Political News

పిరికితనంతోనే వైసీపీ సభ్యులు రాలేదు: చంద్రబాబు

ఏపీ 16వ శాసన సభ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ రోజు స్పీకర్ గా అయ్యన్న బాధ్యతలు చేపట్టిన తర్వాత సభాధ్యక్షుడి హోదాలో సీఎం చంద్రబాబు తొలిసారి ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా భావోద్వేగానికి గురై ప్రసంగించారు. గతంలో తాను కౌరవ సభ నుంచి వాకౌట్ చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకొని చంద్రబాబు ఎమోషనల్ అయ్యారు. ఆనాడు తన సతీమణిని దూషించారని, కుటుంబ సభ్యులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడి వాకౌట్ చేస్తానంటే మైక్ ఇవ్వలేదని, అందుకే ముఖ్యమంత్రిగానే గౌరవ సభకు వస్తానని వాకౌట్ చేశానని ఆనాడు తాను అన్న వ్యాఖ్యలను సభలో మళ్లీ చదివి వినిపించి ఎమోషనల్ అయ్యారు.

రాజకీయాలకు సంబంధం లేకపోయినా తన కుటుంబ సభ్యులను దూషించారని, తన సతీమణి పై అసభ్యకరమైన కామెంట్లు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజామోదంతోనే మళ్లీ సీఎంగా సభలోకి వచ్చానని, మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపై తెలుగువాడిగానే పుట్టి తెలుగు జాతి రుణం తీర్చుకుంటానని చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.

గత సభలో తమకు 23 సీట్లు వచ్చాయని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని మాజీ సీఎం జగన్, వైసీపీ సభ్యులు ఎద్దేవా చేసిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ సారి కూటమి గెలిచిన సీట్లు164 అని, అన్నీ కలిపితే 11 వస్తుందని, 11 సీట్లు వైసీపీకి రావడం దేవుడి స్క్రిప్ట్ అని తాను అనబోనని చంద్రబాబు వైసీపీ నేతలకు చురకలంటించారు.1631 రోజుల పాటు అమరావతి రైతులు ఉద్యమం చేశారని, ఆ అంకెలు కలిపినా 11 వస్తుందని, ఇది దేవుడి స్క్రిప్ట్ అని నేను అనను అని చంద్రబాబు చెప్పారు.

ఈ రోజు సభలో ఉండకపోవడం వైసీపీ నేతల పిరికి తనం తప్ప ఇంకోటి కాదని సభకు హాజరు కాని వైసీపీ సభ్యులనుద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయినా, గత సభలో వైసీపీ సభ్యుల మాదిరి ప్రవర్తించకూడదని, ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టాలని, వైసీపీ నేతలపై కాదని చంద్రబాబు మిగతా సభ్యులకు హితవు పలికారు. పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు తాకనివ్వను అని పెద్ద డైలాగులు కొట్టిన వారు ఈ రోజు సభలో లేరని, ఆయన 21 కి 21 సీట్లు గెలిచి డిప్యూటీ సీఎంగా సభలో అడుగుపెట్టారని అన్నారు. వై నాట్ 175 అని 11 కూడా తెచ్చుకోని నాయకత్వం వైసీపీది అని ఎద్దేవా చేశారు. ఎక్కడ తగ్గాలో..ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ కల్యాణ్ అని, ఇదే విషయం తాను చాలాసార్లు చెప్పానని అన్నారు.

This post was last modified on June 22, 2024 12:27 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

6 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

6 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

7 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

7 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

10 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

12 hours ago