Political News

వ‌దిన‌మ్మ పెన్ను.. రెండు సంత‌కాల‌ తో ప‌వ‌న్ బాధ్య‌త‌లు!

ఏపీ డిప్యూటీ సీఎంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త‌లు తీసుకున్నారు. బుధ‌వారం ఉద‌యం 10.53 నిమిషాల‌కు ఆయ‌న విజ‌య‌వాడ‌లోని జ‌ల‌వ‌న‌రుల శాఖలో ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాల‌యంలో పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, అట‌వీ, శాస్త్ర‌, సాంతిక‌, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల మంత్రిగా బాధ్య త‌లు చేప‌ట్టారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా రెండు ఫైళ్ల‌పై ప‌వ‌న్ క‌ల్యాణ్ సంత‌కాలు చేశారు. తొలి సంత కం మాత్రం త‌న వ‌ద్ద ఉన్న పెన్నుతోనే చేశారు.

అనంత‌రం.. వ‌దిన‌మ్మ సురేఖ ఇటీవ‌ల ప్ర‌జెంట్ చేసిన పెన్నుతో సంత‌కం చేశారు. ఈ రెండు సంత‌కాలు చేయ‌డానికి ముందు.. కార్యాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌ల్లోపాల్గొన్నారు. అనంత‌రం వేడ పండితుల.. ఆశీర్వ చ‌నం అందుకున్నారు.

త‌ర్వాత‌.. త‌న స్థానంలో కూర్చుని.. ముహూర్తం చూసుకుని మ‌రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌ను క‌లిసి అభినందించారు. పార్టీ నాయ‌కులు విరివిగా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

బాధ్య‌త‌లు తీసుకున్న వెంట‌నే ప‌వ‌న్‌.. ఐఏఎస్‌, ఐపీఎస్ అదికారుల‌తో భేటీ అవుతారు. అట‌వీ సంర‌క్ష‌ణ‌, అక్ర‌మ ర‌వాణా.. ఎర్ర‌చంద‌నం ప‌రిర‌క్ష‌ణ వంటివాటిపై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు. అదేవిధంగా పంచాయితీరాజ్ శాఖ‌కు చెందిన ఎన్జీవో సంఘాల‌తోనూ ప‌వ‌న్ భేటీ కానున్నారు. పంచాయ‌తీరాజ్ శాఖ‌లో చేప‌ట్టాల్సిన కార్య‌క్ర‌మాలు.. ప్ర‌స్తుతం పెండింగులో ఉన్న అంశాల‌పై చ‌ర్చించ‌నున్నారు.

ఇదిలావుంటే.. ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. మ‌ధ్యాహ్నం పార్టీ కార్యాల‌యానికి చేరుకుంటారు. మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న పార్టీ నేత‌ల‌తో భేటీ అవుతారు. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ స‌హా.. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న ఎమ్మెల్సీ స్థానాల‌పైనా ఆయ‌న చ‌ర్చించే అవ‌కాశం ఉంది.

రెండు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతున్న నేప‌థ్యంలో ఒక సీటును టీడీపీ తీసుకుని.. రెండో సీటును జ‌న‌సేన‌కు ఇస్తుంద‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీంతో జ‌న‌సేన‌కు ద‌క్కే సీటును ఎవ‌రికి ఇవ్వాల‌నే విష‌యంపై చ‌ర్చ సాగుతోంది.

This post was last modified on June 19, 2024 12:18 pm

Share

Recent Posts

ఇక్కడ అమ్మాయి సుప్రియకు అదిరిపోయే పదవి!

ఇటీవల సినీ ప్రముఖులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పదవులు కట్టబెట్టి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.…

1 hour ago

సంబరాలు అంత సాహసం చేస్తుందా

సంక్రాంతి పండక్కు వస్తామని జనవరి 12 డేట్ వేసుకున్న సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు ఆ తర్వాత పూర్తిగా…

1 hour ago

కేసీఆర్ ఫ్యామిలీ భూముల లెక్క చూస్తే షాకే!

బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పై ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 22ఏ భూములపై…

2 hours ago

ఇలాంటి కొడుకులు కూడా ఉంటారు..

మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలే అని చరిత్రలో ఎన్నో ఘటనలు రుజువు చేశాయి. కాసుల కంటే కని పెంచిన తలిదండ్రులు…

2 hours ago

నిద్రాహారాలు కాదు ముందు పనవ్వాలి

ఒక గంట కునుకు పడితే ఎక్కడ పనికి బ్రేక్ పడుతుందో అన్న రేంజ్ లో చివరి దశ ప్యారడైజ్ పనులను…

3 hours ago

ఇక పై కోడి కెలికినట్టు రాస్తే కుదరదు!

దేవుడు నుదుటి మీద రాసే రాతైనా అర్ధం అవుతుందేమో కానీ వైద్యుడు రాసే మందుల పేర్లు మాత్రం అర్ధం కావన్నది…

4 hours ago