తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ విషయంపైనా దృష్టి పెట్టారు. త్వరలోనే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో అక్కడ కూడా పార్టీని బలోపేతం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. క్రమంలో ఆయన తెలంగాణకు అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారు. గతంలో పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్.. తర్వాత.. ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్లోకి వెళ్లిపోయారు.
దీంతో పార్టీకి అధ్యక్షుడు లేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉండడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేవారి సంఖ్య పెరిగిపోయింది. ఈ సమయంలోనే పార్టీని ముందుకు తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్న చంద్రబాబు.. ఖమ్మం జిల్లాకు చెందిన నామా నాగేశ్వరరావును పార్టీలోకి తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంపై కీలక నాయకులు గత రెండు రోజులుగా నామాతో చర్చలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. గతంలో టీడీపీలోనే పనిచేసిన నామా.. ఇప్పుడు బీఆర్ ఎస్లో ఉన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. దీంతో ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించి.. రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించే దిశగా చంద్రబాబు ఆలోచన చేస్తున్నారు. పారిశ్రామిక వేత్త అయిన.. నామా అయితే.. రాష్ట్రంలో పారిశ్రామిక వర్గాలను కూడా ఆకర్షించేందుకు అవకాశం ఉంటుంది. అదేసమయంలో బీఆర్ ఎస్ నుంచి కూడా.. నామా వర్గం టీడీపీలోకి చేరే అవకాశం ఉంటుందని అంచనా వేసుకుంటున్నారు.
గతంలో తెలుగుదేశం మాజీ నాయకులతో నిండిపోయిన బీఆర్ ఎస్ పార్టీ….ఇప్పుడు పతనం అవ్వడంతో తిరిగి తెలుగుదేశంలోకి చేరేందుకు మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ సహా మాజీ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తున్నారు. వీరికి చంద్రబాబు ఏపీలో అధికారంలోకి రావడం కలిసి వస్తున్న పరిణామం. తద్వారా.. తమ వ్యాపారాలు వ్యవహారాలు కూడా తెలంగాణలో పుంజుకుంటాయని భావిస్తున్నారు. బీఆర్ ఎస్ను నమ్ముకుంటే.. వచ్చే పదేళ్లు ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. అందుకే.. టీడీపీ వైపు మెజారిటీ నాయకులు చూస్తున్నారు.
This post was last modified on June 14, 2024 4:07 pm
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…