ఎన్నికల ఫలితంతో పాతాళానికి పడిపోయిన జగన్కు మున్ముందు మరింత గడ్డు కాలం తప్పదా? రాబోయే అయిదేళ్లు జగన్కు కష్టమేనా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. అటు కేసులు.. ఇటు పార్టీ మారే జంపింగ్ నేతలతో జగన్కు తలనొప్పి తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకుని పార్టీని నడిపించడమంటే కత్తి మీద సామే అని చెప్పాలి. అధికారం ఉంది కదా అని తానే రాజులా భావించిన జగన్.. తన సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు దూరంగా ఉన్నారనే టాక్ ఉంది. ఇప్పుడు ఓటమిని తట్టుకుని ఆయన ప్రజల్లోకి వెళ్లడం అంత సులువు కాదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అధికారంలో ఉన్న పార్టీలో ఉండేందుకు ఏ నేతలైనా మొగ్గు చూపుతారన్నది జగమెరిగిన సత్యం. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీ నాయకులు పక్కచూపు చూస్తున్నారు. అలాంటిది జగన్ను అట్టిపెట్టుకునే ఉంటారనే నమ్మకంగా చెప్పలేని పరిస్థితి. అధికారంలో ఉన్న పార్టీలోకి వెళ్తే మర్యాద, గౌరవం లభిస్తుంది. మాట చెల్లుబాటు అవుతుంది. అందుకే నాయకులు పార్టీ మారడం పెద్ద విషయమేమీ కాదు. ఈ ఎన్నికల్లో జగన్కు 11 సీట్లే వచ్చాయి. దీంతో ఇప్పటికే ఆ పార్టీలోని కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేస్తున్నారు. ఈ బాటలోనే మరికొంత మంది వెళ్లే అవకాశముంది. ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు జగన్పై అక్రమాస్తులు,అవినీతి తదితర ఆరోపణలతో పదికి పైగానే కేసులు కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయి. ఇన్ని రోజులు సీఎంగా ఉండటంతో ఈ విచారణలో జగన్కు మినహాయింపు దక్కిందనే చెప్పాలి. ఇప్పుడిక జగన్ సీఎం కాదు. ఈ కేసుల విచారణలో ఆయన కచ్చితంగా పాల్గొనాల్సిందే. ఇవే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు జగన్ చేసిన అవినీతిని బయటకు లాగే ప్రయత్నాల్లో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. దీంతో జగన్పై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. జగన్ జైలుకు వెళ్లడం కూడా ఖాయమన్నట్లే పరిస్థితి కనిపిస్తోంది.
This post was last modified on June 19, 2024 3:36 pm
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత…
2029 పార్లమెంటు ఎన్నికల నాటికి దేశంలో నియోజకవర్గాలను పునర్విభజించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…
అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభన ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…
భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవి ఖాళీ అయింది. గత నెల 31వ తేదీ వరకు ఉన్న రాష్ట్ర…
తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…