‌త ఐదేళ్ల‌లో రుషికొండ వంటి ప్ర‌కృతి వ‌న‌రును నిర్లజ్జ‌గా..తొవ్వేసి ప‌ర్యావ‌ర‌ణానికి హానీ క‌లిగిస్తూ.. చేసిన భ‌వంతి నిర్మాణం విధ్వంసం కాదా? అని ప్ర‌శ్నిస్తున్నారు. వ్య‌క్తిగ‌త దాడులు, దూష‌ణ‌ల‌తో రెచ్చిపోయి పాల‌న చేయ‌డం విధ్వంసం కాదా? అని నిల‌దీస్తున్నారు. ఇన్ని విధ్వంసాల‌కు కార‌ణ‌మైన‌.. జ‌గ‌న్‌.. ఇప్పుడు విధ్వంసం.. విధ్వంసం అంటూ.. గ‌గ్గోలు పెట్ట‌డం.. మీకు సూట‌వ‌దు స‌ర్‌!! అని వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

కొసమెరుపు : నిన్న కూల్చిన వైసీపీ పార్టీ కార్యాలయం 16వ జాతీయ రహదారిని అమరావతి రోడ్డుతో అనుసంధానించే సీడ్ యాక్సెస్ రోడ్డు ప్లాన్ ను అడ్డుకునేలా రోడ్డు వేసే మార్గంలో కట్టినందు వల్లే కూల్చడానికి ఉన్న కారణాల్లో ఒక కారణమని ప్రభుత్వం పేర్కొంది.

This post was last modified on June 23, 2024 12:12 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

19 minutes ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

35 minutes ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

1 hour ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

2 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

3 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

3 hours ago