Political News

వైసీపీలో ప‌డుతున్న వికెట్లు.. !

ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌లు తగులుతున్నాయి. ఎప్పుడు ఏక్ష‌ణంలో ఎవ‌రు పార్టీని వీడుతారో అనే భ‌యం పార్టీ నేత‌ల‌ను వెంటాడుతోంది. గెలిచిన వారిలోనూ ఒక‌రిద్ద‌రు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే విరూపాక్షి ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. ఆయ‌న పార్టీలో ఉండ‌డం అనుమానంగానే ఉంది. విరూపాక్షి ఇప్ప‌టికే టీడీపీ నేత‌లకు ట‌చ్‌లోకి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. అయితే.. ఆయ‌న దీనిని ఖండించారు. తన‌కు సీటు ఇచ్చి.. గెలిపించిన జగ‌న్‌ను వ‌ద‌ల‌బోన‌న్నారు. అంతేకాదు..తాను ఒక్క‌డినే అయినా అసెంబ్లీలో పోరాటం చేస్తాన‌ని చెప్పారు.

కానీ, ఇలా అన్న ఏ నాయ‌కుడూ.. కూడా ఆ మాట‌ను నిల‌బెట్టుకున్న ప‌రిస్థితి రాజ‌కీయాల్లో లేక పోవ‌డంతో వైసీపీ నాయ‌కులు కూడా విరూపాక్షిపై ఆశ‌లు వ‌దులుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇక‌, తాజాగా మాజీ మంత్రి, వైసీపీ నేత శిద్దా రాఘ‌వ‌రావు పార్టీకి గుడ్ బై చెప్పారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో తాను పార్టీని వీడుతున్న‌ట్టు శిద్దా ప్ర‌క‌టించారు. ఈయ‌న 2014-19 మ‌ధ్య టీడీపీ హయాంలో మంత్రిగా ప‌నిచేశారు. ద‌ర్శి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్నారు. 2019లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత‌.. టీడీపీకి గుడ్ బై చెప్పారు.

ఈ క్ర‌మంలోనే వైసీపీలో చేరారు. రాజ్య‌స‌భ‌, ఎమ్మెల్సీ అంటూ.. జ‌గ‌న్ ఆయ‌న‌కు ఆశ‌లు పెట్టార‌ని శిద్దా వ‌ర్గం.. ఆరు మాసాల కింద‌ట నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం తెలిసిందే. ఇక‌, తాజా ఎన్నికల్లో టికెట్ అయినా ఇస్తార‌ని శిద్దా ఆశ‌లు పెట్టుకున్నారు. వైశ్య సామాజిక‌వ‌ర్గం కోటాలో గిద్ద‌లూరు ద‌క్కుతుంద‌ని ఆశించారు. కానీ, జ‌గ‌న్ ఆయ‌న‌కు టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో త‌న పాత పార్టీ టీడీపీవైపు ఎన్నిక‌లకు ముందే దృష్టి సారించారు.

కానీ, అప్ప‌టికే ద‌ర్శి టికెట్ గొట్టిపాటి ల‌క్ష్మికి కేటాయించ‌డంతో ఆయ‌న మౌనంగా ఉండిపోయారు. ఇక‌, ఇప్పుడు స‌మీప రోజుల్లో వైసీపీకి భ‌విష్య‌త్తు ఉండ‌ద‌ని నిర్ధారించుకున్న శిద్దా రాఘ‌వ‌రావు.. పార్టీకి రాజీనామా చేశారు. ఈయ‌న త్వ‌ర‌లోనే టీడీపీ గూటికి చేరే అవ‌కాశం ఉంది. కాంట్రాక్టులు, రియ‌ల్ ఎస్టేట్, ఇత‌ర వ్యాపారాలు చేసే శిద్దా రాఘ‌వ‌రావుకు చంద్ర‌బాబు ఆహ్వానంప‌లికే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ ప‌రిణామాలు చూస్తే.. వైసీపీ నుంచి రాబోయే రోజుల్లో ఇంకెంత మంది బ‌య‌ట‌కు వ‌స్తారో చూడాలి.

This post was last modified on June 17, 2024 6:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

18 minutes ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

2 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

2 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

3 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

4 hours ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

5 hours ago