సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉండే టాలీవుడ్ డైరెక్టర్లో హరీష్ శంకర్ ఒకడు. రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి హరీష్ అస్సలు మొహమాట పడడు. ఈ మధ్య బాలీవుడ్ సోకాల్డ్ ‘లిబరల్స్’ మీద హరీష్ ఎలా పంచులు వేశాడో తెలిసిందే.
మైనారిటీలకు వ్యతిరేకంగా ఏం జరిగినా గళం విప్పే ఈ సూడో సెక్యూలరిస్టులు.. ఇటీవల మహారాష్ట్రలో సాధువుల్ని దారుణంగా కొట్టి చంపితే ఎందుకు మాట్లాడలేదంటూ హరీష్ శంకర్ నిలదీశాడు. అనురాగ్ కశ్యప్ సహా కొందరు లిబరల్స్ ఇప్పుడేమయ్యారంటూ వాళ్ల ఫొటోలు పెట్టి మరీ కౌంటర్లు వేశాడు. తాజాగా ‘ది ప్రింట్’ ఇంటర్నెట్ ఎడిషన్లో రాసిన ఓ వ్యాసం మీద హరీష్ శంకర్ మండిపడ్డాడు. అందులో అక్షయ్ కుమార్ గురించి చేసిన కామెంట్ హరీష్కు ఆగ్రహం తెప్పించింది.
బీజేపీ వాళ్లు భారతీయ పౌరసత్వం తీసుకున్న సోనియా గాంధీని ఇంకా ఇటాలియన్గానే చూస్తారని.. కానీ కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్ కుమార్ను మాత్రం ఇండియన్గా గౌరవిస్తారని ఆ కథనంలో వ్యాఖ్యానించారు. దీనిపై హరీష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మినిమం కామన్ సెన్స్ లేకుండా ఇందులో అక్షయ్ గురించి వ్యాఖ్యలు చేశారని.. అక్షయ్ నిజంగా కెనడా వాసే అయినా తమకు అభ్యంతరం లేదని.. అతను ఈ దేశాన్ని ఏలాలని చూడట్లేదని.. కేవలం వినోదం అందించే ప్రయత్నం చేస్తున్నాడని.. సంక్షోభాలు తలెత్తిన అనేక సందర్భాల్లో అక్షయ్ కోట్ల రూపాయలు సాయం చేశాడని.. మరి సదరు ‘మేడమ్’ ఏం చేసిందని హరీష్ ప్రశ్నించాడు.
ఇలాంటి పోలిక తీసుకురావడం సిగ్గు చేటని.. బీజేపీ మీద నిందలేయాలనుకుంటే వేయొచ్చని.. కానీ సినిమా వాళ్లను టచ్ చేసే సాహసం చేయొద్దని, తాము జనంతో ఉన్నామని అన్నాడు హరీష్. ఆయన ట్వీట్లకు జాతీయ స్థాయిలో నెటిజన్ల నుంచి గట్టి మద్దతే లభించింది.
This post was last modified on April 27, 2020 5:31 pm
ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…
అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…
కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…
ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…
దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…
సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్ నివేదిక వెల్లడైన…