తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ విషయంపైనా దృష్టి పెట్టారు. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. క్రమంలో ఆయన తెలంగాణకు అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారు. గతంలో పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్.. తర్వాత.. ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్లోకి వెళ్లిపోయారు.
దీంతో పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉండడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ సమయంలోనే పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. ఖమ్మం జిల్లాకు చెందిన నామా నాగేశ్వరరావును పార్టీలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంపై కీలక నాయకులు గత రెండు రోజులుగా నామాతో చర్చలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. గతంలో టీడీపీలోనే పనిచేసిన నామా.. ఇప్పుడు బీఆర్ ఎస్లో ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి.. రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. పారిశ్రామిక వేత్త అయిన.. నామా అయితే.. రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలను కూడా ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. అదేసమయంలో బీఆర్ ఎస్ నుంచి కూడా.. నామా వర్గం టీడీపీలోకి చేరే అవకాశం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు.
గతంలో తెలుగుదేశం మాజీ నాయకులతో నిండిపోయిన బీఆర్ ఎస్ పార్టీ….ఇప్పుడు పతనం అవ్వడంతో తిరిగి తెలుగుదేశంలోకి చేరేందుకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ సహా మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. వీరికి చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావడం కలిసి వస్తున్న పరిణామం. తద్వారా.. తమ వ్యాపారాలు వ్యవహారాలు కూడా తెలంగాణలో పుంజుకుంటాయని భావిస్తున్నారు. బీఆర్ ఎస్ను నమ్ముకుంటే.. వచ్చే పదేళ్లు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అందుకే.. టీడీపీ వైపు మెజారిటీ నాయకులు చూస్తున్నారు.
This post was last modified on June 14, 2024 4:07 pm
ఏపీకి నాలుగోసారి(రెండు సార్లు ఉమ్మడి ఏపీ-రెండు సార్లు విభజిత ఏపీ) ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు.…
బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన ఏ చిత్రాన్నీ వాటి మేకర్స్ సరిగా ప్రమోట్ చేయలేదని అభిమానుల్లో అసంతృప్తి ఉంది. సమయానికి…
తెలంగాణలో ఎనిమిది ఎంపీ, ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుని బీజేపీ పార్టీ మాంచి ఊపు మీద ఉంది. మొన్న ఎనిమిది,…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడి కేవలం 11 సీట్లకు పరిమితం అయిన జగన్మోహన్ రెడ్డికి ఇంకా సోషల్ మీడియాలో…
కెజిఎఫ్ బ్లాక్ బస్టర్ తర్వాత విపరీతమైన గ్యాప్ తీసుకున్న హీరో యష్ ప్రస్తుతం టాక్సిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. గీతూ…
ఊహించినట్టే ప్రచారం జరిగినట్టే పుష్ప 2 ది రూల్ వాయిదా వార్త నిన్న రాత్రి అధికారికంగా రావడంతో అల్లు అర్జున్…