ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు సారథ్యంలో కొత్త మంత్రివర్గం కొలువుతీరింది. అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి అందరికీ ఆమోదయోగ్యంగా కేటినేట్ను ఏర్పాటు చేసుకుంది. మంత్రివర్గ ఏర్పాటులో చంద్రబాబు తనదైన ముద్ర వేసి ఎలాంటి అసంతృప్తి లేకుండా చూసుకున్నారు. కానీ మంత్రి పదవి వస్తుందని భావించిన సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం కాస్త నిరాశకు లోనయినట్లు తెలిసింది. కానీ ఎలాంటి సమీకరణాల ప్రకారం చూసినా కన్నాకు బాబు మంత్రి పదవి ఇచ్చే అవకాశం లేకపోయిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
సీనియర్ లీడర్ కన్నా లక్ష్మీనారాయణ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినపుడల్లా గుంటూరు జిల్లా కోటా కింద కచ్చితంగా మంత్రి పదవి చేపట్టేవాళ్లు. ఉమ్మడి ఏపీ విభజనకు ముందు కూడా ఆయన కాంగ్రెస్ మంత్రివర్గంలోనే ఉన్నారు. కానీ రాష్ట్రం విడిపోయాక బీజేపీలోకి వెళ్లారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచారు. దీంతో చంద్రబాబు కేబినేట్లో ఆయనకు కచ్చితంగా చోటు దక్కుతుందని అనుకున్నారు. కానీ పార్టీ భవిష్యత్ దృష్ట్యా బాబు నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు గుంటూరు జిల్లా, కాపుల కోటా చూసుకున్నా కన్నాకు అవకాశం దక్కకుండా పోయింది.
కూటమి పరంగా చూసుకుంటే కాపుల కోటాలో పవన్ కల్యాణ్, నిమ్మల రామానాయుడు, కందుల దుర్గేశ్, పొంగూరు నారాయణలకు బాబు చోటు కల్పించారు. టీడీపీ నుంచి ఛాన్స్ దక్కించుకున్న రామానాయుడు, నారాయణ పార్టీ కోసం కష్టపడి పని చేశారు. నారాయణ ఆర్థికంగా అండగా నిలిచారు. అందుకే బాబు ఈ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. దీంతో కన్నాకు నిరాశే మిగిలింది. ఇక గుంటూరు జిల్లా నుంచి చూసుకుంటే నాదెండ్ల మనోహర్, అనగాని సత్యకుమార్, నారా లోకేశ్కు పదవులు దక్కాయి. ఆ జిల్లాకు మూడు మంత్రి పదవులు ఇవ్వడంతో కన్నాను పక్కన పెట్టక తప్పని పరిస్థితి ఎదురైందనే చెప్పాలి.
This post was last modified on June 15, 2024 8:34 pm
వందల కోట్లతో ప్యాన్ ఇండియా మూవీస్ తీస్తున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు అవసరం. ఎవరికైనా ఇది తప్పదు. ఎప్పుడో 2027…
కొన్నేళ్ల ముందు నందమూరి తారకరత్న ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గుండెపోటుకు గురి కావడం, కొన్ని రోజుల పాటు…
ప్రియాంకా చోప్రా మన ప్రేక్షకులకు కొత్త కాదు. హిందీ సినిమాలు రెగ్యులర్ గా ఫాలో అయ్యేవాళ్ళు, రామ్ చరణ్ జంజీర్…
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…