తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి ఎప్పడూ హాట్ కేక్నే తలపిస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తే.. ఆ పార్టీ తరఫున ఇక్కడ నామినేట్ అవుతారు.
ఈ సీటు కోసం.. కోట్ల రూపాయలు ఇచ్చేందుకు కూడా.. చాలా మంది ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూటమి పార్టీల్లోనే.. ఈ పదవి కోసం.. పోటీ ఏర్పడినట్టు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ రేసులో టీడీపీ నాయకుడు.. పిఠాపురం సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ ఎన్ వర్మ పేరు జోరుగా వినిపిస్తోంది.
ఎన్నికలవేళ.. తన సీటును త్యాగం చేయడంతోపాటు.. చంద్రబాబు కోరిక మేరకు వర్మ వ్యవహరించారు. అయితే.. ఆయనకు మంత్రివర్గంలో సీటు ఇవ్వాలని ఉన్నా.. ఇప్పటికిప్పుడు అది సాధ్యం కాదు. మండలిలో సీట్లు ఖాళీ అయ్యేవరకు ఎదురు చూడాల్సి ఉంది.
దీంతో ఈలోగా.. వర్మ.. టీటీడ బోర్డు చైర్మన్ పదవి ని ఇవ్వాలని కోరనున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే.. ఆయన పవన్కు కూడా చెప్పినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. దీంతో ఆయనకు దాదాపు ఈ సీటు ఇచ్చే అవకాశం ఉంది.
ఇక, జనసేనలోనే మరో కీలక నాయకుడు, పవన్ సోదరుడు నాగబాబు… పేరు కూడా వినిపిస్తోంది. కానీ,.. ఆయన వ్యక్తిగత స్వభావానికీ.. టీటీడీ పాలకమండలి చైర్మన్ పదవికి లింకు కుదరడం చాలా కష్టం.
దీంతో ఆయన దాదాపు ఈ పదవికి దూరంగానే ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక, బీజేపీ విషయానికి వస్తే.. ఈ పార్టీలోనూ ఇద్దరు కీలక నాయకులు ఈ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ఒకరు సోము వీర్రాజు. ఈయన పార్టీ హైకమాండ్కు ఇప్పటికే అర్జీ పెట్టుకున్నట్టు సమాచారం.
ఇక, మరోనేత.. తిరుపతికి చెందిన భానుప్రకాశ్ రెడ్డి. ఈయన తాజా ఎన్నికల్లో తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని ఆశించారు. కానీ, బీజేపీ ఆయనకు ఇవ్వలేదు. పైగా.. దీనిని జనసేనకు వదిలేశారు. దీంతో ఇప్పుడు టీటీడీ పదవి రేసులో ఆయన జోరుగా ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు.. బీజేపీ ఏపీ చీఫ్ పురందేశ్వరి భర్త.. మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా.. స్వామి సేవలో తరించాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే..ఈయన పెద్దగా పోటీ ఇవ్వడం లేదు. మొత్తంగా చూస్తే.. టీటీడీ పదవి కోసం.. జోరుగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
This post was last modified on June 10, 2024 7:19 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయడం తనకు కొత్త కాదని, ఎన్నికల్లో పోటీ చేయడం…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…