Political News

చిన్న నిర్ణ‌యం..చంద్ర‌బాబు క్రెడిట్ కొట్టేశారుగా!

అధికారంలోకి రావ‌డం ఎంత క‌ష్ట‌మో.. ప్ర‌జ‌ల్లో మంచి పేరు ఉత్త‌మ పేరు తెచ్చుకోవ‌డం అంతకు నాలుగింత‌లు క‌ష్టం. అందునా.. ప్ర‌జ‌ల్లో ఆదిలోనే పేరు తెచ్చుకోవ‌డం అంటే మాట‌లు కాదు. కానీ.. ఈ క్రెడిట్‌ను టీడీపీ అధినేత చంద్ర‌బాబు కొట్టేశారు. క‌క్ష పూరిత రాజ‌కీయాలు.. నిర్ణ‌యాల‌కు ఆయ‌న చెక్ పెట్టారు. పార్టీ నాయ‌కుల‌కు ఆయ‌న ఏం చెప్పారో.. ఇప్పుడు ఆయ‌న ఆచ‌ర‌ణ‌లోనూ చేసి చూపిస్తున్నారు. గ‌త ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్న కూడా చంద్ర‌బాబు ఫాలో అవుతున్నారు. వాటిని ఆపొద్దు.. అంటూ ఆయ‌న తాజాగా ఆదేశించారు. దీంతో చంద్ర‌బాబు ఔన్న‌త్యం.. ఆయ‌న పాల‌న‌కు ఈ ఆదేశాలు మ‌చ్చుతున‌క‌గా మారాయని పార్టీ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఏం జ‌రిగింది?

గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే చిన్నారులకు ‘జ‌గ‌నన్న విద్యా కానుక‌’ కింద యూనిఫాంలు, షూస్‌, పుస్త‌కాలు, ఇత‌ర వ‌స్తువుల‌ను ఉచితంగానే అందించేది. అయితే.. ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లోనూ తామే అధికారంలోకి వ‌చ్చేస్తామ‌న్న దీమాతో ముందుగానే.. ఆయా వ‌స్తువుల‌ను కొనిపెట్టుకున్నారు. దాదాపు 9 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు వీటిని పంపిణీ చేయాల్సి వుంది. అయితే.. వీటిపై ప‌థ‌కం పేరు ‘జ‌గ‌న‌న్న విద్యాదీవెన’ అలానే ఉంది. దీంతో స‌హ‌జంగానే కొత్త‌గా ఏర్ప‌డిన ప్ర‌భుత్వం వాటిని ముర‌గ‌బెట్టేసే అవ‌కాశం ఉంది. ఎందుకంటే..గ‌త ముఖ్య‌మంత్రి పేరును ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అంగీక‌రించ‌దు. కానీ, తాజాగా చంద్ర‌బాబు ఇలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు.

ప్రభుత్వం మారడంతో ‘జగనన్న విద్యాకానుక’ కింద అందించే ఉచిత పుస్తకాలు,యూనిఫామ్ తో కూడిన కిట్స్ సంగతేంటనే ప్రశ్న తలెత్తింది. అయితే వీటిని యథావిధిగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్కూళ్లు ప్రారంభమయ్యే జూన్ 13 నుంచే పంపిణీ కార్యక్రమం ప్రారంభించాలని ప్ర‌బుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో 9 ల‌క్ష‌ల మందికీ.. వీటిని పంపిణీ చేయ‌నున్నారు. అయితే.. ఇక్క‌డ చిన్న క్లాజు పెట్టారు. గత ప్రభుత్వంలో విద్యా కానుకలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది స‌హ‌జంగానే ఏ ప్ర‌భుత్వ‌మైనా చేస్తుంది.

జ‌గ‌న్ అయితే..

ఇక‌, జ‌గ‌న్ పాల‌నా విష‌యానికి వ‌స్తే.. 2014-19 మ‌ధ్య చంద్ర‌బాబు సీఎంగా ఉన్న కాలంలో చేప‌ట్టిన ప్ర‌తికార్య‌క్ర‌మాన్నీ నిలిపి వేశారు. రాష్ట్రానికే త‌ల‌మానిక‌మైన అమ‌రావ‌తి రాజ‌ధాని ఆపేశారు. కీల‌కమైన స‌మావేశాలు, కార్య‌క్ర‌మాలు చేసుకునేలా 8 కోట్ల రూపాయ‌ల‌తో నిర్మించిన‌ ప్ర‌జావేదిక కూల్చేశారు. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టిన‌ అన్నాక్యాంటీన్ల‌ను నిలిపి వేశారు. అంతేకాదు.. పేద‌ల‌కు ఉద్దేశించి గూడు క‌ల్పించాల‌న్న ల‌క్ష్యంతో నిర్మించిన టిడ్కో ఇళ్ల‌ను పేద‌లు ఎంత ప్రాధేయ ప‌డ్డావాటిని పంపిణీ చేయ కుండా నిలిపివేశారు. అంతేకాదు.. చివ‌ర‌కు దివ్యాంగుల‌కు పంపిణీ చేయాల‌ని కొనుగోలు చేసిన‌.. త్రిచ‌క్ర‌వాహ‌నాల‌ను కూడా చెత్త‌బుట్ట దాఖ‌లు చేశారు త‌ప్ప‌.. క‌నీసం వాటిని పంపిణీ చేద్దామ‌న్న కీల‌క నేత‌ల మాట‌ల‌ను కూడా ఆయ‌న ప‌ట్టించుకోలేదు.

Satya

Recent Posts

గొడవలతో భార్యతో మాట్లాడకపోతే గృహ హింస కాదు

గొడవలు కానీ మనస్పర్థలతో కానీ భార్యతో భర్త మాట్లాడకపోవటం గృహ హింస కిందకు వస్తుందా? మాట్లాడకుండా ఉండటం వేధింపులకు గురి…

6 hours ago

ప్రభాస్ సినిమా పోతుందని ముందే తెలుసట

‘బాహుబలి’కి ముందు ప్రభాస్ కెరీర్లో అత్యంత హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘రెబల్’ ఒకటి. కింగ్ నాగార్జునతో ‘మాస్’ లాంటి బ్లాక్…

9 hours ago

లెనిన్ మీద మెగాభిమానుల గుస్సా

అదేంటి లెనిన్ మీద మెగా ఫ్యాన్స్ కి కోపం ఎందుకు వస్తుందనుకుంటున్నారా. మ్యాటర్ ఉంది లెండి. కొంచెం ఫ్లాష్ బ్యాక్…

11 hours ago

చిరుకు తండ్రిగా గ‌ర్వం… న‌టుడిగా క‌ష్టం

రెండో సినిమా మ‌గ‌ధీర‌తోనే తాను తండ్రికి త‌గ్గ త‌న‌యుడిని అని చాటుకున్నాడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. ఇక…

12 hours ago

పాప రాలేదు.. కుక్క ఇక లేదు.. ఏపీకి స‌వాల్‌గా కేసు!

ఏపీ ప్ర‌భుత్వానికి.. ఉమ్మ‌డి తూర్పుగోదావ‌రి జిల్లా పోలీసుల‌కు కూడా ఓ కేసు స‌వాల్‌గా మారింది. ఓ చిన్నారి అదృశ్యం కేసు…

12 hours ago

కంగనా క్రేజ్ మటాష్

ఇండియన్ సినిమాలో చాలా తక్కువమంది హీరోయిన్లకు సాధ్యమైన హీరోయిక్ ఇమేజ్ సాధించింది కంగనా రనౌత్ ఒక దశలో. ఇండియాలో వంద…

14 hours ago