Political News

ష‌ర్మిల‌.. వైసీపీని `పిల్ల కాలువ‌`గా  పోల్చారా?

కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ష‌ర్మిల.. తాజాగా మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆమె.. చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. “పిల్ల కాలువ‌ల‌న్నీ.. స‌ముద్రంలో క‌ల‌వాల్సిందే“ అని ష‌ర్మిల అన్నారు. అయితే.. ఆ `పిల్ల కాలువ` ఏదో  మాత్రం చెప్ప‌లేదు. కానీ, ఏపీలో నెల‌కొన్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో వైసీపీ అధికారం కోల్పోవ‌డం.. 151 స్థానాల నుంచి 11 సీట్ల‌కు జారుకున్న నేప‌థ్యంలో వైసీపీని ఉద్దేశించే ష‌ర్మిల వ్యాఖ్యానించార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

రాష్ట్రంలో ప్ర‌ధాన పార్టీల‌ను తీసుకుంటే.. కాంగ్రెస్ త‌ర్వాత‌.. క‌మ్యూనిస్టులు ఉన్నారు. ఆ త‌ర్వాత టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసిక‌ట్టుగా అధికారంలోకి వ‌చ్చాయి. ఇక‌, ఇత‌ర చిన్నా చిత‌కా పార్టీల‌కు పెద్ద‌గా వాల్యూ లేదు. జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ, ప్ర‌జాశాంతి పార్టీలు ఉన్నా..వాటి గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. తెలిసి నా..  ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. పైగా.. 0.0001 శాతం ఓటు బ్యాంకు కూడా.. అవి ద‌క్కించుకోలేక పోయారు. పార్టీ అధినేత‌లమ‌ని చెప్పుకొనే వారే ఓడిపోయారు.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలో ష‌ర్మిల అన్న‌ట్టుగా `పిల్ల కాలువ‌` పార్టీ అంటూ ఏదీలేదు. కానీ, ఆమె ఉద్దేశంలో వైసీపీనే అయి ఉంటుంద‌ని.. ప్ర‌స్తుతం వైసీపీ ప‌రిస్థితి దారుణ స్థాయికి చేరుకున్న ల‌క్ష్యంలో ఆమె చాలా న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించి ఉంటార‌ని చెబుతున్నారు. వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయాల‌ని.. ఎప్పుడో 8 ఏళ్ల కింద‌ట వైఎస్ ఆత్మ‌గా పేరున్న రామ‌చంద్ర‌రావు రాయ‌బారం నెరిపారు. అప్ప‌ట్లో ఆ పార్టీకి 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. త‌ర్వాత ఏకంగా 151 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు.

అయితే.. జ‌గ‌న్ క‌నీసం కాంగ్రెస్ మాట కూడా ఎత్త‌లేదు. ఇప్పుడు.. మాత్రం ప‌రిస్థితి దారుణంగా త‌యారైం ది. ఈ నేప‌థ్యంలోనే ష‌ర్మిల‌.. వైసీపీని ఉద్దేశించి `పిల్ల కాలువ‌`గా పోల్చి ఉంటార‌ని.. ఎప్ప‌టికైనా కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిందేన‌న్న భావ‌న‌తో ఆమె చెప్పి ఉంటార‌ని రాజ‌కీయ పండితులు భావిస్తున్నారు. మ‌రి ష‌ర్మిల ఉద్దేశం ఏంటి?  ఏం జ‌రుగుతుంది? అనేది ఫ్యూచ‌ర్ తేల్చాల్సిందే. 

This post was last modified on June 19, 2024 10:12 pm

Share

Recent Posts

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

2 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

3 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

3 hours ago

వివేకా కేసులో ముగియని సునీత పోరాటం

వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…

3 hours ago

రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు… లండన్ నుంచే ఇండియాకు..

విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…

4 hours ago

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

6 hours ago