Political News

మార‌ని జ‌గ‌న్‌.. అదే త‌ప్పు!

ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌నాలు ఓటు అనే ఆయుధంతో వైసీపీని పాతాళానికి తొక్కారు. ఈ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీకి కేవ‌లం 11 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌స‌భ స్థానాలు మాత్ర‌మే ద‌క్కాయి. 2019 ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన వైసీపీకి ఈ ఫ‌లితాలు దారుణ ప‌రాభ‌వం కిందే లెక్కా. ఈ ఘోర ప‌రాజ‌యంతోనైనా జ‌గ‌న్ మార‌తార‌ని అనుకుంటే అదేం జ‌ర‌గ‌డం లేద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌గ‌న్ ప‌దే ప‌దే అదే త‌ప్పులు చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. గ‌తంలో ప్ర‌భుత్వ ప‌రంగా, పార్టీ ప‌రంగా త‌న సామాజిక వ‌ర్గానికి మాత్ర‌మే జ‌గ‌న్ అత్యంత ప్రాధాన్య‌త‌నిచ్చిన సంగ‌తి తెలిసిందే. అన్ని కీల‌క పోస్టుల‌నూ త‌న కోట‌రీకే కేటాయించుకున్నారు. ఇది పార్టీలోని సొంత నేత‌ల‌కు, ఇత‌ర వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. అందుకే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు చావుదెబ్బ త‌ప్ప‌లేదు.

ఇప్పుడు ఓడిన త‌ర్వాత కూడా జ‌గ‌న్ త‌న సామాజిక వ‌ర్గానికే ప్ర‌యారిటీ ఇస్తున్నారు. తాజాగా రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌, పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుల నియామ‌కంలోనూ జ‌గ‌న్ మ‌రోసారి త‌ప్ప‌ట‌డుగు వేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లోక్‌స‌భ ప‌క్ష నేత‌గా మిథున్‌రెడ్డి, రాజ్య‌స‌భ ప‌క్ష నేత‌గా విజ‌య‌సాయిరెడ్డి, పార్ల‌మెంట‌రీ పార్టీ నాయ‌కుడిగా వైవీ సుబ్బారెడ్డిని జ‌గ‌న్ నియ‌మించారు. త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన ముగ్గురు ఎంపీల‌కు కీల‌క ప‌ద‌వులు అప్ప‌గించారు. దీంతో మిగిలిన సామాజిక వ‌ర్గాలు వైసీపీని ఎందుకు ప‌ట్టించుకుంటాయ‌నే ప్ర‌శ్న స‌హ‌జంగానే వ‌స్తుంది.

ప‌వ‌ర్ మొత్తం త‌న సామాజిక వ‌ర్గం గుప్పిట్లోనే ఉండాల‌నేలా ప్ర‌వ‌ర్తించిన జ‌గ‌న్‌కు ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు గుణ‌పాఠం చెప్పారు. అయినా జ‌గ‌న్ తీరు మార‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన కొంత‌మంది నాయకుల కార‌ణంగానే పార్టీలోని ఇత‌ర నేత‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ దూర‌మ‌య్యార‌నే అభిప్రాయాలున్నాయి. కానీ జ‌గ‌న్ ఈ నిజాన్ని తెలుసుకోవడం లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ అదే త‌ప్పు చేస్తూ మ‌రింత దిగ‌జారుతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.

This post was last modified on June 15, 2024 4:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

2 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

4 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

11 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

12 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

12 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

14 hours ago