ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ మరో ఆఫర్ ఇచ్చేలా కనిపిస్తోంది. ఈ లోక్సభ ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా బీజేపీ నుంచి పోటీ చేసిన కిరణ్ కుమార్ ఓటమి పాలయ్యారు. తన రాజకీయ ప్రత్యర్థి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డి ఓటమి కోసం కిరణ్ కుమార్ గట్టిగానే కష్టపడ్డా కానీ ఫలితం లేకపోయింది. ఒకవేళ కిరణ్ కుమార్ ఎంపీగా గెలిస్తే మోడీ కేంద్ర కేబినేట్లో ఆయనకు చోటు దక్కేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ అదృష్టం దక్కలేదు. దీంతో ఇప్పుడు ఆయనకు తెలంగాణ గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో సంచలన సమీకరణాలు త్వరలోనే చోటు చేసుకోబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ గవర్నర్గా కిరణ్ కుమార్ రెడ్డిని బీజేపీ ప్రభుత్వం నియమిస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మంచి పట్టున్న కిరణ్కుమార్ను తెలంగాణ గవర్నర్గా నియమించి, ఆయన సేవలను ఉపయోగించుకోవాలని బీజేపీ ఆలోచిస్తున్నట్లు టాక్.
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రాష్ట్ర విభజన తర్వాత వెనుకబడ్డారు. కొన్నేళ్లుగా సైలెంట్గా ఉన్న ఆయన ఈ లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి యాక్టివ్ అయ్యారు. తెలంగాణలోనూ బీజేపీ సమావేశాల్లో పాల్గొన్నారు. మరోవైపు కిరణ్ కుమార్కు గవర్నర్ పదవి విషయంలో చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించే అవకాశముంది. ప్రస్తుతం తెలంగాణకు ఇంఛార్జీ గవర్నర్ ఉన్నారు. దీంతో కిరణ్ కుమార్ను పూర్తిస్థాయి గవర్నర్గా నియమించి ఇక్కడి రాజకీయాల్లో మరో విధంగా చక్రం తిప్పాలనే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నట్లు చెబుతున్నారు.
This post was last modified on June 18, 2024 8:14 am
సెలబ్రిటీలు చిన్న వాళ్ళైనా పెద్దోళ్ళయినా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉందిప్పుడు. సోషల్ మీడియా జమానాలో చిన్న టంగ్…
అభిమానుల్లోనే కాదు సినీ ప్రియుల్లోనూ విపరీతమైన అంచనాలు మోస్తున్న సినిమా పెద్ది. చికిరి చికిరి ఛార్ట్ బస్టర్ పుణ్యమాని హిందీలోనూ…
హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీసులు యూట్యూబర్ అన్వేష్ (నా అన్వేషణ)పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అన్వేష్ విదేశాల్లో ఉన్నారని…
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…